ఎన్నో ఆశల మధ్య నాలుగు రోజుల కిందటే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పున:ప్రారంభం అయ్యాయి. దేశంలోనే కరోనా సెకండ్ వేవ్ తర్వాత మెజారిటీ థియేటర్లు తెరుచుకున్నది తెలుగు రాష్ట్రాల్లోనే. తెలంగాణలో అయితే 100 పర్సంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లను ఓపెన్ చేశారు. వెండి తెరల్ని కళకళలాడించడానికి గత వారం రెండు కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి.
ఐతే అవి రెండూ చిన్న సినిమాలే కావడంతో ప్రి రిలీజ్ బజ్ పెద్దగా లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ మోస్తరుగానే ఉన్నాయి. ఇక ఈ రెండు చిత్రాలకు టాక్ ఆశించిన స్థాయిలో లేదు. ఉన్నంతలో ‘తిమ్మరసు’ పరిస్థితి మెరుగు. కొంత మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ.. మరీ అసంతృప్తి అయితే లేదు. టికెట్ డబ్బులకు గిట్టుబాటు చేసే సినిమా అన్న అభిప్రాయం వ్యక్తమైంది. ‘ఇష్క్’ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నం. ఈ మలయాళ రీమేక్ను తెలుగు ప్రేక్షకులు పూర్తిగా తిరస్కరించారు. మరీ బ్యాడ్ టాక్ వచ్చింది.
టాక్కు తగ్గట్లే రెండు కొత్త చిత్రాల బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ ఉంది. ‘ఇష్క్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా వాషౌట్ అయిపోయిందనే చెప్పాలి. తొలి రోజు ఓ మోస్తరుగా వసూళ్లు వచ్చాయి కానీ.. రెండో రోజు నుంచి థియేటర్లు వెలవెలబోయాయి. థియేటర్ల మెయింటైనెన్స్ కూడా కష్టం అనేట్లుగా మరీ నామమాత్రపు షేర్ వచ్చిందీ సినిమాకు. యుఎస్లో సినిమాకు రెండో రోజు 200 డాలర్లు కూడా కలెక్షన్లు రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
‘తిమ్మరసు’కు మాత్రం అక్కడే కాక తెలుగు రాష్ట్రాల్లోనూ వసూళ్లు పర్వాలేదు. ఓ మోస్తరు ఆక్యుపెన్సీతో సినిమా నడుస్తోంది. ఫస్ట్ షోలకు థియేటర్లు బాగానే నిండుతున్నాయి. సోమవారం తెలంగాణలో బోనాల పండుగ సెలవును ‘తిమ్మరసు’ బాగానే ఉపయోగించుకున్నట్లుంది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు థియేటర్లు కళకళలాడాయి. ఉత్తరాంధ్రలో కూడా సినిమా బాగా ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఓవరాల్గా ‘తిమ్మరసు’ బ్రేక్ ఈవెన్కు చేరువగా ఉంది. సినిమా హిట్ స్టేటస్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…