మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మెగా బ్రదర్ నాగబాబుపై చర్యలు తప్పవని హెచ్చరించారు సంఘం అధ్యక్షుడు నరేష్. కొత్తగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, ఆయన ప్యానెల్కు మద్దతుగా మాట్లాడుతూ.. గత కార్యవర్గంపై నాగబాబు విమర్శలు చేయడం తెలిసిందే. టీవీ చర్చల్లోనే కాక.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ ప్రెస్ మీట్ పెట్టినపుడు కూడా నాగబాబు ‘మా’ గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. ‘‘మా ప్రతిష్ఠ మసకబారింది’’ అనే నాగబాబు వ్యాఖ్యల పట్ల నరేష్ ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు తననెంతో బాధించాయని అన్నారు.
‘మా’కు సంబంధించి మంచి ఉంటే మైకులో చెప్పాలని.. చెడు ఉంటే చెవిలో చెప్పాలని గతంలో ఒక సమావేశం సందర్భంగా చిరంజీవి అన్నారని.. మరి నాగబాబు ఇలా బహిరంగంగా చెడుగా ఎలా మాట్లాడారని నరేష్ ప్రశ్నించారు. ‘మా’ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే వారిపై చర్యలు తీసుకోవాలని నిబంధనల్లో ఉందని.. కాబట్టి చిరంజీవి, కృష్ణం రాజు లాంటి పెద్దలతో కూడిన క్రమశిక్షణ కమిటీ విమర్శలు చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటుందని నరేష్ అన్నారు. ప్రకాష్ రాజ్కు చిరంజీవి మద్దతు ఉందని నాగబాబు మాత్రమే అన్నారని.. ఆ మాట చిరంజీవి చెప్పలేదు కదా అని నరేష్ వ్యాఖ్యానించారు.
‘మా’ అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవం అయితే అది మహా పాపం అన్నట్లు నాగబాబు మాట్లాడారని.. కానీ ఈ ఎన్నికలు ఏకగ్రీవం అయితే తప్పేంటని నరేష్ ప్రశ్నించారు. ‘మా’ పెద్దలంతా కలిసి అధ్యక్ష ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే దాన్ని తాను అంగీకరిస్తానని.. అంతే కాక ‘మా’ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చునంతా తానే భరిస్తానని మంచు విష్ణు అన్నాడని.. అది అభినందించదగ్గ విషయం అని.. ‘మా’ భవనం కోసం తాను కూడా తన వంతు సాయం చేస్తానని నరేష్ అన్నారు. తాను మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తే కచ్చితంగా తెలుస్తానని.. కానీ కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే పోటీ నుంచి తప్పుకుంటున్నానని నరేష్ మరోసారి నొక్కి వక్కాణించారు.
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…