మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల విషయంలో జోరు పెంచారు. యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న చిరు తన తదుపరి సినిమాగా ‘లూసిఫర్’ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నారు. ఆ తరువాత దర్శకుడు బాబీ, మెహర్ రమేష్ లతో కలిసి పనిచేయనున్నారు. ఏడాదికి మూడు సినిమాలు చేసేలా చిరు ప్లాన్ చేస్తున్నారు.
రీసెంట్ గా దర్శకుడు మారుతి కూడా చిరుకి కథ చెప్పారని.. త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ప్రభుదేవా పేరు కూడా వినిపిస్తోంది. కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా సినిమాలు చేసి ఆ తరువాత మెగాఫోన్ పట్టుకొని డైరెక్టర్ గా మారారు ప్రభుదేవా. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. తెలుగులో కూడా సినిమాలు చేశారు.
మెగాస్టార్ చిరంజీవిని హీరోగా పెట్టి ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా చేశారు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఇప్పుడు ప్రభుదేవాకు మరో ఛాన్స్ ఇవ్వడానికి చిరు రెడీ అవుతున్నారట. ప్రభుదేవా రీమేక్ కథలను బాగా తీయగలరు. అందుకే చిరు ఇప్పుడు ఓ రీమేక్ కథను ప్రభుదేవాకి అప్పగించాలని చూస్తున్నారు. అయితే ఈ రీమేక్ ఏంటి..? ఏ భాషకు చెందినదనే విషయాలు మాత్రం బయటకు రాలేదు. మరి ఈ కాంబో ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూద్దాం!
ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే కథానాయికలు చాలా కొద్ది మందే ఉంటారు. అందుకు వారి గ్లామర్, యాక్టింగ్ టాలెంట్తో…
తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించడం అరుదు. కాస్త పేరున్న నిర్మాణ సంస్థల్లో తెరకెక్కే చిత్రాల్లో ఎక్కువగా పర భాషా…
నవీన్ పొలిశెట్టి నటించిన గత కొన్ని చిత్రాల్లో తన పేరు వెనుక ‘స్టార్ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్ పడుతున్న సంగతి…
విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్…
దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము…
ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ…