రోజురోజుకి తన క్రేజ్ ను పెంచుకుంటూ సత్తా చాటుతున్నాడు కోలీవుడ్ స్టార్ ధనుష్. ‘అసురన్’, ‘కర్ణన్’ లాంటి సినిమాలు అతడి స్థాయిని అమాంతం పెంచేశాయి. రీసెంట్ గా అతడు నటించిన ‘జగమే తంత్రం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ హీరో రేంజ్ ఇంటెర్నేషనల్ లెవెల్ కి చేరింది. హాలీవుడ్ లో తెరకెక్కుతోన్న ‘ది గ్రే మ్యాన్’ అనే సినిమాలో ధనుష్ కీలకపాత్రలో కనిపించనున్నారు.
అలానే త్వరలోనే శేఖర్ కమ్ముల సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ధనుష్ మరో మైల్ స్టోన్ ను రీచ్ అయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ కోలీవుడ్ స్టార్ యాక్టివ్ గానే ఉంటారు. ఇప్పుడు ఆయన ట్విట్టర్ అకౌంట్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య 10 మిలియన్లకు చేరుకుంది. సౌత్ ఇండియాలో ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్నది ఒక్క మహేష్ బాబుకే. ట్విట్టర్ లో మహేష్ ని ఫాలో అయ్యేవారి సంఖ్య 11 మిలియన్లకు చేరుకుంది.
అంటే మహేష్ తరువాత స్థానంలో ధనుష్ నిలిచారు. ట్విట్టర్ లో ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న సౌత్ యాక్టర్స్ చాలా తక్కువ ఉన్నారు. మరి ఫ్యూచర్ లో మహేష్ ని బీట్ చేసి ధనుష్ మొదటి స్థానానికి చేరుకుంటారేమో చూడాలి. ప్రస్తుతం ధనుష్ తమిళంలో కార్తిక్ నరేన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది!
This post was last modified on July 19, 2021 1:26 pm
కొత్త జిల్లాల ఏర్పాటు అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. ఈ ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేస్తుందని వారు…
ఒక బాలీవుడ్ మూవీ మూడో వారంలోనూ సూపర్ స్ట్రాంగ్ గా ఉండటం చూసి ఎన్ని నెలలయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం.…
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…