టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాసుకు ఇంటర్నెట్లో చేదు అనుభవం ఎదురైంది. తన కుటుంబం గురించి తప్పుడు ప్రచారం జరగడంపై ఆయన మనస్తాపం చెందాడు. ఈ ప్రచారం వల్ల తన కూతురిని చంపేస్తానంటూ ఒక వ్యక్తి బెదిరిస్తూ వీడియో పెట్టడంపై వాసు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ విషయమై వాసు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్కి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు లేఖ రాయడం గమనార్హం. సామాజిక మాద్యమాల్లో తప్పుడు ప్రచారం వల్ల తన కుమార్తె, తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించినట్లు ఈ లేఖలో వాసు వెల్లడించాడు. ఒకరు పెట్టిన పోస్టు అబద్ధమని నిరూపించడం చాలా కష్టతరం అని, అదేంటో స్వయంగా తాను ఫేస్ చేశానని బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశాడు.
తన కూతురిని చంపుతానని ఓ వ్యక్తి సామాజిక మాద్యమాల్లో వీడియో పెడితే.. దాన్ని తీయించడానికి తల ప్రాణం తోకకు వచ్చిందని, చిత్ర పరిశ్రమలో ఎంతో కొంత పలుకుబడి ఉన్న తనకే ఇంత కష్టమైతే.. సామాన్యుల పరిస్థితి ఏంటని నేరుగా సుందర్ పిచాయ్ని ఈ లేఖలో ప్రశ్నించాడు వాసు. ఇంటర్నెట్ స్వేచ్ఛకు మద్దతుగా ఇటీవల గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ బన్నీ వాసు ఈ లేఖ రాశాడు.
అల్లు అర్జున్కు అత్యంత సన్నిహితుడైన బన్నీ వాసు ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకడు. అల్లు అరవింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ వ్యవహారాలన్నీ ఇప్పుడు బన్నీ వాసు కనుసన్నల్లోనే నడుస్తాయి. గీతా ఆర్ట్స్-2 బేనర్లో తెరకెక్కే చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు నిర్మాతగా బన్నీ వాసు పేరే పడుతుందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలకు సిద్ధంగా ఉంది.
సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…