ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సౌత్ లో ఒరిజినల్ కంటెంట్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఆంథాలజీ కథలను నిర్మిస్తోంది. ఇటీవల కోలీవుడ్ స్టార్స్ అంతా కలిసి నటించిన ‘నవరస’ ఆంథాలజీ డ్రామాను నెట్ ఫ్లిక్స్ లోనే విడుదల చేశారు. ఇందులో మూడు కథలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ మరిన్ని ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతోంది. ఈ క్రమంలో రానా దగ్గుబాటి-వెంకటేష్ లతో కలిసి ఓ వెబ్ సిరీస్ నిర్మించడానికి ప్లాన్ చేస్తుంది.
ఇటీవల నెట్ ఫ్లిక్స్ సంస్థతో మంతనాలు జరిపిన రానా తన బాబాయ్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ మధ్యకాలంలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమవుతున్నారట. అయితే దీన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
ఇటీవల వెంకటేష్ నటించిన ‘నారప్ప’ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల చేశారు. ఆయన నటించిన ‘దృశ్యం 2’ సినిమాను కూడా ఓటీటీలోనే రిలీజ్ చేయబోతున్నారు. రానా ‘విరాటపర్వం’ సినిమా కూడా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. కానీ ఈ విషయంలో ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సంస్థతో కలిసి రానా వెబ్ సిరీస్ నిర్మించాలనుకోవడం విశేషం. అందులో వెంకటేష్ కూడా నటిస్తుండడంతో బజ్ ఏర్పడింది. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.
This post was last modified on August 10, 2021 3:58 pm
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…
ప్రియాంకా చోప్రా మన ప్రేక్షకులకు కొత్త కాదు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, రామ్ చరణ్ జంజీర్…
నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్లో, లవర్ బాయ్గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…