మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల విషయంలో జోరు పెంచారు. యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న చిరు తన తదుపరి సినిమాగా ‘లూసిఫర్’ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నారు. ఆ తరువాత దర్శకుడు బాబీ, మెహర్ రమేష్ లతో కలిసి పనిచేయనున్నారు. ఏడాదికి మూడు సినిమాలు చేసేలా చిరు ప్లాన్ చేస్తున్నారు.
రీసెంట్ గా దర్శకుడు మారుతి కూడా చిరుకి కథ చెప్పారని.. త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ప్రభుదేవా పేరు కూడా వినిపిస్తోంది. కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా సినిమాలు చేసి ఆ తరువాత మెగాఫోన్ పట్టుకొని డైరెక్టర్ గా మారారు ప్రభుదేవా. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. తెలుగులో కూడా సినిమాలు చేశారు.
మెగాస్టార్ చిరంజీవిని హీరోగా పెట్టి ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా చేశారు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఇప్పుడు ప్రభుదేవాకు మరో ఛాన్స్ ఇవ్వడానికి చిరు రెడీ అవుతున్నారట. ప్రభుదేవా రీమేక్ కథలను బాగా తీయగలరు. అందుకే చిరు ఇప్పుడు ఓ రీమేక్ కథను ప్రభుదేవాకి అప్పగించాలని చూస్తున్నారు. అయితే ఈ రీమేక్ ఏంటి..? ఏ భాషకు చెందినదనే విషయాలు మాత్రం బయటకు రాలేదు. మరి ఈ కాంబో ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూద్దాం!
This post was last modified on August 6, 2021 7:52 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…