బాలీవుడ్ స్టార్లు సౌత్ ఇండియాలో షూటింగ్ చేయాలనుకుంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మహా నగరాలనే ఎంచుకుంటారు. ముఖ్యంగా మన భాగ్యనగరంలో బాలీవుడ్ సినిమాల చిత్రీకరణ సర్వ సాధారణమే. ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడియో అయిన రామోజీ ఫిలిం సిటీలో వందల సంఖ్యలో బాలీవుడ్ చిత్రాల చిత్రీకరణ సాగింది.
కానీ తెలుగు రాష్ట్రాల్లోని చిన్న టౌన్లకు వెళ్లి హిందీ సినిమాల షూటింగ్ చేయడం చాలా అరుదు. అందులోనూ ఆమిర్ ఖాన్ లాంటి బడా బాలీవుడ్ స్టార్ తన చిత్రం షూటింగ్ కోసం ఆంధ్రా ప్రాంతంలోని అమలాపురం అనే టౌన్కు రావడం ఊహించలేం. ఐతే ఇప్పుడు అదే జరుగుతోంది.
తన కొత్త చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ కోసం మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమలాపురానికి విచ్చేసినట్లు సమాచారం. అమలాపురంతో పాటు కాకినాడ పోర్టులోనూ ఈ సినిమాకు సంబంధించి ఒకట్రెండు రోజుల చిత్రీకరణ చేస్తున్నారట.
‘లాల్ సింగ్ చద్దా’లో టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆధారమైన హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’లో ఓ అరగంట కనిపించే కీలకమైన పాత్ర ఉంటుంది. ఆ పాత్ర సినిమాలో అర్ధంతరంగా ముగిసిపోతుంది. ఐతే ఆ పాత్ర కలను హీరో నెరవేరుస్తాడు. అందుకోసం ఆ వ్యక్తి ఇంటిని వెతుక్కుంటూ తన ప్రాంతానికి వస్తాడు.
బహుశా ‘లాల్ సింగ్ చద్దా’లో చైతూను ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చూపించి ఉండొచ్చు. సంబంధిత సన్నివేశాల చిత్రీకరణ కోసమే ఆమిర్ అండ్ కో అమలాపురానికి వచ్చి ఉండొచ్చు. దీంతో పాటు పోర్టులో కూడా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారం చూస్తుంటే ‘లాల్ సింగ్ చద్దా’తో తెలుగు ప్రేక్షకులు బాగానే కనెక్టయ్యే అవకాశముంది. ఆమిర్ మాజీ మేనేజర్ అయిన అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్మస్కు రిలీజ్ చేయాలనే ప్రణాళికలో ఉన్నారు.
This post was last modified on August 13, 2021 2:40 pm
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…