పవన్ కళ్యాణ్ పేరెత్తితే చాలు బండ్ల గణేష్కు పూనకాలు వచ్చేస్తాయి. స్టేజ్ ఎక్కినా.. మీడియా ముందు మాట్లాడినా.. అతను ఉద్వేగాన్ని ఆపుకోలేడు. మరీ అతి చేస్తాడు అని.. అంతగా భజన చేయాలా అని కామెంట్లు చేసినా అతను పట్టించుకునే రకం కాదు. తన అభిమానం తనది అంటాడు. గతంలో ‘గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకలో పవన్ను ఆకాశానికెత్తేస్తూ బండ్ల చేసిన ప్రసంగం ఎంత వైరల్ అయిందో తెలిసిందే. పవన్ సైతం కడుపు చెక్కలయ్యేలా నవ్వాడు ఆ ప్రసంగం వింటూ.
ఈ మధ్య ‘వకీల్ సాబ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో అలాంటి స్త్రోత్రమే మరొకటి చేశాడు. ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా అంటూ బండ్ల ఇచ్చిన ఎలివేషన్లకు అభిమానుల నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. ఈ సందర్భంగా పవన్ నా ‘దేవర’ అంటూ కొత్త మాటను ప్రయోగించాడు బండ్ల. ఈ మధ్య ఎక్కడ చూసినా అదే మాట అంటున్నాడు.
ఐతే పవన్ అభిమానులకు ‘దేవర’ అనే పదం బాగా నచ్చేసి.. దాన్ని పవన్తో బండ్ల చేయబోయే సినిమాకు టైటిల్గా పెట్టాలని డిమాండ్ చేస్తుండటం విశేషం. ట్విట్టర్లో బండ్లను ట్యాగ్ చేస్తూ వందల మంది అభిమానులు ‘దేవర’ టైటిల్ కోసం డిమాండ్ చేస్తున్నారు. సినిమా ఎప్పుడు తీస్తావో ఏంటో.. ముందు దాన్ని రిజిస్టర్ చేయించేయ్ అంటూ బండ్లను ట్యాగ్ చేస్తుండటం విశేషం.
ఈ విషయమై వచ్చిన ఒక వార్త లింక్ను షేర్ చేస్తూ ఓ అభిమాని టైటిల్ రిజిస్టర్ చేయమని బండ్లను కోరితే.. అలాగే అన్నట్లుగా థంప్సప్ ఎమోజీ పెట్టాడు బండ్ల. అభిమానులకు నచ్చే ఇలాంటి క్రేజీ పనులు చేయడానికి బండ్ల ఎప్పుడూ ముందుంటాడు. కాబట్టి ‘దేవర’ టైటిల్ రిజిస్టర్ చేయించినా చేయించేస్తాడేమో. ‘టెంపర్’ తర్వాత నిర్మాణానికి దూరమైన బండ్ల.. ఈ మధ్య మళ్లీ సినీ ఫీల్డులో యాక్టివ్ అవడం, పవన్తో మరో సినిమా చేస్తానని ప్రకటించడం తెలిసిందే. మరి ఆ చిత్రానికి నిజంగానే ‘దేవర’ అనే టైటిల్ పెట్టించేస్తాడేమో చూడాలి.
This post was last modified on July 18, 2021 7:30 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…