మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల విషయంలో జోరు పెంచారు. యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న చిరు తన తదుపరి సినిమాగా ‘లూసిఫర్’ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నారు. ఆ తరువాత దర్శకుడు బాబీ, మెహర్ రమేష్ లతో కలిసి పనిచేయనున్నారు. ఏడాదికి మూడు సినిమాలు చేసేలా చిరు ప్లాన్ చేస్తున్నారు.
రీసెంట్ గా దర్శకుడు మారుతి కూడా చిరుకి కథ చెప్పారని.. త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ప్రభుదేవా పేరు కూడా వినిపిస్తోంది. కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా సినిమాలు చేసి ఆ తరువాత మెగాఫోన్ పట్టుకొని డైరెక్టర్ గా మారారు ప్రభుదేవా. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. తెలుగులో కూడా సినిమాలు చేశారు.
మెగాస్టార్ చిరంజీవిని హీరోగా పెట్టి ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా చేశారు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఇప్పుడు ప్రభుదేవాకు మరో ఛాన్స్ ఇవ్వడానికి చిరు రెడీ అవుతున్నారట. ప్రభుదేవా రీమేక్ కథలను బాగా తీయగలరు. అందుకే చిరు ఇప్పుడు ఓ రీమేక్ కథను ప్రభుదేవాకి అప్పగించాలని చూస్తున్నారు. అయితే ఈ రీమేక్ ఏంటి..? ఏ భాషకు చెందినదనే విషయాలు మాత్రం బయటకు రాలేదు. మరి ఈ కాంబో ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూద్దాం!
This post was last modified on August 6, 2021 7:52 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…