Movie News

పవన్ సినిమా.. రీషూట్ ప్లాన్!

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా కొంత భాగం షూటింగ్ జరిగింది. అయితే ఇప్పుడు సడెన్ గా ఈ సినిమా ను కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల తప్పుకున్నారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి సైడ్ అయిపోయారని సమాచారం.

ఆయన స్థానంలో రవి కె చంద్రన్ ను తీసుకొచ్చారు. అయితే సినిమాలో ఇప్పటివరకు ప్రసాద్ మూరెళ్ల చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను పక్కన పెట్టాలని చూస్తున్నారట. మరోసారి ఆ సన్నివేశాలను రీషూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. ప్రసాద్ మూరెళ్లకు, దర్శకుడికి మధ్య పొసగలేదని.. కొన్ని సన్నివేశాలను చూసిన పవన్ కూడా కథ టెంపో మారిపోయినట్లుగా ఉందని చెప్పినట్లు సమాచారం.

ఇప్పుడు ప్రసాద్ మూరెళ్ల చిత్రీకరించిన సన్నివేశాలను వాడుకుంటే కెమెరామెన్ గా ఆయనకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఆయన తీసిన సన్నివేశాలను రీషూట్ చేయాలని భావిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఏదేమైనా.. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి క్రిష్ సినిమా సెట్స్ పైకి వెళ్లాలనుకుంటున్నారు పవన్. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘ఏకే’ రీమేక్ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.

This post was last modified on July 17, 2021 2:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

5 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

7 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

7 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

8 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

9 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

10 hours ago