ఒకప్పుడు శత్రువు, ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి క్లాసిక్ టచ్ ఉన్న బ్లాక్బస్టర్లు తీసి నిర్మాతగా తిరుగులేని స్థాయిని అందుకున్నారు ఎం.ఎస్.రాజు. ఎంఎస్ అంటే మెగా సక్సెస్ అంటూ అబ్రివేషన్లు చెప్పుకునేవాళ్లు అప్పట్లో. కానీ తనకొచ్చిన గొప్ప పేరును ఆయన నిలబెట్టుకోలేకపోయారు. వరుస ఫ్లాపులు తీసి నిర్మాతగా బాగా వెనుకబడిపోయారు. ఒక దశలో ఆయన నిర్మాణమే ఆపేశారు. ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయ్యే పరిస్థితికి చేరుకున్నారు.
కానీ ఈ మధ్య ‘డర్టీ హరి’ అనే సినిమాతో మళ్లీ తన పేరు చర్చనీయాంశం అయ్యేలా చేసుకున్నారు. ఈ బోల్డ్ మూవీ ఓటీటీలో రిలీజై మంచి స్పందనే రాబట్టుకుంది. యూత్ బాగానే చూశారీ చిత్రాన్ని. ఆ ఊపులో వరుసగా ఇలాంటి బోల్డ్ మూవీసే తీయడానికి రాజు రెడీ అయిపోయారు. ఆల్రెడీ ‘7 డేస్ 6 నైట్స్’ అనే సినిమాను మొదలుపెట్టి చకచకా పూర్తి చేస్తున్నారు రాజు. ఆయన కొడుకు సుమంత్ అశ్వినే ఇందులో హీరో. దీని తర్వాత చేయబోయే సినిమాను కూడా రాజు ఇప్పటికే ఖరారు చేసేయడం విశేషం. ఆ సినిమా కోసమే ‘హరి కథ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. దీన్ని రిజిస్టర్ చేయించారు కూడా. ‘7 డేస్ 6 నైట్స్’ పూర్తయి రిలీజ్ కాగానే ఈ చిత్రాన్ని మొదలుపెట్టేస్తారట.
ఐతే ‘హరి కథ’ అనే టైటిల్ కొత్తదేమీ కాదు. ఈ పేరుతో ఓ సినిమా కూడా అనౌన్స్ అయింది. కానీ తర్వాత టైటిల్ మార్చేశారు. ఆ చిత్రమే ‘నేను శైలజ’. రామ్, కీర్తి సురేష్ జంటగా కిషోర్ తిరుమల రూపొందించిన ఈ చిత్రానికి ముందు అనుకున్న టైటిల్ ‘హరి కథ’నే. ఈ టైటిల్తోనే సినిమాను అనౌన్స్ చేశారు కూడా. కానీ ఏమనుకున్నారో ఏమో.. కొన్నాళ్లకు టైటిల్ మార్చేసి ‘నేను శైలజ’ అని పెట్టుకున్నారు. ‘హరి కథ’ టైటిల్ను తర్వాత ఇంకెవరూ వాడుకోలేదు. ఇప్పుడు రాజు ఆ టైటిల్ ఎంచుకుని సినిమా తీయబోతున్నారు.
This post was last modified on August 2, 2021 6:52 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…