మెగా హీరోల్లో సాయిధరమ్ తేజ్ ఉన్నంత సరదాగా ఇంకెవరూ ఉండరన్నది అందరికీ తెలిసిన విషయమే. హీరోగా తనకంటూ ఒక రేంజ్ అందుకున్నాక కూడా చాలా సామాన్యంగా కనిపిస్తూ తన తోటి ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో కలిసి అల్లరి చేస్తుంటాడతను. వెన్నెల కిసోర్, సత్య, తమన్ లాంటి వాళ్లతో అతడి గిల్లికజ్జాలు ఎలా ఉంటాయో చూసే ఉంటారు. సోషల్ మీడియాలో కూడా తేజు చాలా సరదాగా ఉంటాడు.
ట్విట్టర్లో తన స్నేహితుల్ని కవ్వించడం.. కౌంటర్లు వేయడం తేజుకు అలవాటు. తాజాగా అతను వరసకు తనకు బావ అయ్యే వరుణ్ తేజ్కు కౌంటర్ వేశాడు. తన కూతురు నిహారికకు ముందుగా పెళ్లి చేసి.. వెంటనే వరుణ్ తేజ్ పెళ్లికి కూడా సన్నాహాలు చేస్తానంటూ ఇటీవలే నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ ‘నా ఇష్టం’లో వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ వీడయోకు సంబంధించిన యూట్యూబ్ థంబ్ నైల్ స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో షేర్ చేసిన తేజు.. ‘ఏం బావా నీకు పెళ్లంట’ అంటూ వరుణ్ తేజ్ను ట్యాగ్ చేసి కవ్వించే ప్రయత్నం చేశాడు. దీనికి వరుణ్ ఇంకా సమాధానం ఇవ్వలేదు. ఈ లోపు తేజు ట్వీట్ మీద మెగా అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. వరుణ్ సంగతి తర్వాత ఇంతకీ నీ సంగతేంటి.. ‘సోలో బతుకే సో బెటరు’ అనుకుంటూ గడిపేస్తావా అంటూ ప్రశ్నలు గుప్పించారు.
నిజానికి తేజు సైతం పెళ్లికి రెడీ అవుతున్నాడని.. అతడికి ఇప్పటికే మ్యాచ్ ఫిక్సయిందని.. ‘సోలో బతుకే సో బెటరు’ రిలీజయ్యాక ఈ ఏడాదే అతడి పెళ్లి ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. వరుణ్ కంటే తేజు వయసులోనే కాదు.. సినిమాల్లోనూ సీనియరే. తేజు వయసు 33 ఏళ్లు కాగా.. వరుణ్కు ఇంకా 30 ఏళ్లే. కాబట్టి వరుణ్ కంటే ముందు పెళ్లి పీటలు ఎక్కాల్సిన వాడు తేజునే. అదే జరిగినా ఆశ్చర్యం లేదేమో.
This post was last modified on May 23, 2020 2:17 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…