బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత రామ్ చరణ్ తో కలిసి ‘వినయ విధేయ రామ’ సినిమా చేసింది. ఈ సినిమాల కోసం అమ్మడుకి కోటి రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. మహేష్ సినిమాకి అయితే అటు ఇటుగా రూ.80 లక్షలు ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఈ బ్యూటీ ఛార్జ్ చేస్తోన్న రెమ్యునరేషన్ వింటే షాక్ అవ్వాల్సిందే. ‘కబీర్ సింగ్’ సినిమాతో కియారా రేంజ్ మారిపోయింది.
ఇప్పుడు ఆమె బాలీవుడ్ రూ.4 కోట్లకు దగ్గరగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. తెలుగులో నటించడానికి కూడా అదే రేంజ్ లో అడుగుతుంది. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో కియారా అద్వానీ రూ.5 కోట్లు డిమాండ్ చేసిందట. కానీ ఫైనల్ గా నాలుగున్నర కోట్లకు ఒప్పించారట.
హీరోయిన్ రెమ్యునరేషనే ఈ రేంజ్ లో ఇస్తే.. ఇక హీరో, డైరెక్టర్ లకు ఎంతిస్తున్నారో మరి. దిల్ రాజు మాత్రం ఈ సినిమా కోసం బాగా ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆయన బ్యానర్ లో వస్తోన్న యాభైవ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ ను ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. కొన్ని రోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే నాలుగు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేయాలనేది దర్శకనిర్మాతల ప్లాన్. మరి అనుకున్నట్లుగా సినిమాను పూర్తి చేస్తారో లేదో చూడాలి!
This post was last modified on August 5, 2021 9:36 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…