భారతీయ చిత్రాలకు విదేశీ సినిమాలు స్ఫూర్తిగా నిలవడం కొత్తేమీ కాదు. ఒకప్పుడు ఏ హాలీవుడ్ సినిమానో.. కొరియన్ మూవీనో చూసేసి సైలెంటుగా కాపీ కొట్టేసేవాళ్లు. ఫలానా మూవీకి ఇది కాపీ అనే విషయం జనాలకు పెద్దగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఓటీటీలు, పైరసీ వెబ్ సైట్ల ద్వారా ప్రపంచ సినిమా అందరికీ చేరువైపోయింది.
ఎక్కడ ఏ చిన్న సీన్ కాపీ కొట్టినా కూడా పట్టేసి నెట్లో పెట్టేస్తున్నారు. సినిమాలకు సినిమాలను లేపేస్తే.. దాని మేకర్స్కు విషయం తెలిసిపోయి కేసులు వేసే వరకు పరిస్థితి వెళ్తోంది. అందుకే విదేశీ చిత్రాల నుంచి స్ఫూర్తి పొందితే.. అధికారికంగా రీమేక్ రైట్స్ కొని సినిమాలు తీస్తున్నారు.
ఊపిరి, ఓ బేబీ లాంటి చిత్రాలు ఈ కోవలోనివే. ఇందులో ‘ఓ బేబీ’ని కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ ఆధారంగా తెరకెక్కించింది సురేష్ ప్రొడక్షన్స్. ఇప్పుడు అదే సంస్థ మరో కొరియన్ మూవీని తెలుగులోకి తీసుకొస్తోంది.
‘స్వామి రారా’తో భారీగా అంచనాలు పెంచి, ఆ తర్వాత స్థాయికి తగ్గ సినిమాలు తీయని సుధీర్ వర్మ సురేష్ ప్రొడక్షన్స్ వారి కొత్త రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం కొరియాలో సూపర్ హిట్ అయిన ‘మిడ్ నైట్ రన్నర్స్’ ఆధారంగా తెరకెక్కనుంది. రెజీనా కసాండ్రా, నివేథా థామస్ ఇందులో లీడ్ రోల్స్ చేస్తున్నారు.
థ్రిల్లర్స్ తీయడంలో సుధీర్కు మంచి పట్టుంది. ఐతే సొంతంగా సరైన కథలు తయారు చేసుకోవడంలో తడబడుతుంటాడు. ఈసారి మంచి కంటెంట్ ఉన్న థ్రిల్లర్ మూవీ కావడంతో దాన్ని తనదైన శైలిలో రీమేక్ చేసి హిట్టు కొడతాడని ఆశించవచ్చు. హైదరాబాద్లో సోమవారమే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది.
పరిమిత బడ్జెట్లో, తక్కువ రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేయడానికి చూస్తున్నారు. కొంచెం గ్యాప్ తర్వాత రెజీనాకు తెలుగులో దక్కిన ఫుల్ లెంగ్త్ మూవీ ఇది. ఈ ఏడాది చివరికే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని టార్గెట్గా పెట్టునకున్నారట.
This post was last modified on July 26, 2021 2:24 pm
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…