పాన్ ఇండియా.. పాన్ ఇండియా.. ఇప్పుడు బాగా వినిపిస్తున్న మాట ఇది. ‘బాహుబలి’ దగ్గర్నుంచి ఇది పాపులర్ అయింది. ఏదో ఒక భాషకు పరిమితం కాకుండా బహుభాషల్లో ఒకేసారి సినిమా తీసి.. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేయడమే ‘పాన్ ఇండియా’ అంటే. బహు భాషా చిత్రాలు తీయడం.. గతంలోనూ ఈ తరహాలో సినిమాలు తెరకెక్కడం, రిలీజ్ కావడం జరిగింది కానీ.. గత కొన్నేళ్లలో ఈ ట్రెడిషన్ బాగా ఊపందుకుంది.
ఐతే 90ల్లో వరుసబెట్టి హిందీ సినిమాలు చేసిన అక్కినేని నాగార్జున అప్పట్లోనే ఓ భారీ పాన్ ఇండియా మూవీలో నటించాల్సిందట. అందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక అనుకోకుండా ఆ సినిమా ఆగిపోయిందని ఆ చిత్రాన్ని నిర్మించాల్సిన సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్రెడ్డి తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘దుర్గా ఆర్ట్స్’ బేనర్ మీద కె.ఎల్.నారాయణతో కలిసి గోపాల్రెడ్డి సినిమాలు నిర్మించేవారన్న సంగతి తెలిసిందే. ఆ బేనర్లోనే ఆ చిత్రం తెరకెక్కాల్సిందట. ఈ సినిమా ఆగిపోవడానికి కారణాలపై గోపాల్రెడ్డి ఏమన్నారంటే..
“నాగార్జునతో అప్పట్లో ఒక పాన్ ఇండియా చేయాలనుకున్నాం. ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా రాసిన స్ర్కిప్టు అది. 48 గంటల వ్యవధిలో ముగిసిపోయే.. రేసీ స్క్రీన్ ప్లేతో నడిచే కథ అది. తనకి విషం ఎక్కించిన ముగ్గురు విలన్లని హీరో చంపాలి. ఒక్కో విలన్ ఒక్కో రాష్ట్రంలో ఉంటాడు. వారిని అన్వేషించే మార్గంలో హీరో ప్లాష్బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఇందులో నటించేందుకు డింపుల్ కపాడియా, అనుపమ్ ఖేర్ తదితరుల్ని ఎంపిక చేశాం. అంతా సిద్ధమైంది. వారంలో సినిమా ప్రారంభం కావాల్సిన సమయంలో చిన్న సందేహం కలిగింది. నాకూ కె.ఎల్. నారాయణకి, నాగార్జున సోదరుడు వెంకట్కి కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేస్తే బాగుంటుందనిపించింది. అదే విషయం అశోక్ మెహతాకు చెప్పాం. కానీ ఆయన అందుకు ససేమిరా అన్నారు. దీంతో ఆ సినిమా ఆగిపోయింది” అని గోపాల్ రెడ్డి వివరించారు. చాలా ఏళ్లుగా కెమెరా పక్కన పెట్టేసి, ప్రొడక్షన్కు కూడా దూరంగా ఉన్న గోపాల్ రెడ్డి.. వచ్చే ఏడాది తమ సంస్థలో తెరకెక్కనున్న మహేష్ బాబు-రాజమౌళి సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.
This post was last modified on August 1, 2021 11:50 am
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…