బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత రామ్ చరణ్ తో కలిసి ‘వినయ విధేయ రామ’ సినిమా చేసింది. ఈ సినిమాల కోసం అమ్మడుకి కోటి రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. మహేష్ సినిమాకి అయితే అటు ఇటుగా రూ.80 లక్షలు ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఈ బ్యూటీ ఛార్జ్ చేస్తోన్న రెమ్యునరేషన్ వింటే షాక్ అవ్వాల్సిందే. ‘కబీర్ సింగ్’ సినిమాతో కియారా రేంజ్ మారిపోయింది.
ఇప్పుడు ఆమె బాలీవుడ్ రూ.4 కోట్లకు దగ్గరగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. తెలుగులో నటించడానికి కూడా అదే రేంజ్ లో అడుగుతుంది. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో కియారా అద్వానీ రూ.5 కోట్లు డిమాండ్ చేసిందట. కానీ ఫైనల్ గా నాలుగున్నర కోట్లకు ఒప్పించారట.
హీరోయిన్ రెమ్యునరేషనే ఈ రేంజ్ లో ఇస్తే.. ఇక హీరో, డైరెక్టర్ లకు ఎంతిస్తున్నారో మరి. దిల్ రాజు మాత్రం ఈ సినిమా కోసం బాగా ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆయన బ్యానర్ లో వస్తోన్న యాభైవ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ ను ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. కొన్ని రోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే నాలుగు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేయాలనేది దర్శకనిర్మాతల ప్లాన్. మరి అనుకున్నట్లుగా సినిమాను పూర్తి చేస్తారో లేదో చూడాలి!
This post was last modified on August 5, 2021 9:36 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…