ఈ మధ్యకాలంలో చాలా సినిమాలను ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. లాక్ డౌన్ లో థియేటర్లు మూతపడడంతో చిన్న సినిమాలతో పాటు కాస్త పేరున్న సినిమాలు కూడా ఓటీటీలోకే వచ్చాయి. తాజాగా సురేష్ బాబు నిర్మించిన ‘నారప్ప’ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఆయన బ్యానర్ లో తెరకెక్కిన మరో సినిమా ‘విరాటపర్వం’ కూడా ఓటీటీలోకి వస్తుందంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయంలో రానా స్వయంగా ఇన్వాల్వ్ అయినట్లు టాక్ వచ్చింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తో రానా డీల్ మాట్లాడుతున్నాడని.. దాదాపు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందని అన్నారు. దీంతో నెక్స్ట్ ఓటీటీలో రాబోయే పెద్ద సినిమా ‘విరాటపర్వం’ అంటూ కథనాలు ప్రచురించారు. కానీ ఇందులో నిజం లేదని తేల్చి చెబుతున్నారు చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల. గతంలో ‘నీది నాది ఒకే కథ’ అనే సినిమా తెరకెక్కించిన వేణు రెండో సినిమా రానాతో చేసే ఛాన్స్ దక్కించుకున్నారు.
అయితే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు దర్శకుడు. సినిమాకి మంచి రేటు వచ్చిందని.. దీంతో ఓటీటీకి అమ్మేశారని వస్తోన్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. థియేటర్లలో ప్రేక్షకుల రద్దీని బట్టి త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని చెప్పారు. సినిమాలో రానా, సాయి పల్లవిలకు సంబంధించిన సన్నివేశాలు మరో నాలుగు రోజుల చిత్రీకరణ చేయాల్సి ఉందని.. ప్రస్తుతం ఆ పనుల్లో ఉన్నట్లు చెప్పారు. 1990లలో మావోయిస్టు ఉద్యమం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
This post was last modified on July 21, 2021 10:45 am
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…