రాహుల్ విజయ్.. టాలీవుడ్లో హీరోగా వెలిగిపోవాలని ఎన్నో ఆశలతో వచ్చిన కుర్రాడు. టాలీవుడ్లో సుదీర్ఘ కాలంగా ఫైట్ మాస్టర్గా కొనసాగుతున్న విజయ్ కొడుకు ఇతను. ఇండస్ట్రీలో విజయ్కు మంచి పరిచయాలే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సహా చాలామంది హీరోలతో అనుబంధం ఉంది.
ఇండస్ట్రీలో ఎవరూ వచ్చి నేరుగా సాయం చేయాల్సిన పని లేదు కానీ.. తెరవెనుక సపోర్ట్ ఉన్నా అది బాగానే పనికి వస్తుంది. ఈ భరోసాతోనే తన కొడుకును హీరోగా పరిచయం చేశాడు విజయ్. రాహుల్ తొలి చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’ను సొంత నిర్మాణ సంస్థలో నిర్మించగా.. తారక్ తదితరులు వచ్చి దాన్ని ప్రమోట్ కూడా చేశారు.
కానీ ఆ సినిమా రాహుల్కు నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ అమ్మాయి కొణిదెల నిహారికకు జోడీగా ‘సూర్యకాంతం’ అని మరో సినిమా చేశాడు. అదీ ఆడలేదు. రాజేంద్ర ప్రసాద్తో కలిసి ‘కాలేజ్ కుమార్’ అనే సినిమా చేస్తే అది అడ్రస్ లేకుండా పోయింది.
ఫిలిం కెరీర్లో ఇలా ఒడుదొడుకులు ఎదుర్కొన్న రాహుల్… ఇప్పుడు డిజిటల్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఆహా వారి ‘కుడి ఎడమైతే’ వెబ్ సిరీస్లో ముఖ్య పాత్ర పోషించాడు. అమలాపాల్ మరో ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. లూసియా, యు టర్న్ చిత్రాల దర్శకుడు పవన్ కుమార్ తనదైన శైలిలో టైం లూప్ అనే వెరైటీ కాన్సెప్ట్తో ఈ సిరీస్ను తీర్చిదిద్దాడు. ఇందులో డెలివరీ బాయ్ పాత్రలో రాహుల్ ఆకట్టుకున్నాడు. పక్కింటి కుర్రాడి పాత్రలో అతను సులువుగా ఒదిగిపోయాడు. సహజంగా నటించాడు.
ఈ సిరీస్ విజయ్కు మంచి పేరే తెస్తోంది. అతడి రియల్ టాలెంట్ ఇప్పటికి బయటపడిందనే చెప్పాలి. ఈ సిరీస్ చూశాక దర్శకులు సినిమాల్లో మంచి పాత్రలు అతడికి ఇవ్వడానికి ఛాన్సుంది. ప్రస్తుతం విజయ్ ‘పంచతంత్రం’ అనే వైవిధ్యమైన సినిమా చేస్తున్నాడు. ‘కుడి ఎడమైతే’తో సత్తా చాటిన అతడికి మరిన్ని వెబ్ సిరీస్లు స్వాగతం పలుకుతాయేమో చూడాలి.
This post was last modified on July 18, 2021 6:14 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…