బాలీవుడ్ స్టార్లు సౌత్ ఇండియాలో షూటింగ్ చేయాలనుకుంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మహా నగరాలనే ఎంచుకుంటారు. ముఖ్యంగా మన భాగ్యనగరంలో బాలీవుడ్ సినిమాల చిత్రీకరణ సర్వ సాధారణమే. ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడియో అయిన రామోజీ ఫిలిం సిటీలో వందల సంఖ్యలో బాలీవుడ్ చిత్రాల చిత్రీకరణ సాగింది.
కానీ తెలుగు రాష్ట్రాల్లోని చిన్న టౌన్లకు వెళ్లి హిందీ సినిమాల షూటింగ్ చేయడం చాలా అరుదు. అందులోనూ ఆమిర్ ఖాన్ లాంటి బడా బాలీవుడ్ స్టార్ తన చిత్రం షూటింగ్ కోసం ఆంధ్రా ప్రాంతంలోని అమలాపురం అనే టౌన్కు రావడం ఊహించలేం. ఐతే ఇప్పుడు అదే జరుగుతోంది.
తన కొత్త చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ కోసం మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమలాపురానికి విచ్చేసినట్లు సమాచారం. అమలాపురంతో పాటు కాకినాడ పోర్టులోనూ ఈ సినిమాకు సంబంధించి ఒకట్రెండు రోజుల చిత్రీకరణ చేస్తున్నారట.
‘లాల్ సింగ్ చద్దా’లో టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆధారమైన హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’లో ఓ అరగంట కనిపించే కీలకమైన పాత్ర ఉంటుంది. ఆ పాత్ర సినిమాలో అర్ధంతరంగా ముగిసిపోతుంది. ఐతే ఆ పాత్ర కలను హీరో నెరవేరుస్తాడు. అందుకోసం ఆ వ్యక్తి ఇంటిని వెతుక్కుంటూ తన ప్రాంతానికి వస్తాడు.
బహుశా ‘లాల్ సింగ్ చద్దా’లో చైతూను ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చూపించి ఉండొచ్చు. సంబంధిత సన్నివేశాల చిత్రీకరణ కోసమే ఆమిర్ అండ్ కో అమలాపురానికి వచ్చి ఉండొచ్చు. దీంతో పాటు పోర్టులో కూడా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారం చూస్తుంటే ‘లాల్ సింగ్ చద్దా’తో తెలుగు ప్రేక్షకులు బాగానే కనెక్టయ్యే అవకాశముంది. ఆమిర్ మాజీ మేనేజర్ అయిన అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్మస్కు రిలీజ్ చేయాలనే ప్రణాళికలో ఉన్నారు.
This post was last modified on August 13, 2021 2:40 pm
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…