మెగా హీరోల్లో సాయిధరమ్ తేజ్ ఉన్నంత సరదాగా ఇంకెవరూ ఉండరన్నది అందరికీ తెలిసిన విషయమే. హీరోగా తనకంటూ ఒక రేంజ్ అందుకున్నాక కూడా చాలా సామాన్యంగా కనిపిస్తూ తన తోటి ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో కలిసి అల్లరి చేస్తుంటాడతను. వెన్నెల కిసోర్, సత్య, తమన్ లాంటి వాళ్లతో అతడి గిల్లికజ్జాలు ఎలా ఉంటాయో చూసే ఉంటారు. సోషల్ మీడియాలో కూడా తేజు చాలా సరదాగా ఉంటాడు.
ట్విట్టర్లో తన స్నేహితుల్ని కవ్వించడం.. కౌంటర్లు వేయడం తేజుకు అలవాటు. తాజాగా అతను వరసకు తనకు బావ అయ్యే వరుణ్ తేజ్కు కౌంటర్ వేశాడు. తన కూతురు నిహారికకు ముందుగా పెళ్లి చేసి.. వెంటనే వరుణ్ తేజ్ పెళ్లికి కూడా సన్నాహాలు చేస్తానంటూ ఇటీవలే నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ ‘నా ఇష్టం’లో వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ వీడయోకు సంబంధించిన యూట్యూబ్ థంబ్ నైల్ స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో షేర్ చేసిన తేజు.. ‘ఏం బావా నీకు పెళ్లంట’ అంటూ వరుణ్ తేజ్ను ట్యాగ్ చేసి కవ్వించే ప్రయత్నం చేశాడు. దీనికి వరుణ్ ఇంకా సమాధానం ఇవ్వలేదు. ఈ లోపు తేజు ట్వీట్ మీద మెగా అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. వరుణ్ సంగతి తర్వాత ఇంతకీ నీ సంగతేంటి.. ‘సోలో బతుకే సో బెటరు’ అనుకుంటూ గడిపేస్తావా అంటూ ప్రశ్నలు గుప్పించారు.
నిజానికి తేజు సైతం పెళ్లికి రెడీ అవుతున్నాడని.. అతడికి ఇప్పటికే మ్యాచ్ ఫిక్సయిందని.. ‘సోలో బతుకే సో బెటరు’ రిలీజయ్యాక ఈ ఏడాదే అతడి పెళ్లి ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. వరుణ్ కంటే తేజు వయసులోనే కాదు.. సినిమాల్లోనూ సీనియరే. తేజు వయసు 33 ఏళ్లు కాగా.. వరుణ్కు ఇంకా 30 ఏళ్లే. కాబట్టి వరుణ్ కంటే ముందు పెళ్లి పీటలు ఎక్కాల్సిన వాడు తేజునే. అదే జరిగినా ఆశ్చర్యం లేదేమో.
This post was last modified on May 23, 2020 2:17 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…