పాన్ ఇండియా.. పాన్ ఇండియా.. ఇప్పుడు బాగా వినిపిస్తున్న మాట ఇది. ‘బాహుబలి’ దగ్గర్నుంచి ఇది పాపులర్ అయింది. ఏదో ఒక భాషకు పరిమితం కాకుండా బహుభాషల్లో ఒకేసారి సినిమా తీసి.. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేయడమే ‘పాన్ ఇండియా’ అంటే. బహు భాషా చిత్రాలు తీయడం.. గతంలోనూ ఈ తరహాలో సినిమాలు తెరకెక్కడం, రిలీజ్ కావడం జరిగింది కానీ.. గత కొన్నేళ్లలో ఈ ట్రెడిషన్ బాగా ఊపందుకుంది.
ఐతే 90ల్లో వరుసబెట్టి హిందీ సినిమాలు చేసిన అక్కినేని నాగార్జున అప్పట్లోనే ఓ భారీ పాన్ ఇండియా మూవీలో నటించాల్సిందట. అందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక అనుకోకుండా ఆ సినిమా ఆగిపోయిందని ఆ చిత్రాన్ని నిర్మించాల్సిన సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్రెడ్డి తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘దుర్గా ఆర్ట్స్’ బేనర్ మీద కె.ఎల్.నారాయణతో కలిసి గోపాల్రెడ్డి సినిమాలు నిర్మించేవారన్న సంగతి తెలిసిందే. ఆ బేనర్లోనే ఆ చిత్రం తెరకెక్కాల్సిందట. ఈ సినిమా ఆగిపోవడానికి కారణాలపై గోపాల్రెడ్డి ఏమన్నారంటే..
“నాగార్జునతో అప్పట్లో ఒక పాన్ ఇండియా చేయాలనుకున్నాం. ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా రాసిన స్ర్కిప్టు అది. 48 గంటల వ్యవధిలో ముగిసిపోయే.. రేసీ స్క్రీన్ ప్లేతో నడిచే కథ అది. తనకి విషం ఎక్కించిన ముగ్గురు విలన్లని హీరో చంపాలి. ఒక్కో విలన్ ఒక్కో రాష్ట్రంలో ఉంటాడు. వారిని అన్వేషించే మార్గంలో హీరో ప్లాష్బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఇందులో నటించేందుకు డింపుల్ కపాడియా, అనుపమ్ ఖేర్ తదితరుల్ని ఎంపిక చేశాం. అంతా సిద్ధమైంది. వారంలో సినిమా ప్రారంభం కావాల్సిన సమయంలో చిన్న సందేహం కలిగింది. నాకూ కె.ఎల్. నారాయణకి, నాగార్జున సోదరుడు వెంకట్కి కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేస్తే బాగుంటుందనిపించింది. అదే విషయం అశోక్ మెహతాకు చెప్పాం. కానీ ఆయన అందుకు ససేమిరా అన్నారు. దీంతో ఆ సినిమా ఆగిపోయింది” అని గోపాల్ రెడ్డి వివరించారు. చాలా ఏళ్లుగా కెమెరా పక్కన పెట్టేసి, ప్రొడక్షన్కు కూడా దూరంగా ఉన్న గోపాల్ రెడ్డి.. వచ్చే ఏడాది తమ సంస్థలో తెరకెక్కనున్న మహేష్ బాబు-రాజమౌళి సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.
This post was last modified on August 1, 2021 11:50 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…