టాలీవుడ్లో మరోసారి వరుసగా భారీ చిత్రాల రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సినిమాల విషయంలో పెద్ద చిత్రాల మధ్య భారీ పోటీనే ఉండబోతున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ఖరారయ్యాయి.
రాధేశ్యామ్, సర్కారు వారి పాట చిత్రాలకు డేట్లు కూడా ఇచ్చేయగా.. పవన్ కళ్యాణ్-రానాల సినిమాను కూడా సంక్రాంతికి ఖరారు చేయడం తెలిసిందే. ఎఫ్-3 సైతం రేసులోనే ఉంది. ఇక కరోనా మూడో వేవ్ ప్రభావం పెద్దగా లేకుంటే ముందుగా దసరాతో భారీ చిత్రాల సందడి మొదలవుతుంది.
ఆ పండక్కి ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రం ఖరారైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్-సుకుమార్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప చిత్రాన్ని క్రిస్మస్ పండక్కి ఫిక్స్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.
డిసెంబరు చివరి వారంలో సినిమాను రిలీజ్ చేస్తే.. క్రిస్మస్ సెలవులతో పాటు కొత్త సంవత్సరాది సందడి కూడా కలిసొస్తుందని.. సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు రెండు వారాల పాటు బాక్సాఫీస్ను రూల్ చేయొచ్చని పుష్ప టీం యోచిస్తున్నట్లు సమాచారం.
పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకోగా.. ప్రస్తుతం ఫస్ట్ పార్ట్ చివరి షెడ్యూల్ చిత్రీకరణ సాగుతోంది. మధ్యలో సుకుమార్కు డెంగీ సోకడంతో కొన్ని రోజుల పాటు చిత్రీకరణ ఆగింది. మళ్లీ షూటింగ్ పునఃప్రారంభిస్తున్నారు. ఇంకో నెలా నెలన్నరలో టాకీ పార్ట్ పూర్తవుతుందని భావిస్తున్నారు.
ఆ తర్వాత ప్రి ప్రొడక్షన్ పనిలో పడతారు. ఇప్పటికే పుష్ప ప్రమోషనల్ ప్లాన్ కూడా రెడీ చేశారు. ఇందులో భాగంగానే సినిమా నుంచి మేక మేకా అంటూ సాగే తొలి పాటను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకేసారి ఐదు భాషల్లో ఈ పాట రిలీజవుతోంది. సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లో ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 2, 2021 10:46 pm
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…
దర్శకుడు శంకర్ రెండో సినిమాగా ప్రేమికుడు మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొరియోగ్రాఫర్ గా ఉన్న…
యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్.…
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…
లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…