ఒకవైపు అజయ్ దేవగణ్.. ఇంకోవైపు సంజయ్ దత్.. ఇంకా సోనాక్షి సిన్హా, శరద్ ఖేద్కర్, ప్రణీతా సుభాష్, నోరా ఫతేహి లాంటి పేరున్న తారాగణం.. భూషణ్ కుమార్ సహా ఐదారుగురు పేరున్న నిర్మాతల భాగస్వామ్యం.. అన్నింటికీ మించి భారత దేశ చరిత్రలో కీలక పరిణామాల్లో ఒకటిగా చెప్పుకునే 1971 నాటి భుజ్ యుద్ధ నేపథ్యంలో అల్లుకున్న దేశభక్తి కథ.. ఇవన్నీ కలిసి ‘భుజ్: ది ప్రైడ్’ మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకునేలా చేశాయి. ఐతే ఆ అంచనాలన్నీ శుక్రవారం కూలిపోయాయి.
హాట్ స్టార్ ఓటీటీ వేదికగా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇండియాలో ఓటీటీ ద్వారా రిలీజైన అతి పెద్ద సినిమాల్లో ఒకటైన ‘భుజ్’.. దాదాపు ఏడాది నుంచి ఈ సినిమా కోసం నిరీక్షిస్తున్న ప్రేక్షకులకు పెద్ద షాకే ఇచ్చింది. పోయినేడాది కరోనా టైంలోనే ఈ చిత్రాన్ని హాట్ స్టార్లో నేరుగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికి ఆ చిత్రం మేకింగ్ దశలో ఉంది. కరోనా బ్రేక్ తర్వాత సినిమాను పూర్తి చేసి, సెకండ్ వేవ్ కూడా అయ్యాక ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ చేశారు. ఐతే ఈ తరహా చిత్రాల్లో ప్రేక్షకులను భావోద్వేగాలను గురి చేయడం.. దేశభక్తి భావనను తీసుకురావడం కీలకం.
ఐతే సినిమా అంతటా ఆర్టిఫిషియల్ ఎమోషన్ తప్పితే సహజంగా ప్రేక్షకుల్లో భావోద్వేగాలు తట్టి లేపే అంశాలే లేకపోయాయి. అసహజంగా అనిపించిన చాలా ఎపిసోడ్లు సినిమా మీద ఆసక్తి సన్నగిల్లిపోయేలా చేశాయన్నది మెజారిటీ ప్రేక్షకులు అంటున్న మాట. విజువల్ ఎఫెక్ట్స్లో భారీతనం చూపించే క్రమంలో సహజత్వం లోపించడంతో సినిమా పట్ల ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. పూర్తిగా నెగెటివ్ రివ్యూలే వస్తున్నాయి ఈ చిత్రానికి. బాలీవుడ్ క్రిటిక్స్ అటు ఇటుగా ‘2’ రేటింగ్కు పరిమితం చేస్తున్నారు. లక్ష్మి, బిగ్ బబుల్ తరహాలోనే హాట్స్టార్ రిలీజ్ చేసిన మరో డిజాస్టర్ మూవీ అంటూ ‘భుజ్’ను తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on August 14, 2021 9:50 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…