Movie News

పవన్ సినిమా.. రీషూట్ ప్లాన్!

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా కొంత భాగం షూటింగ్ జరిగింది. అయితే ఇప్పుడు సడెన్ గా ఈ సినిమా ను కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల తప్పుకున్నారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి సైడ్ అయిపోయారని సమాచారం.

ఆయన స్థానంలో రవి కె చంద్రన్ ను తీసుకొచ్చారు. అయితే సినిమాలో ఇప్పటివరకు ప్రసాద్ మూరెళ్ల చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను పక్కన పెట్టాలని చూస్తున్నారట. మరోసారి ఆ సన్నివేశాలను రీషూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. ప్రసాద్ మూరెళ్లకు, దర్శకుడికి మధ్య పొసగలేదని.. కొన్ని సన్నివేశాలను చూసిన పవన్ కూడా కథ టెంపో మారిపోయినట్లుగా ఉందని చెప్పినట్లు సమాచారం.

ఇప్పుడు ప్రసాద్ మూరెళ్ల చిత్రీకరించిన సన్నివేశాలను వాడుకుంటే కెమెరామెన్ గా ఆయనకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఆయన తీసిన సన్నివేశాలను రీషూట్ చేయాలని భావిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఏదేమైనా.. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి క్రిష్ సినిమా సెట్స్ పైకి వెళ్లాలనుకుంటున్నారు పవన్. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘ఏకే’ రీమేక్ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.

This post was last modified on July 17, 2021 2:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

2 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

3 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

4 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

4 hours ago

తిరుమలపై ఎందుకీ పగ..?

తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…

5 hours ago

ది వీక్ కవర్ పేజీపై లోకేష్.. చీఫ్ జాబ్ క్రియేటర్

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…

5 hours ago