అప్పుడప్పుడూ ఇండస్ట్రీలో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. పెద్దగా పేరు లేని కాస్ట్ అండ్ క్రూతో తెరకెక్కిన చిత్రాలు అనూహ్య విజయం సాధిస్తుంటాయి. ఆ సినిమాలకు రిలీజ్ ముంగిట అనుకోకుండా మంచి బజ్ వస్తుంది. ఓపెనింగ్స్ వస్తాయి. బాక్సాఫీస్ దగ్గర అన్నీ కలిసొచ్చి ఆ చిత్రాలు అంచనాలను మించి ఆడేస్తుంటాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ఈ కోవలోకే చేరుతుందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘రాజా వారు రాణి వారు’ అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరపు హీరోగా నటించిన చిత్రమిది. ఈ చిత్రానికి అతనే కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చడం విశేషం. పెద్దగా బ్యాగ్రౌండ్ ఏమీ లేకపోయినా.. తొలి సినిమా థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా.. కిరణ్కు మంచి క్రేజే వచ్చింది. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో పాటు ఇంకో రెండు సినిమాల్లో అతను అవకాశం అందుకున్నాడు.
‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ గత ఏఢాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా కారణంగా ఆలస్యమైంది. ఐతే ‘నారప్ప’ లాంటి పెద్ద సినిమాలు కూడా థియేటర్ల కోసం ఎదురు చూడలేక ఓటీటీ బాట పడితే.. ఈ చిత్రానికి ఓటీటీల మంచి ఆఫర్లు వచ్చినా టెంప్ట్ కాకుండా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని పట్టుబట్టి కూర్చున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేట్రికల్ రిలీజ్ గురించి ముందుగా ప్రకటన వచ్చింది ఈ చిత్ర బృందం నుంచే. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ అంచనాలు రేకెత్తించగా.. ఇప్పుడు ట్రైలర్ వదిలారు. అది కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉండటం.. కమర్షియల్ అంశాలకు లోటు లేకపోవడంతో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి.
ట్రైలర్లో కిరణ్ కాన్ఫిడెన్స్, అతడి పాత్రకు ఇచ్చిన ఎలివేషన్లు చూస్తే ఇదొక స్టార్ మూవీ అన్న ఫీలింగ్ కలుగుతోంది. కుర్రాడు గట్టిగా కొట్టేలా ఉన్నాడే అని సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి ట్రైలర్ చూసి. సెకండ్ వేవ్ తర్వాత రీస్టార్ట్ మూవీస్గా వస్తున్న ఇష్క్, తిమ్మరసులను మించి తర్వాతి వారం వచ్చే ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మీదే అంచనాలు ఎక్కువ ఉండటం విశేషం. అంచనాలకు తగ్గట్లు సినిమా ఉంటే.. ఇండస్ట్రీకి షాకిచ్చే లెవెల్లో ఈ సినిమా హిట్టవుతుందేమో.
This post was last modified on July 28, 2021 3:15 pm
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…