ఒకప్పుడు శత్రువు, ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి క్లాసిక్ టచ్ ఉన్న బ్లాక్బస్టర్లు తీసి నిర్మాతగా తిరుగులేని స్థాయిని అందుకున్నారు ఎం.ఎస్.రాజు. ఎంఎస్ అంటే మెగా సక్సెస్ అంటూ అబ్రివేషన్లు చెప్పుకునేవాళ్లు అప్పట్లో. కానీ తనకొచ్చిన గొప్ప పేరును ఆయన నిలబెట్టుకోలేకపోయారు. వరుస ఫ్లాపులు తీసి నిర్మాతగా బాగా వెనుకబడిపోయారు. ఒక దశలో ఆయన నిర్మాణమే ఆపేశారు. ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయ్యే పరిస్థితికి చేరుకున్నారు.
కానీ ఈ మధ్య ‘డర్టీ హరి’ అనే సినిమాతో మళ్లీ తన పేరు చర్చనీయాంశం అయ్యేలా చేసుకున్నారు. ఈ బోల్డ్ మూవీ ఓటీటీలో రిలీజై మంచి స్పందనే రాబట్టుకుంది. యూత్ బాగానే చూశారీ చిత్రాన్ని. ఆ ఊపులో వరుసగా ఇలాంటి బోల్డ్ మూవీసే తీయడానికి రాజు రెడీ అయిపోయారు. ఆల్రెడీ ‘7 డేస్ 6 నైట్స్’ అనే సినిమాను మొదలుపెట్టి చకచకా పూర్తి చేస్తున్నారు రాజు. ఆయన కొడుకు సుమంత్ అశ్వినే ఇందులో హీరో. దీని తర్వాత చేయబోయే సినిమాను కూడా రాజు ఇప్పటికే ఖరారు చేసేయడం విశేషం. ఆ సినిమా కోసమే ‘హరి కథ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. దీన్ని రిజిస్టర్ చేయించారు కూడా. ‘7 డేస్ 6 నైట్స్’ పూర్తయి రిలీజ్ కాగానే ఈ చిత్రాన్ని మొదలుపెట్టేస్తారట.
ఐతే ‘హరి కథ’ అనే టైటిల్ కొత్తదేమీ కాదు. ఈ పేరుతో ఓ సినిమా కూడా అనౌన్స్ అయింది. కానీ తర్వాత టైటిల్ మార్చేశారు. ఆ చిత్రమే ‘నేను శైలజ’. రామ్, కీర్తి సురేష్ జంటగా కిషోర్ తిరుమల రూపొందించిన ఈ చిత్రానికి ముందు అనుకున్న టైటిల్ ‘హరి కథ’నే. ఈ టైటిల్తోనే సినిమాను అనౌన్స్ చేశారు కూడా. కానీ ఏమనుకున్నారో ఏమో.. కొన్నాళ్లకు టైటిల్ మార్చేసి ‘నేను శైలజ’ అని పెట్టుకున్నారు. ‘హరి కథ’ టైటిల్ను తర్వాత ఇంకెవరూ వాడుకోలేదు. ఇప్పుడు రాజు ఆ టైటిల్ ఎంచుకుని సినిమా తీయబోతున్నారు.
This post was last modified on August 2, 2021 6:52 pm
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…