కోలీవుడ్ లో దర్శకుడిగా ఎన్నో సినిమాలు చేసిన సముద్రఖని ఆ తరువాత నటుడిగా మారి సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయన నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. సముద్రఖని ప్రధాన పాత్రలో కూడా కొన్ని సినిమాలు తెరకెక్కాయి. నటుడిగా ప్రేక్షకులు సముద్రఖనిని ఆదరించారు. దీంతో టాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టి ఆయనపై పడింది. ఈ మధ్యకాలంలో విడుదలై సూపర్ హిట్స్ గా నిలిచిన ‘అల వైకుంఠపురములో’, ‘క్రాక్’ లాంటి సినిమాల్లో సముద్రఖని విలన్ గా కనిపించారు.
‘క్రాక్’ సినిమాలో అయితే ఆయన పాత్రకు ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు టాలీవుడ్ లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమాలన్నింటిలో కూడా సముద్రఖని కనిపించబోతున్నారు. మహేష్ బాబు నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో విలన్ ఆయనే. పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో కీలకపాత్రలో చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో సముద్రఖని కనిపించనున్నారు. తాజాగా ఆయన మరో సినిమా అంగీకరించినట్లు తెలుస్తోంది.
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సముద్రఖనికి మంచి పాత్ర ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ కథలో చాలా మార్పులు చేస్తున్నారు. కాబట్టి సముద్రఖనికి ఎలాంటి రోల్ ఆఫర్ చేశారనే విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేస్తోన్న చిరు త్వరలోనే ‘లూసిఫర్’ రీమేక్ ను మొదలుపెట్టనున్నారు. ఈ షెడ్యూల్ లో సముద్రఖని కూడా పాల్గొంటారట. మొత్తానికి మన టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పట్లో సముద్రఖనిని విడిచిపెట్టేలా లేరు!
This post was last modified on July 20, 2021 9:03 am
కెరీర్లో చాలా ఏళ్లు పక్కింటి కుర్రాడి పాత్రలే చేస్తూ వచ్చాడు నేచురల్ స్టార్ నాని. కానీ ‘దసరా’ చిత్రంతో తన…
స్టేజ్ ఎక్కగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది కొందరికి. మైక్ పట్టుకుని ఏదేదో మాట్లాడేస్తారు. ఇది సోషల్ మీడియా కాలం…
తమిళంలో నంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు విజయ్. కానీ ఇక్కడ…
కాస్త స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరోకైనా.. పేరు వెనుక ఏదో ఒక ట్యాగ్ ఉండాల్సిందే. ఐతే ఒక మోస్తరుగా…
రాష్ట్ర బీజేపీలో నాయకుల నియామకం.. కొత్తగా వచ్చే వారికి అవకాశం ఇవ్వడం... ఉన్న వారికి పనులు కేటాయించడం.. అనేది సహజం.…
ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. తాజాగా…