పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఎలాంటిదో.. సరైన కంటెంట్తో వస్తే సోషల్ మీడియాలో పవన్ ప్రకంపనలు ఎలా ఉంటాయో మరోసారి రుజువవుతోంది. ఆదివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పవన్ కొత్త సినిమా భీమ్లానాయక్ టైటిల్ రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. నిమిషం నిడివి కూడా లేని ఈ గ్లింప్స్.. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వీర లెవెల్లో పబ్లిసిటీ చేసి, ఎంతో హైప్ చేసి రిలీజ్ చేసిన భారీ చిత్రాల టీజర్ల రికార్డులను భీమ్లా నాయక్ అలవోకగా బద్దలు కొట్టేసింది.
దీనికి వస్తున్న వ్యూస్, లైక్స్ చూసి ఇండస్ట్రీ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదేం మాస్.. ఇదేం ఊచకోత అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటిదాకా వచ్చిన తెలుగు సినిమాల టీజర్లలో ఫాస్టెస్ట్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది భీమ్లానాయక్ ఫస్ట్ గ్లింప్స్.
కేవలం 12 గంటల్లోనే 7 మిలియన్ వ్యూస్ మార్కును దాటేశాయి ఈ టీజర్కు. లైక్స్ ఏడు లక్షలకు చేరువగా ఉన్నాయి. కేవలం 52 సెకన్ల వీడియోతో పవన్ యూట్యూబ్లో చేస్తున్న భీభత్సం మామూలుగా లేదు. జస్ట్ లుంగీ కట్టుకొచ్చి రికార్డుల అంతు చూస్తున్నాడంటూ పవన్ ఫ్యాన్స్ ఎలివేషన్లు ఇస్తున్నారు ట్విట్టర్లో. నిజానికి అభిమానులకు ఈ టీజర్ మీద మరీ అంచనాలేమీ లేవు.
ఐతే మళ్లీ మళ్లీ చూసేలా ఉన్న పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, యాటిట్యూడ్, లాస్ట్లో వచ్చే క్యాప్షన్ పంచ్ డైలాగ్ వారిని ఉర్రూతలూగిస్తున్నాయి. మలయాళ మాతృకలోని బ్యాగ్రౌండ్ స్కోర్నే కొంచెం మార్చి మరింత పవర్ఫుల్గా తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. పవన్ ఫ్యాన్స్ అనే కాదు.. సామాన్య ప్రేక్షకులకు కూడా టీజర్ బాగానే నచ్చుతున్నట్లుంది. సంక్రాంతికి థియేటర్లలో పూనకాలు ఖాయం అనిపించేసింది ఈ టీజర్.
This post was last modified on August 16, 2021 7:06 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…