Movie News

విమ‌ర్శ‌ల‌కు సురేష్ బాబు స‌మాధానమిది

టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు మీద తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిట‌ర్లు గుర్రుగా ఉన్నారిప్పుడు. ఆయ‌న నిర్మాణంలో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా తెర‌కెక్కిన నార‌ప్ప చిత్రాన్ని నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తుండ‌ట‌మే అందుక్కార‌ణం. క‌రోనా దెబ్బ‌కు ఓవైపు థియేట‌ర్ ఇండ‌స్ట్రీ నాశ‌న‌మైపోతుంటే.. మంచి క్రేజున్న సినిమాల‌ను ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తుండ‌టం వారికి మింగుడుప‌డ‌టం లేదు. స్టార్లు న‌టించిన పెద్ద సినిమాల‌ను కూడా ఓటీటీల్లోనే రిలీజ్ చేస్తే మున్ముందు థియేట‌ర్ల‌కు ఎవ‌రు వ‌స్తార‌న్న‌ది వారి ప్ర‌శ్న‌. ఐతే కోట్లు పెట్టి సినిమా తీసిన త‌మ‌కు ఏది ప్ర‌యోజ‌న‌క‌ర‌మో దాన్నే ఎంచుకుంటామ‌న్న‌ది నిర్మాత‌ల వాద‌న‌.

మ‌రి సురేష్ బాబు ఈ విష‌యంలో ఏమంటారా అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు. దీనికి ఆయ‌న స‌హేతుక‌మైన స‌మాధాన‌మే చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల ఆలోచ‌న విధానంలో చాలా మార్పు వ‌చ్చింద‌ని.. థియేట‌ర్ల‌కు వ‌చ్చి సినిమాలు చూడ‌టానికి సంకోచంతో ఉన్నార‌ని సురేష్ బాబు అన్నారు. కొవిడ్ ప్ర‌భావం ప‌డ్డ కుటుంబాల ఆలోచ‌న తీరు ఒక‌లా ఉంటే.. రాని వారి తీరు మ‌రోలా ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌నం మ‌న కుటుంబ స‌భ్యుల‌ను థియేట‌ర్ల‌కు పంపించ‌న‌పుడు.. మా సినిమాకు రండి అంటూ ఇత‌ర కుటుంబాల‌ను ఎలా పిలుస్తాం అని సురేష్ బాబు ప్ర‌శ్నించారు.

నార‌ప్ప చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నందుకు వెంకీ అభిమానులే కాదు.. తాను, వెంకీ, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ కూడా బాధ‌ప‌డుతున్నామ‌ని.. ఎంతో ప్రాక్టిక‌ల్‌గా ఆలోచించి ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామ‌ని ఆయ‌న‌న్నారు. పూర్తిగా త‌నే నిర్మించిన చిత్ర‌మైతే నార‌ప్ప‌ను ఓటీటీలో విడుద‌ల చేయ‌డానికి ఒప్పుకుని ఉండేవాడిని కాద‌ని.. త‌మిళ నిర్మాత థాను కూడా భాగ‌స్వామి కావ‌డంతో ఆయ‌న‌కు క‌ర్ణ‌న్ తెచ్చిన న‌ష్టాన్ని దృష్టిలో ఉంచుకుని నార‌ప్ప‌ను ఓటీటీలో రిలీజ్ చేద్దామ‌ని అన‌డంతో స‌రే అన‌క త‌ప్ప‌లేద‌ని.. ఒకవేళ తాను ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేసి ఉంటే.. డిస్ట్రిబ్యూష‌న్ క‌మిష‌న్ కోసం అలా రిలీజ్ చేశార‌నే మాట‌లు కూడా వినిపించేవ‌ని సురేష్ బాబు పేర్కొన్నారు.

This post was last modified on July 19, 2021 1:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago