ఆదిత్య 369.. తెలుగు చలనచిత్ర చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయే సినిమా. ప్రయోగాత్మక చిత్రాల గురించి ఇప్పుడందరూ మాట్లాడుకుంటున్నారు కానీ.. మూడు దశాబ్దాల కిందటే ఇండియాలో ఎవరూ టచ్ చేయని వినూత్నమైన సబ్జెక్టుతో ఈ సినిమా తీసి అబ్బురపరిచారు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ఆయన పనితనానికి నందమూరి బాలకృష్ణ అద్భుత నటన కూడా తోడవడం, మిగతా టీం అంతా కూడా బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడంతో ఈ సినిమా ఒక క్లాసిక్ లాగా నిలిచిపోయింది.
ఇప్పుడు చూసినా చాలా కొత్తగా, ఎంతో ఆసక్తికరంగా అనిపించే టైమ్ లెస్ క్లాసిక్ ఇది. ఐతే టాలీవుడ్ గర్వించదగ్గ ఈ గొప్ప ప్రయోగం సాధ్యమయింది గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వల్లే. ఆయనే పూనుకోకుంటే ఈ సినిమా తెరకెక్కేదే కాదంటున్నారు సింగీతం.
ఓ హాలీవుడ్ రచయిత టైమ్ మెషీన్ నేపథ్యంలో రాసిన ఓ నవలను చదివినప్పటి నుంచి దాని నేపథ్యంలో సినిమా చేయాలన్న ఆలోచన తన మనసులో బలంగా నాటుకుపోయిందని.. ఎన్నో ఏళ్ల పాటు ఆ ఆలోచనను తన మనసులోనే దాచుకున్నానని.. ఐతే ఒక సందర్భంగా బాలుతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్నపుడు ఆయనకు ఆదిత్య 369 కాన్సెప్ట్ వినిపిస్తే చాలా ఎగ్జైట్ అయి ఈ సినిమా చేయాల్సిందే అని పట్టుబట్టారని.. తర్వాత నిర్మాత శివలెంక ప్రసాద్ను కలిసి తాను సమర్పకుడిగా వ్యవహరిస్తూ సినిమా చేయడానికి సిద్ధమయ్యారని సింగీతం వెల్లడించారు.
ఐతే బాలకృష్ణ ప్రధాన పాత్ర చేస్తానంటేనే ఈ సినిమాను తాను తీస్తానని ముందే కండిషన్ పెట్టానని.. బాలయ్య అంగీకరించడంతో సినిమా పట్టాలెక్కిందని సింగీతం తెలిపారు. ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడమే కాదు.. మేకింగ్ కూడా దగ్గరుండి చూసుకున్నారు బాలు. అలాగే అద్భుతమైన పాటలతో, అలాగే టిను ఆనంద్కు చెప్పిన డబ్బింగ్తో సినిమాకు పెద్ద బలంగా నిలిచారు.
This post was last modified on July 19, 2021 1:24 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…