టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాసుకు ఇంటర్నెట్లో చేదు అనుభవం ఎదురైంది. తన కుటుంబం గురించి తప్పుడు ప్రచారం జరగడంపై ఆయన మనస్తాపం చెందాడు. ఈ ప్రచారం వల్ల తన కూతురిని చంపేస్తానంటూ ఒక వ్యక్తి బెదిరిస్తూ వీడియో పెట్టడంపై వాసు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ విషయమై వాసు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్కి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు లేఖ రాయడం గమనార్హం. సామాజిక మాద్యమాల్లో తప్పుడు ప్రచారం వల్ల తన కుమార్తె, తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించినట్లు ఈ లేఖలో వాసు వెల్లడించాడు. ఒకరు పెట్టిన పోస్టు అబద్ధమని నిరూపించడం చాలా కష్టతరం అని, అదేంటో స్వయంగా తాను ఫేస్ చేశానని బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశాడు.
తన కూతురిని చంపుతానని ఓ వ్యక్తి సామాజిక మాద్యమాల్లో వీడియో పెడితే.. దాన్ని తీయించడానికి తల ప్రాణం తోకకు వచ్చిందని, చిత్ర పరిశ్రమలో ఎంతో కొంత పలుకుబడి ఉన్న తనకే ఇంత కష్టమైతే.. సామాన్యుల పరిస్థితి ఏంటని నేరుగా సుందర్ పిచాయ్ని ఈ లేఖలో ప్రశ్నించాడు వాసు. ఇంటర్నెట్ స్వేచ్ఛకు మద్దతుగా ఇటీవల గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ బన్నీ వాసు ఈ లేఖ రాశాడు.
అల్లు అర్జున్కు అత్యంత సన్నిహితుడైన బన్నీ వాసు ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకడు. అల్లు అరవింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ వ్యవహారాలన్నీ ఇప్పుడు బన్నీ వాసు కనుసన్నల్లోనే నడుస్తాయి. గీతా ఆర్ట్స్-2 బేనర్లో తెరకెక్కే చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు నిర్మాతగా బన్నీ వాసు పేరే పడుతుందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలకు సిద్ధంగా ఉంది.
This post was last modified on July 26, 2021 8:21 am
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…
దర్శకుడు శంకర్ రెండో సినిమాగా ప్రేమికుడు మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొరియోగ్రాఫర్ గా ఉన్న…
యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్.…
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…
లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…