Movie News

ఓటీటీ రిలీజ్‌లపై మహేష్ ఒపీనియన్

కరోనా దెబ్బకు థియేటర్ ఇండస్ట్రీ విలవిలలాడిపోగా.. ఓటీటీ ఇండస్ట్రీ మాత్రం అద్భుతంగా పుంజుకుంది. ఇండియాలో ఓటీటీ విప్లవం రావడానికి కరోనా కారణమైంది. ఆల్రెడీ ఉన్న వాటికి కొత్త ఓటీటీలు తోడయ్యాయి. కుప్పలు కుప్పలుగా కంటెంట్ ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే కొత్త కొత్త చిత్రాలను కూడా నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. ముందు చిన్న సినిమాలే వచ్చాయి కానీ.. రాను రాను పెద్ద పెద్ద చిత్రాలు సైతం ఓటీటీ బాట పడుతున్నాయి.

ఈ మధ్యే తెలుగులో ‘నారప్ప’ లాంటి పెద్ద సినిమా ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో అయితే అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ లాంటి సూపర్ స్టార్లు నటించిన సినిమాలు ఓటీటీల ద్వారా విడుదల కావడం తెలిసిందే. ఐతే తెలుగులో కూడా భవిష్యత్తులో ఈ ఒరవడి మొదలవుతుందా అన్న చర్చ నడుస్తోంది.

ఐతే మిగతా స్టార్ల విషయం ఏమో కానీ.. మహేష్ బాబు మాత్రం తన చిత్రాలను ఎప్పటికీ ఓటీటీల్లో రిలీజ్ చేసే అవకాశం లేదన్నట్లు సంకేతాలిచ్చాడు. తన అభిమానులకు థియేటర్లతో ఉన్న కనెక్షన్‌ను తాను తెంచబోనని.. తన సినిమాలన్నీ థియేటర్లలో ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా తెరకెక్కుతాయని.. వాటిని ఆ మార్గంలోనే రిలీజ్ చేస్తామని అతను స్పష్టం చేశాడు.

ఐతే అలాగని ఓటీటీలను తక్కువ చేసి చూడనని మహేష్ అన్నాడు. ఓటీటీలను తాను గౌరవిస్తానని చెప్పాడు. ఓటీటీ అనేది ప్ర‌త్యేక‌మైన సంస్థ అని మ‌హేష్ వ్యాఖ్యానించాడు. అయితే మ‌న సూప‌ర్ స్టార్ ఇప్పుడిలా అంటున్నాడు కానీ.. ఏమో భ‌విష్య‌త్తులో ఒకేసారి థియేట‌ర్ల‌లో, ఓటీటీల్లో భారీ చిత్రాలు విడుద‌ల కావ‌చ్చేమో. ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో మ‌హేష్ లాంటి హీరోల సినిమాలూ నేరుగా ఓటీటీలో విడుద‌ల‌వుతాయేమో. అస‌లు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు ఓటీటీలో నేరుగా రిలీజ‌వుతాయనే కొన్నేళ్ల ముందు ఊహించ‌లేదు. మ‌రి భ‌విష్య‌త్తులో ఏమ‌వుతుందో?

Satya

Recent Posts

అఖిల్ ఈసారి ఆ తప్పు చేయకూడదు

అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…

2 minutes ago

తారక్ సినిమా లక్ష్యాలు చాలా పెద్దవి

ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…

37 minutes ago

వెయ్యి కోట్ల దురంధర్… అక్కడేమో డిజాస్టర్

పెద్దగా అంచనాలు లేకుండా గత ఏడాది డిసెంబర్ లో దురంధర్ విడుదలైనప్పుడు ఎవరూ దాని సునామిని ఊహించలేదు. వంద కోట్లు…

1 hour ago

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…

3 hours ago

పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…

4 hours ago

ఏనుగు ఇంతలా పగబట్టేసిందా

పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…

4 hours ago