ఆదిత్య 369.. తెలుగు చలనచిత్ర చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయే సినిమా. ప్రయోగాత్మక చిత్రాల గురించి ఇప్పుడందరూ మాట్లాడుకుంటున్నారు కానీ.. మూడు దశాబ్దాల కిందటే ఇండియాలో ఎవరూ టచ్ చేయని వినూత్నమైన సబ్జెక్టుతో ఈ సినిమా తీసి అబ్బురపరిచారు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ఆయన పనితనానికి నందమూరి బాలకృష్ణ అద్భుత నటన కూడా తోడవడం, మిగతా టీం అంతా కూడా బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడంతో ఈ సినిమా ఒక క్లాసిక్ లాగా నిలిచిపోయింది.
ఇప్పుడు చూసినా చాలా కొత్తగా, ఎంతో ఆసక్తికరంగా అనిపించే టైమ్ లెస్ క్లాసిక్ ఇది. ఐతే టాలీవుడ్ గర్వించదగ్గ ఈ గొప్ప ప్రయోగం సాధ్యమయింది గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వల్లే. ఆయనే పూనుకోకుంటే ఈ సినిమా తెరకెక్కేదే కాదంటున్నారు సింగీతం.
ఓ హాలీవుడ్ రచయిత టైమ్ మెషీన్ నేపథ్యంలో రాసిన ఓ నవలను చదివినప్పటి నుంచి దాని నేపథ్యంలో సినిమా చేయాలన్న ఆలోచన తన మనసులో బలంగా నాటుకుపోయిందని.. ఎన్నో ఏళ్ల పాటు ఆ ఆలోచనను తన మనసులోనే దాచుకున్నానని.. ఐతే ఒక సందర్భంగా బాలుతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్నపుడు ఆయనకు ఆదిత్య 369 కాన్సెప్ట్ వినిపిస్తే చాలా ఎగ్జైట్ అయి ఈ సినిమా చేయాల్సిందే అని పట్టుబట్టారని.. తర్వాత నిర్మాత శివలెంక ప్రసాద్ను కలిసి తాను సమర్పకుడిగా వ్యవహరిస్తూ సినిమా చేయడానికి సిద్ధమయ్యారని సింగీతం వెల్లడించారు.
ఐతే బాలకృష్ణ ప్రధాన పాత్ర చేస్తానంటేనే ఈ సినిమాను తాను తీస్తానని ముందే కండిషన్ పెట్టానని.. బాలయ్య అంగీకరించడంతో సినిమా పట్టాలెక్కిందని సింగీతం తెలిపారు. ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడమే కాదు.. మేకింగ్ కూడా దగ్గరుండి చూసుకున్నారు బాలు. అలాగే అద్భుతమైన పాటలతో, అలాగే టిను ఆనంద్కు చెప్పిన డబ్బింగ్తో సినిమాకు పెద్ద బలంగా నిలిచారు.
This post was last modified on July 19, 2021 1:24 pm
ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎట్టకేలకు…
బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.…
గత కొన్నేళ్లలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ సర్ప్రైజింగ్, సెలబ్రేటెడ్ వెడ్డింగ్స్లో కీర్తి సురేష్ది ఒకటని చెప్పాలి. కెరీర్ మంచి…
అందరూ మర్చిపోయి ఎప్పుడో ఆలస్యంగా వస్తుందిలే అని భావిస్తున్న కల్కి 2 పేరు హఠాత్తుగా తెరమీదకు రావడంతో ఒక్కసారిగా ప్రభాస్…
ఇంకా అధికారికంగా ప్రకటించడం, ప్రమోషన్లు చేయడం లాంటివి జరగకపోయినా రేపటి నుంచి దురంధర్ ఓటిటి స్ట్రీమింగ్ జరగడం దాదాపు ఖాయమే.…
థియేటర్లలో విడుదలైన పధ్నాలుగు రోజులకే కార్తీ కొత్త సినిమా వా వతియార్ ఓటిటిలో వచ్చేయడం అభిమానులకు షాక్ కలిగించింది. తెలుగు…