షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సత్తా చాటుకుని.. తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్తో ప్రేక్షకుల దృష్టిలో పడి.. ఆపై ‘కలర్ ఫొటో’తో హీరో అవతారం ఎత్తాడు యువ నటుడు సుహాస్. ఆ సినిమాలో అతడి పాత్ర, నటన ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించేశాయి. ఆ పాత్ర తాలూకు అమాయకత్వం అందరినీ ఆకట్టుకుంది. ఇలాంటి అమాయకపు కుర్రాడి పాత్రలకు సుహాస్ బాగా సూటవుతాడన్న అభిప్రాయం కలిగింది.
ఐతే ఒక నటుడికి అలా ముద్ర పడిపోవడం కూడా కరెక్ట్ కాదు. అలాంటివే ఒకట్రెండు పాత్రలు చేస్తే తర్వాత అతన్నీ ఆ టైపు క్యారెక్టర్లే వస్తాయి. అందుకే సుహాస్ ఈసారి రూటు మార్చాడు. తన నుంచి ఎవ్వరూ ఊహించని ఓ పాత్రతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అతను సీరియల్ సైకో కిల్లర్ పాత్రను పోషిస్తుండటం విశేషం. ఆ సినిమా పేరు.. ఫ్యామిలీ డ్రామా. ఈ టైటిల్ చూసి ఇదేదో కుటుంబ కథా చిత్రం అనుకుంటాం కానీ.. ఇది సైకో కిల్లర్ చుట్టూ తిరిగే సినిమా కావడం విశేషం.
అనగనగా ఒక సైకో కిల్లర్. అతను చాలా మామూలుగా కనిపిస్తూ.. సైలెంటుగా అత్యంత కిరాతకమైన రీతిలో హత్యలు చేస్తుంటాడు. అతనేంటో తెలియకుండా ఓ కుర్రాడు స్నేహం చేస్తాడు. ఆ కుర్రాడి కుటుంబంలో కొన్ని సమస్యలుంటాయి. ముఖ్యంగా అతడి తండ్రి పెద్ద శాడిస్టు. కుటుంబంలో ఉన్న వాళ్లందరూ అతడి వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య గురించి తెలుసుకుని స్నేహితుడికి సాయంగా ఆ ఇంట్లోకి అడుగు పెడతాడు సైకో కిల్లర్. ముందుగా అతడి అసలు అవతారం శాడిస్టు తండ్రికి తెలుస్తుంది. తర్వాత ఇంట్లో వాళ్లందరూ ఒక్కొక్కరుగా సైకో కిల్లర్ గురించి తెలుసుకుంటారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోతుంది. ఆ ఇంట్లో అందరూ చిక్కుకుపోతారు. మరి ఈ సైకో నుంచి తప్పించుకోవడానికి ఆ కుటుంబం ఏం చేసిందన్నది మిగతా కథ.
ట్రైలర్ వరకు ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా అనిపించింది. సైకో కిల్లర్గా సుహాస్ చక్కటి హావభావాలతో ఆకట్టుకున్నాడు. అతడి లుక్ కూడా బాగుంది. మెహర్ తేజ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on July 22, 2021 3:53 pm
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. రెండు సభల్లోనూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో…
అసలే జనం… పిచ్చ క్లారిటీతో ఉన్నారు. వారికి గూగుల్ తల్లి రౌండ్ ద క్లాక్ అందుబాటులోనే ఉంటోంది. ఇట్టా అనుమానం…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.…
శతచిత్రాలకు నాగార్జున దగ్గరగా ఉన్నారు. కౌంట్ పరంగా కుబేరనే వందో సినిమా అంటున్నారు కానీ క్యామియోలు, స్పెషల్ రోల్స్, కొన్ని…
ఇటీవలే విడుదలైన దిల్ రుబా కిరణ్ అబ్బవరంకు పెద్ద షాకే ఇచ్చింది. ముందు రోజు సాయంత్రం ప్రీమియర్ షో నుంచే…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సాయంత్రం…