సోనీ లివ్.. సౌత్లో బాగా పాపులర్ అయిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్. హిందీలో పెద్ద ఛానెల్ నెట్ వర్క్ ఉన్న సోనీ సంస్థ.. తమ దగ్గరున్న సినిమాలతో ఓటీటీని మొదలుపెట్టి బాగానే పాపులర్ చేసింది. హిందీలో భారీ చిత్రాలను కొనడమే కాక, సొంతంగా స్కామ్ 1992 లాంటి వెబ్ సిరీస్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సబ్స్క్రైబర్లను పెంచుకుంది.
ఇప్పుడీ సంస్థ సౌత్ మీద దృష్టిపెట్టింది. ఇప్పటికే తమిళంలో కొన్ని క్రేజీ సినిమాలను ఆ సంస్థ కొనుగోలు చేసింది. ఇప్పుడు తెలుగు సినిమాల మీదా ఫోకస్ పెడుతోంది. చిన్న స్థాయిలో తెరకెక్కిన ఓ కామెడీ మూవీ స్ట్రీమింగ్తో తెలుగులోకి అడుగు పెట్టబోతోంది. ఆ చిత్రమే.. వివాహ భోజనంబు. కమెడియన్ సత్య లీడ్ రోల్ చేసిన తొలి చిత్రమిది. యువ కథానాయకుడు సందీప్ కిషన్ దీన్ని నిర్మించాడు.
లాక్ డౌన్ టైంలో ఇంట్లోకి బంధుగణం పెద్ద ఎత్తున వచ్చి పడితే కొత్తగా పెళ్లయిన ఓ కుర్రాడు పడే అవస్థల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. రామ్ అబ్బరాజు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇందులో బోలెడంతమంది కమెడియన్లు నటించారు. ఓ కొత్తమ్మాయి కథానాయికగా చేసింది. ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంది.
సోనీ లివ్లో రిలీజ్ కాబోయే తొలి చిత్రం తమదే అంటూ అనౌన్స్ చేయడంతో పాటు బుధవారమే వివాహ భోజనంబు ట్రైలర్ కూడా లాంచ్ చేయబోతున్నట్లు నిర్మాత సందీప్ కిషన్ వెల్లడించాడు. ఈ సినిమాలో ఆనంది ఆర్ట్స్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా భాగస్వామి అయింది. ఫన్నీ ట్రైలర్తో పాటు స్ట్రీమింగ్ డేట్ కూడా ఇవ్వబోతోందట వివాహ భోజనంబు టీం. మరి ఈ ట్రైలర్ ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.
This post was last modified on August 4, 2021 7:44 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…