రోజురోజుకి తన క్రేజ్ ను పెంచుకుంటూ సత్తా చాటుతున్నాడు కోలీవుడ్ స్టార్ ధనుష్. ‘అసురన్’, ‘కర్ణన్’ లాంటి సినిమాలు అతడి స్థాయిని అమాంతం పెంచేశాయి. రీసెంట్ గా అతడు నటించిన ‘జగమే తంత్రం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ హీరో రేంజ్ ఇంటెర్నేషనల్ లెవెల్ కి చేరింది. హాలీవుడ్ లో తెరకెక్కుతోన్న ‘ది గ్రే మ్యాన్’ అనే సినిమాలో ధనుష్ కీలకపాత్రలో కనిపించనున్నారు.
అలానే త్వరలోనే శేఖర్ కమ్ముల సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ధనుష్ మరో మైల్ స్టోన్ ను రీచ్ అయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ కోలీవుడ్ స్టార్ యాక్టివ్ గానే ఉంటారు. ఇప్పుడు ఆయన ట్విట్టర్ అకౌంట్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య 10 మిలియన్లకు చేరుకుంది. సౌత్ ఇండియాలో ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్నది ఒక్క మహేష్ బాబుకే. ట్విట్టర్ లో మహేష్ ని ఫాలో అయ్యేవారి సంఖ్య 11 మిలియన్లకు చేరుకుంది.
అంటే మహేష్ తరువాత స్థానంలో ధనుష్ నిలిచారు. ట్విట్టర్ లో ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న సౌత్ యాక్టర్స్ చాలా తక్కువ ఉన్నారు. మరి ఫ్యూచర్ లో మహేష్ ని బీట్ చేసి ధనుష్ మొదటి స్థానానికి చేరుకుంటారేమో చూడాలి. ప్రస్తుతం ధనుష్ తమిళంలో కార్తిక్ నరేన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది!
This post was last modified on July 19, 2021 1:26 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…