మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా కొంత భాగం షూటింగ్ జరిగింది. అయితే ఇప్పుడు సడెన్ గా ఈ సినిమా ను కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల తప్పుకున్నారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి సైడ్ అయిపోయారని సమాచారం.
ఆయన స్థానంలో రవి కె చంద్రన్ ను తీసుకొచ్చారు. అయితే సినిమాలో ఇప్పటివరకు ప్రసాద్ మూరెళ్ల చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను పక్కన పెట్టాలని చూస్తున్నారట. మరోసారి ఆ సన్నివేశాలను రీషూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. ప్రసాద్ మూరెళ్లకు, దర్శకుడికి మధ్య పొసగలేదని.. కొన్ని సన్నివేశాలను చూసిన పవన్ కూడా కథ టెంపో మారిపోయినట్లుగా ఉందని చెప్పినట్లు సమాచారం.
ఇప్పుడు ప్రసాద్ మూరెళ్ల చిత్రీకరించిన సన్నివేశాలను వాడుకుంటే కెమెరామెన్ గా ఆయనకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఆయన తీసిన సన్నివేశాలను రీషూట్ చేయాలని భావిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఏదేమైనా.. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి క్రిష్ సినిమా సెట్స్ పైకి వెళ్లాలనుకుంటున్నారు పవన్. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘ఏకే’ రీమేక్ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.
This post was last modified on July 17, 2021 2:56 pm
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…