Movie News

సుకుమార్ ఆరోగ్యం చెడిందా..?

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ ఇప్పుడు ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. సుకుమార్ కి వైరల్ ఫీవర్ రావడంతో మూడు రోజులుగా జరగాల్సిన షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు సుకుమార్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారట. సుకుమార్ మొదటి నుండి కూడా ఇంగ్లీష్ మందులకు దూరంగా ఉంటారు. ఒక్కో హోమియోపతి మాత్రమే వాడుతుంటారు.

ఈసారి కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట. కానీ ఇంకా అనారోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం సెట్ అయ్యేవరకు కూడా ‘పుష్ప’ షూటింగ్ మొదలుకాదు. ప్రస్తుతం ఆయన ఇంటిపట్టునే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. కొత్త షెడ్యూల్ కోసం హైదరాబాద్ లోనే సెట్ వేసి చిత్రీకరిస్తున్నారు. ‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

మొదటి భాగాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ విడుదలైన ఆరు నెలల తరువాత సెకండ్ పార్ట్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ రెండు భాగాల షూటింగ్ పూర్తయ్యేవరకు అల్లు అర్జున్ ను వదలకూడదని సుకుమార్ అనుకుంటున్నారు. కానీ బన్నీ మాత్రం మధ్యలో ఓ సినిమా పూర్తి చేయాలనుకుంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!

This post was last modified on July 24, 2021 12:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

3 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

4 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

5 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

5 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

6 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

8 hours ago