ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సౌత్ లో ఒరిజినల్ కంటెంట్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఆంథాలజీ కథలను నిర్మిస్తోంది. ఇటీవల కోలీవుడ్ స్టార్స్ అంతా కలిసి నటించిన ‘నవరస’ ఆంథాలజీ డ్రామాను నెట్ ఫ్లిక్స్ లోనే విడుదల చేశారు. ఇందులో మూడు కథలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ మరిన్ని ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతోంది. ఈ క్రమంలో రానా దగ్గుబాటి-వెంకటేష్ లతో కలిసి ఓ వెబ్ సిరీస్ నిర్మించడానికి ప్లాన్ చేస్తుంది.
ఇటీవల నెట్ ఫ్లిక్స్ సంస్థతో మంతనాలు జరిపిన రానా తన బాబాయ్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ మధ్యకాలంలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమవుతున్నారట. అయితే దీన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
ఇటీవల వెంకటేష్ నటించిన ‘నారప్ప’ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల చేశారు. ఆయన నటించిన ‘దృశ్యం 2’ సినిమాను కూడా ఓటీటీలోనే రిలీజ్ చేయబోతున్నారు. రానా ‘విరాటపర్వం’ సినిమా కూడా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. కానీ ఈ విషయంలో ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సంస్థతో కలిసి రానా వెబ్ సిరీస్ నిర్మించాలనుకోవడం విశేషం. అందులో వెంకటేష్ కూడా నటిస్తుండడంతో బజ్ ఏర్పడింది. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.
This post was last modified on August 10, 2021 3:58 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…