బాలీవుడ్ స్టార్లు సౌత్ ఇండియాలో షూటింగ్ చేయాలనుకుంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మహా నగరాలనే ఎంచుకుంటారు. ముఖ్యంగా మన భాగ్యనగరంలో బాలీవుడ్ సినిమాల చిత్రీకరణ సర్వ సాధారణమే. ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడియో అయిన రామోజీ ఫిలిం సిటీలో వందల సంఖ్యలో బాలీవుడ్ చిత్రాల చిత్రీకరణ సాగింది.
కానీ తెలుగు రాష్ట్రాల్లోని చిన్న టౌన్లకు వెళ్లి హిందీ సినిమాల షూటింగ్ చేయడం చాలా అరుదు. అందులోనూ ఆమిర్ ఖాన్ లాంటి బడా బాలీవుడ్ స్టార్ తన చిత్రం షూటింగ్ కోసం ఆంధ్రా ప్రాంతంలోని అమలాపురం అనే టౌన్కు రావడం ఊహించలేం. ఐతే ఇప్పుడు అదే జరుగుతోంది.
తన కొత్త చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ కోసం మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమలాపురానికి విచ్చేసినట్లు సమాచారం. అమలాపురంతో పాటు కాకినాడ పోర్టులోనూ ఈ సినిమాకు సంబంధించి ఒకట్రెండు రోజుల చిత్రీకరణ చేస్తున్నారట.
‘లాల్ సింగ్ చద్దా’లో టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆధారమైన హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’లో ఓ అరగంట కనిపించే కీలకమైన పాత్ర ఉంటుంది. ఆ పాత్ర సినిమాలో అర్ధంతరంగా ముగిసిపోతుంది. ఐతే ఆ పాత్ర కలను హీరో నెరవేరుస్తాడు. అందుకోసం ఆ వ్యక్తి ఇంటిని వెతుక్కుంటూ తన ప్రాంతానికి వస్తాడు.
బహుశా ‘లాల్ సింగ్ చద్దా’లో చైతూను ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చూపించి ఉండొచ్చు. సంబంధిత సన్నివేశాల చిత్రీకరణ కోసమే ఆమిర్ అండ్ కో అమలాపురానికి వచ్చి ఉండొచ్చు. దీంతో పాటు పోర్టులో కూడా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారం చూస్తుంటే ‘లాల్ సింగ్ చద్దా’తో తెలుగు ప్రేక్షకులు బాగానే కనెక్టయ్యే అవకాశముంది. ఆమిర్ మాజీ మేనేజర్ అయిన అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్మస్కు రిలీజ్ చేయాలనే ప్రణాళికలో ఉన్నారు.
This post was last modified on August 13, 2021 2:40 pm
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారన్న విషయంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విచారణకు…
పెద్ద హీరోల సినిమాలకు ఏ టైటిల్ పెట్టినా చెల్లుతుందనుకోవడం తప్పు. ఎంపికలో ఏ మాత్రం పొరపాటు చేసినా దాని ప్రభావం…
``జగన్ గురించి ఎందుకు అంత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారో.. నాకు ఇప్పటికీ అర్ధం కాదు. ఆయన చాలా మంచి వారు.…
జనసేన నేత కిరణ్ రాయల్ పై రేగిన వివాదంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. రోజుకో కొత్త పరిణామం చోటుచేసుకుంటూ…
ఏఐ దిగ్గజం `మెటా` చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి, `ఫేస్ బుక్` అధినేత మార్క్ జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా... ఆరంటే ఆరు నిమిషాల్లోనే ఓ నిండు ప్రాణాన్ని పోలీసులు కాపాడారు. అది కూడా ఎక్కడో…