మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల విషయంలో జోరు పెంచారు. యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న చిరు తన తదుపరి సినిమాగా ‘లూసిఫర్’ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నారు. ఆ తరువాత దర్శకుడు బాబీ, మెహర్ రమేష్ లతో కలిసి పనిచేయనున్నారు. ఏడాదికి మూడు సినిమాలు చేసేలా చిరు ప్లాన్ చేస్తున్నారు.
రీసెంట్ గా దర్శకుడు మారుతి కూడా చిరుకి కథ చెప్పారని.. త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ప్రభుదేవా పేరు కూడా వినిపిస్తోంది. కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా సినిమాలు చేసి ఆ తరువాత మెగాఫోన్ పట్టుకొని డైరెక్టర్ గా మారారు ప్రభుదేవా. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. తెలుగులో కూడా సినిమాలు చేశారు.
మెగాస్టార్ చిరంజీవిని హీరోగా పెట్టి ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా చేశారు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఇప్పుడు ప్రభుదేవాకు మరో ఛాన్స్ ఇవ్వడానికి చిరు రెడీ అవుతున్నారట. ప్రభుదేవా రీమేక్ కథలను బాగా తీయగలరు. అందుకే చిరు ఇప్పుడు ఓ రీమేక్ కథను ప్రభుదేవాకి అప్పగించాలని చూస్తున్నారు. అయితే ఈ రీమేక్ ఏంటి..? ఏ భాషకు చెందినదనే విషయాలు మాత్రం బయటకు రాలేదు. మరి ఈ కాంబో ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూద్దాం!
This post was last modified on August 6, 2021 7:52 pm
గత ఏడాది టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ దెబ్బకు వీడియో ప్రమోషన్లకు దూరంగా ఉన్న విశ్వంభర ఎట్టకేలకు ఇవాళ హనుమాన్…
ఏపీలోని పొలిటికల్ కేపిటల్ విజవాయడలో శనివారం ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో ఆ…
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ షా వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై గ్యాంబ్లింగ్ మాఫియా…
ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…