సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ నుంచి బ్లాస్టర్ పేరుతో రిలీజైన టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతోంది. ఈ టీజర్ అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఉండటంతో అభిమానుల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. తమకేం కావాలో అదే ఇచ్చారంటూ ‘సర్కారు వారి పాట’ టీంను ఆకాశానికెత్తేస్తున్నారు. అన్నింటికీ మించి వారిని ఆకట్టుకుంటున్నది.. మహేష్ లుక్.. బాడీ లాంగ్వేజ్.. స్క్రీన్ ప్రెజెన్స్లో వచ్చిన మార్పు. కెరీర్లో ఎక్కువగా మూడీగా ఉండే సీరియస్ క్యారెక్టర్లే చేశాడు మహేష్.
ఈ టైపు పాత్రలు చూసి చూసి ప్రేక్షకులకు బోర్ కొట్టేసింది. ఖలేజా, పోకిరి, దూకుడు సినిమాల్లో మాదిరి మహేష్ మంచి జోష్తో కనిపించాలని.. పాత్రల్లో మాస్ టచ్ ఉండాలని.. అల్లరల్లరి చేయాలని.. హుషారుగా నటించాలని అభిమానులు కోరుకుంటారు. కానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే మహేష్ దగ్గరికి ఇలాంటి పాత్రలు వస్తుంటాయి.
‘దూకుడు’ తర్వాత ‘ఆగడు’లో కొంచెం అల్లరి చేసినా.. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మహేష్ మళ్లీ మూడీ క్యారెక్టర్లే చేస్తూ వచ్చాడు. శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, స్పైడర్, భరత్ అనే నేను.. ఈ చిత్రాలే అందుకు నిదర్శనం. వీటిలో ఏది హిట్టు, ఏది ఫ్లాప్ అన్నది పక్కన పెడితే.. మహేష్ మాత్రం దాదాపుగా సేమ్ లుక్స్తో, మూడీగా కనిపిస్తాడు. ఈ టైపు జెంటిల్మన్ పాత్రల్ని పక్కన పెట్టి మహేష్ జోష్ చూపించరాలని, యూత్ఫుల్గా కనిపించాలన్నది మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయం. ‘సరిలేరు నీకెవ్వరు’లో కొంత మేర అలా ట్రై చేసినా అభిమానులు ఇంకా ఏదో ఆశిస్తున్నారు.
‘సర్కారు వారి పాట’ ఆ లోటును భర్తీ చేసేలాగే కనిపించింది. టీజర్లో విలన్లకు వార్నింగ్ ఇచ్చే సీన్.. ఆ తర్వాత హీరోయిన్ని చూసి ఇచ్చే ఎక్స్ప్రెషన్.. చివర్లో మల్లెపూల గురించి పేల్చిన డైలాగ్ అభిమానులకు కనువిందుగా అనిపించాయి. మహేష్ పాత రోజుల్లోకి తీసుకెళ్లిపోయాడని.. మళ్లీ ఆయన పాత్రలో యూత్ఫుల్నెస్, జోష్ కనిపిస్తోందని, సినిమా బ్లాక్బస్టర్ కావడం ఖాయమని వాళ్లు ఆనందోత్సాహాల్లో కనిపిస్తున్నారు.
This post was last modified on August 9, 2021 1:52 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…