మెగా హీరోల్లో సాయిధరమ్ తేజ్ ఉన్నంత సరదాగా ఇంకెవరూ ఉండరన్నది అందరికీ తెలిసిన విషయమే. హీరోగా తనకంటూ ఒక రేంజ్ అందుకున్నాక కూడా చాలా సామాన్యంగా కనిపిస్తూ తన తోటి ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో కలిసి అల్లరి చేస్తుంటాడతను. వెన్నెల కిసోర్, సత్య, తమన్ లాంటి వాళ్లతో అతడి గిల్లికజ్జాలు ఎలా ఉంటాయో చూసే ఉంటారు. సోషల్ మీడియాలో కూడా తేజు చాలా సరదాగా ఉంటాడు.
ట్విట్టర్లో తన స్నేహితుల్ని కవ్వించడం.. కౌంటర్లు వేయడం తేజుకు అలవాటు. తాజాగా అతను వరసకు తనకు బావ అయ్యే వరుణ్ తేజ్కు కౌంటర్ వేశాడు. తన కూతురు నిహారికకు ముందుగా పెళ్లి చేసి.. వెంటనే వరుణ్ తేజ్ పెళ్లికి కూడా సన్నాహాలు చేస్తానంటూ ఇటీవలే నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ ‘నా ఇష్టం’లో వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ వీడయోకు సంబంధించిన యూట్యూబ్ థంబ్ నైల్ స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో షేర్ చేసిన తేజు.. ‘ఏం బావా నీకు పెళ్లంట’ అంటూ వరుణ్ తేజ్ను ట్యాగ్ చేసి కవ్వించే ప్రయత్నం చేశాడు. దీనికి వరుణ్ ఇంకా సమాధానం ఇవ్వలేదు. ఈ లోపు తేజు ట్వీట్ మీద మెగా అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. వరుణ్ సంగతి తర్వాత ఇంతకీ నీ సంగతేంటి.. ‘సోలో బతుకే సో బెటరు’ అనుకుంటూ గడిపేస్తావా అంటూ ప్రశ్నలు గుప్పించారు.
నిజానికి తేజు సైతం పెళ్లికి రెడీ అవుతున్నాడని.. అతడికి ఇప్పటికే మ్యాచ్ ఫిక్సయిందని.. ‘సోలో బతుకే సో బెటరు’ రిలీజయ్యాక ఈ ఏడాదే అతడి పెళ్లి ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. వరుణ్ కంటే తేజు వయసులోనే కాదు.. సినిమాల్లోనూ సీనియరే. తేజు వయసు 33 ఏళ్లు కాగా.. వరుణ్కు ఇంకా 30 ఏళ్లే. కాబట్టి వరుణ్ కంటే ముందు పెళ్లి పీటలు ఎక్కాల్సిన వాడు తేజునే. అదే జరిగినా ఆశ్చర్యం లేదేమో.
This post was last modified on May 23, 2020 2:17 pm
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…