మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మెగా బ్రదర్ నాగబాబుపై చర్యలు తప్పవని హెచ్చరించారు సంఘం అధ్యక్షుడు నరేష్. కొత్తగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, ఆయన ప్యానెల్కు మద్దతుగా మాట్లాడుతూ.. గత కార్యవర్గంపై నాగబాబు విమర్శలు చేయడం తెలిసిందే. టీవీ చర్చల్లోనే కాక.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ ప్రెస్ మీట్ పెట్టినపుడు కూడా నాగబాబు ‘మా’ గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. ‘‘మా ప్రతిష్ఠ మసకబారింది’’ అనే నాగబాబు వ్యాఖ్యల పట్ల నరేష్ ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు తననెంతో బాధించాయని అన్నారు.
‘మా’కు సంబంధించి మంచి ఉంటే మైకులో చెప్పాలని.. చెడు ఉంటే చెవిలో చెప్పాలని గతంలో ఒక సమావేశం సందర్భంగా చిరంజీవి అన్నారని.. మరి నాగబాబు ఇలా బహిరంగంగా చెడుగా ఎలా మాట్లాడారని నరేష్ ప్రశ్నించారు. ‘మా’ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే వారిపై చర్యలు తీసుకోవాలని నిబంధనల్లో ఉందని.. కాబట్టి చిరంజీవి, కృష్ణం రాజు లాంటి పెద్దలతో కూడిన క్రమశిక్షణ కమిటీ విమర్శలు చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటుందని నరేష్ అన్నారు. ప్రకాష్ రాజ్కు చిరంజీవి మద్దతు ఉందని నాగబాబు మాత్రమే అన్నారని.. ఆ మాట చిరంజీవి చెప్పలేదు కదా అని నరేష్ వ్యాఖ్యానించారు.
‘మా’ అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవం అయితే అది మహా పాపం అన్నట్లు నాగబాబు మాట్లాడారని.. కానీ ఈ ఎన్నికలు ఏకగ్రీవం అయితే తప్పేంటని నరేష్ ప్రశ్నించారు. ‘మా’ పెద్దలంతా కలిసి అధ్యక్ష ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే దాన్ని తాను అంగీకరిస్తానని.. అంతే కాక ‘మా’ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చునంతా తానే భరిస్తానని మంచు విష్ణు అన్నాడని.. అది అభినందించదగ్గ విషయం అని.. ‘మా’ భవనం కోసం తాను కూడా తన వంతు సాయం చేస్తానని నరేష్ అన్నారు. తాను మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తే కచ్చితంగా తెలుస్తానని.. కానీ కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే పోటీ నుంచి తప్పుకుంటున్నానని నరేష్ మరోసారి నొక్కి వక్కాణించారు.
This post was last modified on August 3, 2021 12:48 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…