మెగా హీరోల్లో సాయిధరమ్ తేజ్ ఉన్నంత సరదాగా ఇంకెవరూ ఉండరన్నది అందరికీ తెలిసిన విషయమే. హీరోగా తనకంటూ ఒక రేంజ్ అందుకున్నాక కూడా చాలా సామాన్యంగా కనిపిస్తూ తన తోటి ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో కలిసి అల్లరి చేస్తుంటాడతను. వెన్నెల కిసోర్, సత్య, తమన్ లాంటి వాళ్లతో అతడి గిల్లికజ్జాలు ఎలా ఉంటాయో చూసే ఉంటారు. సోషల్ మీడియాలో కూడా తేజు చాలా సరదాగా ఉంటాడు.
ట్విట్టర్లో తన స్నేహితుల్ని కవ్వించడం.. కౌంటర్లు వేయడం తేజుకు అలవాటు. తాజాగా అతను వరసకు తనకు బావ అయ్యే వరుణ్ తేజ్కు కౌంటర్ వేశాడు. తన కూతురు నిహారికకు ముందుగా పెళ్లి చేసి.. వెంటనే వరుణ్ తేజ్ పెళ్లికి కూడా సన్నాహాలు చేస్తానంటూ ఇటీవలే నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ ‘నా ఇష్టం’లో వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ వీడయోకు సంబంధించిన యూట్యూబ్ థంబ్ నైల్ స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో షేర్ చేసిన తేజు.. ‘ఏం బావా నీకు పెళ్లంట’ అంటూ వరుణ్ తేజ్ను ట్యాగ్ చేసి కవ్వించే ప్రయత్నం చేశాడు. దీనికి వరుణ్ ఇంకా సమాధానం ఇవ్వలేదు. ఈ లోపు తేజు ట్వీట్ మీద మెగా అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. వరుణ్ సంగతి తర్వాత ఇంతకీ నీ సంగతేంటి.. ‘సోలో బతుకే సో బెటరు’ అనుకుంటూ గడిపేస్తావా అంటూ ప్రశ్నలు గుప్పించారు.
నిజానికి తేజు సైతం పెళ్లికి రెడీ అవుతున్నాడని.. అతడికి ఇప్పటికే మ్యాచ్ ఫిక్సయిందని.. ‘సోలో బతుకే సో బెటరు’ రిలీజయ్యాక ఈ ఏడాదే అతడి పెళ్లి ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. వరుణ్ కంటే తేజు వయసులోనే కాదు.. సినిమాల్లోనూ సీనియరే. తేజు వయసు 33 ఏళ్లు కాగా.. వరుణ్కు ఇంకా 30 ఏళ్లే. కాబట్టి వరుణ్ కంటే ముందు పెళ్లి పీటలు ఎక్కాల్సిన వాడు తేజునే. అదే జరిగినా ఆశ్చర్యం లేదేమో.
This post was last modified on May 23, 2020 2:17 pm
జపాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ లోని ఉత్తర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో కూడిన…
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…