బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత రామ్ చరణ్ తో కలిసి ‘వినయ విధేయ రామ’ సినిమా చేసింది. ఈ సినిమాల కోసం అమ్మడుకి కోటి రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. మహేష్ సినిమాకి అయితే అటు ఇటుగా రూ.80 లక్షలు ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఈ బ్యూటీ ఛార్జ్ చేస్తోన్న రెమ్యునరేషన్ వింటే షాక్ అవ్వాల్సిందే. ‘కబీర్ సింగ్’ సినిమాతో కియారా రేంజ్ మారిపోయింది.
ఇప్పుడు ఆమె బాలీవుడ్ రూ.4 కోట్లకు దగ్గరగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. తెలుగులో నటించడానికి కూడా అదే రేంజ్ లో అడుగుతుంది. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో కియారా అద్వానీ రూ.5 కోట్లు డిమాండ్ చేసిందట. కానీ ఫైనల్ గా నాలుగున్నర కోట్లకు ఒప్పించారట.
హీరోయిన్ రెమ్యునరేషనే ఈ రేంజ్ లో ఇస్తే.. ఇక హీరో, డైరెక్టర్ లకు ఎంతిస్తున్నారో మరి. దిల్ రాజు మాత్రం ఈ సినిమా కోసం బాగా ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆయన బ్యానర్ లో వస్తోన్న యాభైవ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ ను ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. కొన్ని రోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే నాలుగు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేయాలనేది దర్శకనిర్మాతల ప్లాన్. మరి అనుకున్నట్లుగా సినిమాను పూర్తి చేస్తారో లేదో చూడాలి!
This post was last modified on August 5, 2021 9:36 am
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…
భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…