Movie News

కోలీవుడ్ స్టార్.. మహేష్ ని బీట్ చేయగలడా..?

రోజురోజుకి తన క్రేజ్ ను పెంచుకుంటూ సత్తా చాటుతున్నాడు కోలీవుడ్ స్టార్ ధనుష్. ‘అసురన్’, ‘కర్ణన్’ లాంటి సినిమాలు అతడి స్థాయిని అమాంతం పెంచేశాయి. రీసెంట్ గా అతడు నటించిన ‘జగమే తంత్రం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ హీరో రేంజ్ ఇంటెర్నేషనల్ లెవెల్ కి చేరింది. హాలీవుడ్ లో తెరకెక్కుతోన్న ‘ది గ్రే మ్యాన్’ అనే సినిమాలో ధనుష్ కీలకపాత్రలో కనిపించనున్నారు.

అలానే త్వరలోనే శేఖర్ కమ్ముల సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ధనుష్ మరో మైల్ స్టోన్ ను రీచ్ అయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ కోలీవుడ్ స్టార్ యాక్టివ్ గానే ఉంటారు. ఇప్పుడు ఆయన ట్విట్టర్ అకౌంట్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య 10 మిలియన్లకు చేరుకుంది. సౌత్ ఇండియాలో ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్నది ఒక్క మహేష్ బాబుకే. ట్విట్టర్ లో మహేష్ ని ఫాలో అయ్యేవారి సంఖ్య 11 మిలియన్లకు చేరుకుంది.

అంటే మహేష్ తరువాత స్థానంలో ధనుష్ నిలిచారు. ట్విట్టర్ లో ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న సౌత్ యాక్టర్స్ చాలా తక్కువ ఉన్నారు. మరి ఫ్యూచర్ లో మహేష్ ని బీట్ చేసి ధనుష్ మొదటి స్థానానికి చేరుకుంటారేమో చూడాలి. ప్రస్తుతం ధనుష్ తమిళంలో కార్తిక్ నరేన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది!

This post was last modified on July 19, 2021 1:26 pm

Share

Recent Posts

ఓటిటి అభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయ్

నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…

27 minutes ago

లాఠీలు గీత దాటుతున్నాయి రేవంత్ గారు

తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…

28 minutes ago

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

4 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

4 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

4 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

7 hours ago