Movie News

నాగార్జున మిస్సయిన పాన్ ఇండియా సినిమా

పాన్ ఇండియా.. పాన్ ఇండియా.. ఇప్పుడు బాగా వినిపిస్తున్న మాట ఇది. ‘బాహుబలి’ దగ్గర్నుంచి ఇది పాపులర్ అయింది. ఏదో ఒక భాషకు పరిమితం కాకుండా బహుభాషల్లో ఒకేసారి సినిమా తీసి.. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేయడమే ‘పాన్ ఇండియా’ అంటే. బహు భాషా చిత్రాలు తీయడం.. గతంలోనూ ఈ తరహాలో సినిమాలు తెరకెక్కడం, రిలీజ్ కావడం జరిగింది కానీ.. గత కొన్నేళ్లలో ఈ ట్రెడిషన్ బాగా ఊపందుకుంది.

ఐతే 90ల్లో వరుసబెట్టి హిందీ సినిమాలు చేసిన అక్కినేని నాగార్జున అప్పట్లోనే ఓ భారీ పాన్ ఇండియా మూవీలో నటించాల్సిందట. అందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక అనుకోకుండా ఆ సినిమా ఆగిపోయిందని ఆ చిత్రాన్ని నిర్మించాల్సిన సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్‌రెడ్డి తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘దుర్గా ఆర్ట్స్’ బేనర్ మీద కె.ఎల్.నారాయణతో కలిసి గోపాల్‌రెడ్డి సినిమాలు నిర్మించేవారన్న సంగతి తెలిసిందే. ఆ బేనర్లోనే ఆ చిత్రం తెరకెక్కాల్సిందట. ఈ సినిమా ఆగిపోవడానికి కారణాలపై గోపాల్‌రెడ్డి ఏమన్నారంటే..

“నాగార్జునతో అప్పట్లో ఒక పాన్ ఇండియా చేయాలనుకున్నాం. ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్‌ అశోక్‌ మెహతా రాసిన స్ర్కిప్టు అది. 48 గంటల వ్యవధిలో ముగిసిపోయే.. రేసీ స్క్రీన్ ప్లేతో నడిచే కథ అది. తనకి విషం ఎక్కించిన ముగ్గురు విలన్లని హీరో చంపాలి. ఒక్కో విలన్‌ ఒక్కో రాష్ట్రంలో ఉంటాడు. వారిని అన్వేషించే మార్గంలో హీరో ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ ఉంటాయి. ఇందులో నటించేందుకు డింపుల్‌ కపాడియా, అనుపమ్‌ ఖేర్‌ తదితరుల్ని ఎంపిక చేశాం. అంతా సిద్ధమైంది. వారంలో సినిమా ప్రారంభం కావాల్సిన సమయంలో చిన్న సందేహం కలిగింది. నాకూ కె.ఎల్‌. నారాయణకి, నాగార్జున సోదరుడు వెంకట్‌కి కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేస్తే బాగుంటుందనిపించింది. అదే విషయం అశోక్‌ మెహతాకు చెప్పాం. కానీ ఆయన అందుకు ససేమిరా అన్నారు. దీంతో ఆ సినిమా ఆగిపోయింది” అని గోపాల్ రెడ్డి వివరించారు. చాలా ఏళ్లుగా కెమెరా పక్కన పెట్టేసి, ప్రొడక్షన్‌కు కూడా దూరంగా ఉన్న గోపాల్ రెడ్డి.. వచ్చే ఏడాది తమ సంస్థలో తెరకెక్కనున్న మహేష్ బాబు-రాజమౌళి సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.

This post was last modified on August 1, 2021 11:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

2 minutes ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

55 minutes ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

3 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

3 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

4 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

7 hours ago