అప్పుడప్పుడూ ఇండస్ట్రీలో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. పెద్దగా పేరు లేని కాస్ట్ అండ్ క్రూతో తెరకెక్కిన చిత్రాలు అనూహ్య విజయం సాధిస్తుంటాయి. ఆ సినిమాలకు రిలీజ్ ముంగిట అనుకోకుండా మంచి బజ్ వస్తుంది. ఓపెనింగ్స్ వస్తాయి. బాక్సాఫీస్ దగ్గర అన్నీ కలిసొచ్చి ఆ చిత్రాలు అంచనాలను మించి ఆడేస్తుంటాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ఈ కోవలోకే చేరుతుందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘రాజా వారు రాణి వారు’ అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరపు హీరోగా నటించిన చిత్రమిది. ఈ చిత్రానికి అతనే కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చడం విశేషం. పెద్దగా బ్యాగ్రౌండ్ ఏమీ లేకపోయినా.. తొలి సినిమా థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా.. కిరణ్కు మంచి క్రేజే వచ్చింది. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో పాటు ఇంకో రెండు సినిమాల్లో అతను అవకాశం అందుకున్నాడు.
‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ గత ఏఢాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా కారణంగా ఆలస్యమైంది. ఐతే ‘నారప్ప’ లాంటి పెద్ద సినిమాలు కూడా థియేటర్ల కోసం ఎదురు చూడలేక ఓటీటీ బాట పడితే.. ఈ చిత్రానికి ఓటీటీల మంచి ఆఫర్లు వచ్చినా టెంప్ట్ కాకుండా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని పట్టుబట్టి కూర్చున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేట్రికల్ రిలీజ్ గురించి ముందుగా ప్రకటన వచ్చింది ఈ చిత్ర బృందం నుంచే. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ అంచనాలు రేకెత్తించగా.. ఇప్పుడు ట్రైలర్ వదిలారు. అది కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉండటం.. కమర్షియల్ అంశాలకు లోటు లేకపోవడంతో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి.
ట్రైలర్లో కిరణ్ కాన్ఫిడెన్స్, అతడి పాత్రకు ఇచ్చిన ఎలివేషన్లు చూస్తే ఇదొక స్టార్ మూవీ అన్న ఫీలింగ్ కలుగుతోంది. కుర్రాడు గట్టిగా కొట్టేలా ఉన్నాడే అని సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి ట్రైలర్ చూసి. సెకండ్ వేవ్ తర్వాత రీస్టార్ట్ మూవీస్గా వస్తున్న ఇష్క్, తిమ్మరసులను మించి తర్వాతి వారం వచ్చే ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మీదే అంచనాలు ఎక్కువ ఉండటం విశేషం. అంచనాలకు తగ్గట్లు సినిమా ఉంటే.. ఇండస్ట్రీకి షాకిచ్చే లెవెల్లో ఈ సినిమా హిట్టవుతుందేమో.
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…