అప్పుడప్పుడూ ఇండస్ట్రీలో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. పెద్దగా పేరు లేని కాస్ట్ అండ్ క్రూతో తెరకెక్కిన చిత్రాలు అనూహ్య విజయం సాధిస్తుంటాయి. ఆ సినిమాలకు రిలీజ్ ముంగిట అనుకోకుండా మంచి బజ్ వస్తుంది. ఓపెనింగ్స్ వస్తాయి. బాక్సాఫీస్ దగ్గర అన్నీ కలిసొచ్చి ఆ చిత్రాలు అంచనాలను మించి ఆడేస్తుంటాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ఈ కోవలోకే చేరుతుందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘రాజా వారు రాణి వారు’ అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరపు హీరోగా నటించిన చిత్రమిది. ఈ చిత్రానికి అతనే కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చడం విశేషం. పెద్దగా బ్యాగ్రౌండ్ ఏమీ లేకపోయినా.. తొలి సినిమా థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా.. కిరణ్కు మంచి క్రేజే వచ్చింది. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో పాటు ఇంకో రెండు సినిమాల్లో అతను అవకాశం అందుకున్నాడు.
‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ గత ఏఢాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా కారణంగా ఆలస్యమైంది. ఐతే ‘నారప్ప’ లాంటి పెద్ద సినిమాలు కూడా థియేటర్ల కోసం ఎదురు చూడలేక ఓటీటీ బాట పడితే.. ఈ చిత్రానికి ఓటీటీల మంచి ఆఫర్లు వచ్చినా టెంప్ట్ కాకుండా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని పట్టుబట్టి కూర్చున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేట్రికల్ రిలీజ్ గురించి ముందుగా ప్రకటన వచ్చింది ఈ చిత్ర బృందం నుంచే. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ అంచనాలు రేకెత్తించగా.. ఇప్పుడు ట్రైలర్ వదిలారు. అది కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉండటం.. కమర్షియల్ అంశాలకు లోటు లేకపోవడంతో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి.
ట్రైలర్లో కిరణ్ కాన్ఫిడెన్స్, అతడి పాత్రకు ఇచ్చిన ఎలివేషన్లు చూస్తే ఇదొక స్టార్ మూవీ అన్న ఫీలింగ్ కలుగుతోంది. కుర్రాడు గట్టిగా కొట్టేలా ఉన్నాడే అని సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి ట్రైలర్ చూసి. సెకండ్ వేవ్ తర్వాత రీస్టార్ట్ మూవీస్గా వస్తున్న ఇష్క్, తిమ్మరసులను మించి తర్వాతి వారం వచ్చే ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మీదే అంచనాలు ఎక్కువ ఉండటం విశేషం. అంచనాలకు తగ్గట్లు సినిమా ఉంటే.. ఇండస్ట్రీకి షాకిచ్చే లెవెల్లో ఈ సినిమా హిట్టవుతుందేమో.
This post was last modified on July 28, 2021 3:15 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…