జబర్దస్త్ షోలో కళ్లు చెదిరే గ్లామర్తో తెలుగు యాంకరింగ్ ట్రెండునే మార్చేసిన భామ అనసూయ భరద్వాజ్. అప్పటిదాకా యాంకర్లంటే ట్రెడిషనల్గా కనిపించేవారు కానీ.. అనసూయ హవా మొదలయ్యాక అందరూ చాలామంది గ్లామర్ రూట్లోకి వచ్చేశారు.
జబర్దస్త్తో వచ్చిన గుర్తింపుతో సినిమాల్లోనూ మంచి మంచి అవకాశాలు అందుకుని దూసుకెళ్తోంది అనసూయ. ఆమెకు నటిగా చాలా మంచి గుర్తింపు తెచ్చిన సినిమా అంటే.. రంగస్థలం అనే చెప్పాలి. అందులో రంగమ్మత్తగా అనసూయ నటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆమెలో ఇంత మంచి నటి ఉందా అనిపించిందా సినిమా. రంగస్థలంలో అనసూయ గెటప్ కూడా చాలా చక్కగా కుదిరింది. ఈ క్రెడిట్ దర్శకుడు సుకుమార్కే ఇవ్వాలి. ఇప్పుడు అనసూయకు ఆయన మరో మంచి పాత్ర ఇచ్చినట్లే కనిపిస్తోంది.
సుక్కు కొత్త చిత్రం పుష్పలోనూ అనసూయ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమెది ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అంటున్నారు. చిత్తూరు వేష భాషలతో సాగే ఈ పాత్ర అనసూయకు కొత్తగా ఉంటుందనడంలో సందేహం లేదు.ఈ పాత్రలో అనసూయ గెటప్ కూడా చాలా కొత్తగా ఉండబోతోందని సంకేతాలు వస్తున్నాయి. తాజాగా అనసూయ ఆన్ లొకేషన్ స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో తక్కువ జుట్టుతో హెవీ మేకప్తో, పెద్ద బొట్టుతో చిత్రంగా కనిపిస్తోంది అనసూయ. మొత్తంగా ఆమె గెటప్ జిగేల్జిగేల్మనిపించేలా ఉంది.
పుష్ప కొన్ని దశాబ్దాల వెనుకటి నేపథ్యంలో నడిచే కథ. అప్పట్లో చిత్తూరులో కొంచెం ఢాంబికంతో ఉండే లేడీస్ను బాగా స్టడీ చేసి ఈ పాత్రను డిజైన్ చేసినట్లున్నాడు సుక్కు. గెటప్ చూస్తే ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ పాత్ర.. సినిమాలో ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ పాత్ర కూడా క్లిక్ అయితే అనసూయ కెరీర్ మరో మలుపు తిరిగినట్లే.
This post was last modified on August 12, 2021 10:07 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…