బాలీవుడ్ స్టార్లు సౌత్ ఇండియాలో షూటింగ్ చేయాలనుకుంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మహా నగరాలనే ఎంచుకుంటారు. ముఖ్యంగా మన భాగ్యనగరంలో బాలీవుడ్ సినిమాల చిత్రీకరణ సర్వ సాధారణమే. ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడియో అయిన రామోజీ ఫిలిం సిటీలో వందల సంఖ్యలో బాలీవుడ్ చిత్రాల చిత్రీకరణ సాగింది.
కానీ తెలుగు రాష్ట్రాల్లోని చిన్న టౌన్లకు వెళ్లి హిందీ సినిమాల షూటింగ్ చేయడం చాలా అరుదు. అందులోనూ ఆమిర్ ఖాన్ లాంటి బడా బాలీవుడ్ స్టార్ తన చిత్రం షూటింగ్ కోసం ఆంధ్రా ప్రాంతంలోని అమలాపురం అనే టౌన్కు రావడం ఊహించలేం. ఐతే ఇప్పుడు అదే జరుగుతోంది.
తన కొత్త చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ కోసం మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమలాపురానికి విచ్చేసినట్లు సమాచారం. అమలాపురంతో పాటు కాకినాడ పోర్టులోనూ ఈ సినిమాకు సంబంధించి ఒకట్రెండు రోజుల చిత్రీకరణ చేస్తున్నారట.
‘లాల్ సింగ్ చద్దా’లో టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆధారమైన హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’లో ఓ అరగంట కనిపించే కీలకమైన పాత్ర ఉంటుంది. ఆ పాత్ర సినిమాలో అర్ధంతరంగా ముగిసిపోతుంది. ఐతే ఆ పాత్ర కలను హీరో నెరవేరుస్తాడు. అందుకోసం ఆ వ్యక్తి ఇంటిని వెతుక్కుంటూ తన ప్రాంతానికి వస్తాడు.
బహుశా ‘లాల్ సింగ్ చద్దా’లో చైతూను ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చూపించి ఉండొచ్చు. సంబంధిత సన్నివేశాల చిత్రీకరణ కోసమే ఆమిర్ అండ్ కో అమలాపురానికి వచ్చి ఉండొచ్చు. దీంతో పాటు పోర్టులో కూడా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారం చూస్తుంటే ‘లాల్ సింగ్ చద్దా’తో తెలుగు ప్రేక్షకులు బాగానే కనెక్టయ్యే అవకాశముంది. ఆమిర్ మాజీ మేనేజర్ అయిన అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్మస్కు రిలీజ్ చేయాలనే ప్రణాళికలో ఉన్నారు.
This post was last modified on August 13, 2021 2:40 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…