టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ ఇప్పుడు ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. సుకుమార్ కి వైరల్ ఫీవర్ రావడంతో మూడు రోజులుగా జరగాల్సిన షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు సుకుమార్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారట. సుకుమార్ మొదటి నుండి కూడా ఇంగ్లీష్ మందులకు దూరంగా ఉంటారు. ఒక్కో హోమియోపతి మాత్రమే వాడుతుంటారు.
ఈసారి కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట. కానీ ఇంకా అనారోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం సెట్ అయ్యేవరకు కూడా ‘పుష్ప’ షూటింగ్ మొదలుకాదు. ప్రస్తుతం ఆయన ఇంటిపట్టునే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. కొత్త షెడ్యూల్ కోసం హైదరాబాద్ లోనే సెట్ వేసి చిత్రీకరిస్తున్నారు. ‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
మొదటి భాగాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ విడుదలైన ఆరు నెలల తరువాత సెకండ్ పార్ట్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ రెండు భాగాల షూటింగ్ పూర్తయ్యేవరకు అల్లు అర్జున్ ను వదలకూడదని సుకుమార్ అనుకుంటున్నారు. కానీ బన్నీ మాత్రం మధ్యలో ఓ సినిమా పూర్తి చేయాలనుకుంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!
తమ సినిమా పెద్ద హిట్ అవుతుందని, బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ చెప్పుకోవడం మామూలే. ఇలా ఎవరైనా చెప్పుకుంటుంటే అదేమీ…
ఒకప్పుడు జాతీయ అవార్డులు ప్రకటిస్తుంటే.. తెలుగు సినిమాకు ప్రాతినిధ్యం దక్కితే ఆశ్చర్యపోయేవాళ్లం. మన సినిమాలకు ఏదైనా విభాగంలో జాతీయ అవార్డు…
పార్టీలో కార్యకర్తల స్థాయిలో ఉన్నవారు.. పార్టీ పెద్దలతో ఫొటోలు అంటే.. ఎంతగా ఎగబడతారో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా జాతీయ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కలయికలో తెరకెక్కబోతున్న ఆర్సి 17 నవంబర్ నుంచి షూటింగ్ కు…
తెలుగు నేల రాజకీయాల్లో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ కేక్…
ఇంకో నాలుగు రోజుల్లో జన నాయకుడు విడుదల కానుంది. తమిళనాడు అడ్వాన్స్ బుకింగ్స్ జోరు మీద ఉన్నాయి. గంటకు పదమూడు…