రోజురోజుకి తన క్రేజ్ ను పెంచుకుంటూ సత్తా చాటుతున్నాడు కోలీవుడ్ స్టార్ ధనుష్. ‘అసురన్’, ‘కర్ణన్’ లాంటి సినిమాలు అతడి స్థాయిని అమాంతం పెంచేశాయి. రీసెంట్ గా అతడు నటించిన ‘జగమే తంత్రం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ హీరో రేంజ్ ఇంటెర్నేషనల్ లెవెల్ కి చేరింది. హాలీవుడ్ లో తెరకెక్కుతోన్న ‘ది గ్రే మ్యాన్’ అనే సినిమాలో ధనుష్ కీలకపాత్రలో కనిపించనున్నారు.
అలానే త్వరలోనే శేఖర్ కమ్ముల సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ధనుష్ మరో మైల్ స్టోన్ ను రీచ్ అయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ కోలీవుడ్ స్టార్ యాక్టివ్ గానే ఉంటారు. ఇప్పుడు ఆయన ట్విట్టర్ అకౌంట్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య 10 మిలియన్లకు చేరుకుంది. సౌత్ ఇండియాలో ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్నది ఒక్క మహేష్ బాబుకే. ట్విట్టర్ లో మహేష్ ని ఫాలో అయ్యేవారి సంఖ్య 11 మిలియన్లకు చేరుకుంది.
అంటే మహేష్ తరువాత స్థానంలో ధనుష్ నిలిచారు. ట్విట్టర్ లో ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న సౌత్ యాక్టర్స్ చాలా తక్కువ ఉన్నారు. మరి ఫ్యూచర్ లో మహేష్ ని బీట్ చేసి ధనుష్ మొదటి స్థానానికి చేరుకుంటారేమో చూడాలి. ప్రస్తుతం ధనుష్ తమిళంలో కార్తిక్ నరేన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది!
This post was last modified on July 19, 2021 1:26 pm
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…