విజయేంద్ర ప్రసాద్.. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ రైటర్లలో ఆయనొకడు. సమరసింహారెడ్డి మొదలుకుని.. బాహుబలి వరకు ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించారు. ముఖ్యంగా బాహుబలి, భజరంగి భాయిజాన్ లాంటి సినిమాలతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. 77 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా తీరిక లేకుండా పని చేస్తున్నారాయన. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న కొత్త చిత్రం ఆర్ఆర్ఆర్కు కూడా కథ అందించింది విజయేంద్రనే. జక్కన్న కలల ప్రాజెక్టు మహాభారతంకు కూడా ఆయనే స్క్రిప్టు అందిస్తాడనడంలో సందేహం లేదు. ఐతే రచయితగా ఎంత గొప్ప పేరు సంపాదించినా.. దర్శకుడిగా కూడా రుజువు చేసుకోవాలన్నది విజయేంద్ర ప్రసాద్ కోరిక. ఇందుకోసం గతంలో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు.
అర్ధాంగి అనే ఫ్లాప్ సినిమాతో దర్శకుడిగా మారిన విజయేంద్ర ప్రసాద్.. తర్వాత శ్రీకృష్ణ 2006తోనూ మెప్పించలేకపోయారు. రాజన్నతో ఓకే అనిపించినా.. తర్వాత శ్రీవల్లి మూవీతో డిజాస్టర్ ఫలితాన్నందించారు. ఈ దెబ్బతో మళ్లీ దర్శకత్వం జోలికి ఆయన వెళ్లరని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఆగట్లేదట. మళ్లీ మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమవుతున్నారట. తన రైటింగ్ టీంతో కలిసి ఆయన ఓ కొత్త కథ తయారు చేశారట. ఈసారి కన్నడ, మరో భాష వైపు చూడకుండా ఓ తెలుగు యువ కథానాయకుడితో సినిమా తీయాలని చూస్తున్నారట విజయేంద్ర. ఆయనకు నిర్మాత కూడా దొరికారని.. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా గురించి ప్రకటన చేస్తారని అంటున్నారు. కమర్షియల్గానూ వర్కవుటయ్యే ప్రయోగాత్మక కథతో ఆయన రాబోతున్నట్లు సమాచారం.
This post was last modified on May 27, 2020 2:11 am
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…