మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మెగా బ్రదర్ నాగబాబుపై చర్యలు తప్పవని హెచ్చరించారు సంఘం అధ్యక్షుడు నరేష్. కొత్తగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, ఆయన ప్యానెల్కు మద్దతుగా మాట్లాడుతూ.. గత కార్యవర్గంపై నాగబాబు విమర్శలు చేయడం తెలిసిందే. టీవీ చర్చల్లోనే కాక.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ ప్రెస్ మీట్ పెట్టినపుడు కూడా నాగబాబు ‘మా’ గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. ‘‘మా ప్రతిష్ఠ మసకబారింది’’ అనే నాగబాబు వ్యాఖ్యల పట్ల నరేష్ ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు తననెంతో బాధించాయని అన్నారు.
‘మా’కు సంబంధించి మంచి ఉంటే మైకులో చెప్పాలని.. చెడు ఉంటే చెవిలో చెప్పాలని గతంలో ఒక సమావేశం సందర్భంగా చిరంజీవి అన్నారని.. మరి నాగబాబు ఇలా బహిరంగంగా చెడుగా ఎలా మాట్లాడారని నరేష్ ప్రశ్నించారు. ‘మా’ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే వారిపై చర్యలు తీసుకోవాలని నిబంధనల్లో ఉందని.. కాబట్టి చిరంజీవి, కృష్ణం రాజు లాంటి పెద్దలతో కూడిన క్రమశిక్షణ కమిటీ విమర్శలు చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటుందని నరేష్ అన్నారు. ప్రకాష్ రాజ్కు చిరంజీవి మద్దతు ఉందని నాగబాబు మాత్రమే అన్నారని.. ఆ మాట చిరంజీవి చెప్పలేదు కదా అని నరేష్ వ్యాఖ్యానించారు.
‘మా’ అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవం అయితే అది మహా పాపం అన్నట్లు నాగబాబు మాట్లాడారని.. కానీ ఈ ఎన్నికలు ఏకగ్రీవం అయితే తప్పేంటని నరేష్ ప్రశ్నించారు. ‘మా’ పెద్దలంతా కలిసి అధ్యక్ష ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే దాన్ని తాను అంగీకరిస్తానని.. అంతే కాక ‘మా’ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చునంతా తానే భరిస్తానని మంచు విష్ణు అన్నాడని.. అది అభినందించదగ్గ విషయం అని.. ‘మా’ భవనం కోసం తాను కూడా తన వంతు సాయం చేస్తానని నరేష్ అన్నారు. తాను మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తే కచ్చితంగా తెలుస్తానని.. కానీ కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే పోటీ నుంచి తప్పుకుంటున్నానని నరేష్ మరోసారి నొక్కి వక్కాణించారు.
This post was last modified on August 3, 2021 12:48 pm
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…