ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సౌత్ లో ఒరిజినల్ కంటెంట్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఆంథాలజీ కథలను నిర్మిస్తోంది. ఇటీవల కోలీవుడ్ స్టార్స్ అంతా కలిసి నటించిన ‘నవరస’ ఆంథాలజీ డ్రామాను నెట్ ఫ్లిక్స్ లోనే విడుదల చేశారు. ఇందులో మూడు కథలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ మరిన్ని ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతోంది. ఈ క్రమంలో రానా దగ్గుబాటి-వెంకటేష్ లతో కలిసి ఓ వెబ్ సిరీస్ నిర్మించడానికి ప్లాన్ చేస్తుంది.
ఇటీవల నెట్ ఫ్లిక్స్ సంస్థతో మంతనాలు జరిపిన రానా తన బాబాయ్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ మధ్యకాలంలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమవుతున్నారట. అయితే దీన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
ఇటీవల వెంకటేష్ నటించిన ‘నారప్ప’ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల చేశారు. ఆయన నటించిన ‘దృశ్యం 2’ సినిమాను కూడా ఓటీటీలోనే రిలీజ్ చేయబోతున్నారు. రానా ‘విరాటపర్వం’ సినిమా కూడా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. కానీ ఈ విషయంలో ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సంస్థతో కలిసి రానా వెబ్ సిరీస్ నిర్మించాలనుకోవడం విశేషం. అందులో వెంకటేష్ కూడా నటిస్తుండడంతో బజ్ ఏర్పడింది. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.
This post was last modified on August 10, 2021 3:58 pm
1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…
జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో…
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…