విజయేంద్ర ప్రసాద్.. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ రైటర్లలో ఆయనొకడు. సమరసింహారెడ్డి మొదలుకుని.. బాహుబలి వరకు ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించారు. ముఖ్యంగా బాహుబలి, భజరంగి భాయిజాన్ లాంటి సినిమాలతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. 77 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా తీరిక లేకుండా పని చేస్తున్నారాయన. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న కొత్త చిత్రం ఆర్ఆర్ఆర్కు కూడా కథ అందించింది విజయేంద్రనే. జక్కన్న కలల ప్రాజెక్టు మహాభారతంకు కూడా ఆయనే స్క్రిప్టు అందిస్తాడనడంలో సందేహం లేదు. ఐతే రచయితగా ఎంత గొప్ప పేరు సంపాదించినా.. దర్శకుడిగా కూడా రుజువు చేసుకోవాలన్నది విజయేంద్ర ప్రసాద్ కోరిక. ఇందుకోసం గతంలో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు.
అర్ధాంగి అనే ఫ్లాప్ సినిమాతో దర్శకుడిగా మారిన విజయేంద్ర ప్రసాద్.. తర్వాత శ్రీకృష్ణ 2006తోనూ మెప్పించలేకపోయారు. రాజన్నతో ఓకే అనిపించినా.. తర్వాత శ్రీవల్లి మూవీతో డిజాస్టర్ ఫలితాన్నందించారు. ఈ దెబ్బతో మళ్లీ దర్శకత్వం జోలికి ఆయన వెళ్లరని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఆగట్లేదట. మళ్లీ మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమవుతున్నారట. తన రైటింగ్ టీంతో కలిసి ఆయన ఓ కొత్త కథ తయారు చేశారట. ఈసారి కన్నడ, మరో భాష వైపు చూడకుండా ఓ తెలుగు యువ కథానాయకుడితో సినిమా తీయాలని చూస్తున్నారట విజయేంద్ర. ఆయనకు నిర్మాత కూడా దొరికారని.. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా గురించి ప్రకటన చేస్తారని అంటున్నారు. కమర్షియల్గానూ వర్కవుటయ్యే ప్రయోగాత్మక కథతో ఆయన రాబోతున్నట్లు సమాచారం.
This post was last modified on May 27, 2020 2:11 am
చెల్లెలికి బర్త్డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…
ప్రపంచం మొత్తంలో ఉన్న ఫిలిం మేకర్స్ ఆరాధనాభావంతో చూసే దర్శకుడు జేమ్స్ క్యామరూన్. అవతార్ అనే ఊహాతీత లోకాన్ని సృష్టించి…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ‘యురి: ది సర్జికల్ స్ట్రైక్’ దర్శకుడు ఆదిత్య ధర్ స్వీయ నిర్మాణంలో…