యన్.టి.ఆర్: కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ సినిమాలతో కెరీర్లో ఊహించని పతనం చూశాడు నందమూరి బాలకృష్ణ. ఆయన కెరీర్ ఇక ముగిసినట్లే అన్న వ్యాఖ్యానాలు వినిపించాయి ఆ టైంలో. ఈ మూడు చిత్రాలకు కలిపి రూ.20 కోట్ల షేర్ కూడా రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బాలయ్య మార్కెట్ దారుణంగా దెబ్బ తిన్నట్లు కనిపించింది ‘రూలర్’ టైంలో.
ఇక్కడి నుంచి బాలయ్య ఎలా పుంజుకుంటాడో అని అందరూ సందహాలు వ్యక్తం చేశారు. ఐతే ఒకప్పుడు పతావస్థలో ఉండగా ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి చిత్రాలతో తన కెరీర్కు మళ్లీ ఊపిరి పోసిన బోయపాటి శ్రీనుతో జట్టు కట్టడం ద్వారా పునర్వైభవానికి బాటలు పరుచుకున్నాడు బాలయ్య.
వీరి కలయికలో వస్తున్న ‘అఖండ’ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు టీజర్లు మాంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. బాలయ్యకు మళ్లీ ఊపు తెచ్చాయి. ఈ చిత్రానికి అనూహ్యమైన స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.
ఈ ఊపులో బాలయ్య క్రేజీ కాంబినేషన్లలో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. ‘అఖండ’తో పాటు ఆల్రెడీ కమిటైనవి, ప్లానింగ్లో కలిపితే ప్రస్తుతం బాలయ్య బాలయ్య ఖాతాలో అరడజను సినిమాలున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ‘క్రాక్’ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మైత్రీ మూవీస్ నిర్మాణంలో ఓ సినిమా ఓకే అయింది.
అలాగే అనిల్ రావిపూడితో ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు. దాన్ని షైన్ స్క్రీన్స్ వాళ్లు నిర్మిస్తారు. కాగా మరో అగ్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని బేనర్లో ఓ సినిమా చేయబోతున్నట్లు బాలయ్య ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి వెంకీ కుడుమల దర్శకుడు అని ప్రచారం సాగుతుండటం విశేషం. బాలయ్య-వెంకీ కలయికలో సినిమా ఎవ్వరూ ఊహించనిదే.
మరోవైపు ‘పైసా వసూల్’ తర్వాత పూరి జగన్నాథ్తో మరో సినిమా చేస్తానన్న బాలయ్య.. ఆ దిశగా సన్నాహాలు చేసుకోమని పూరీకి చెప్పినట్లు సమాచారం. ఇంకోవైపేమో ‘ఆదిత్య 369’ సీక్వెల్ కూడా చేస్తానని మళ్లీ మళ్లీ నొక్కి వక్కాణిస్తున్నాడు బాలయ్య. ఇలా మొత్తం బాలయ్య చేతిలో ఉన్న సినిమాల సంఖ్య అరడజనుగా కనిపిస్తోంది.
తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…