ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే దాదాపు సోలో రిలీజ్ ఉండేలా చూసుకుంటారు. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకేసారి ఇద్దరు హీరోల సినిమాలు రిలీజైతే కలెక్షన్స్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఎవరూ కూడా తొందరపడడం లేదు. నిదానంగా తమ సినిమాలను రిలీజ్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోల దృష్టి ఒకే డేట్ పై పడిందని తెలుస్తోంది. కోలీవుడ్ లో స్టార్ హీరోలుగా చెలామణి అవుతోన్న సూపర్ స్టార్ రజినీకాంత్, అజిత్ కుమార్ బాక్సాఫీస్ వద్ద పోటీకి రెడీ అవుతున్నారని సమాచారం.
తమిళనాట దీపావళి, సంక్రాంతి పెద్ద పండుగలు. గతంలో దీపావళికి రెండు సినిమాలు విడుదలైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అలానే పోటీ పడాలనుకుంటున్నారు. రజినీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ సినిమాను నవంబర్ 4న విడుదల చేయనున్నారు. అలానే అజిత్ ‘వాలిమై’ కూడా అదే డేట్ కి వస్తుందని అంటున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా.. అది సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది.
ఇప్పుడు ఈ సినిమాను రజినీకాంత్ సినిమాకి పోటీగా తీసుకురావాలనుకుంటున్నారు. హెచ్.వినోత్ డైరెక్ట్ చేస్తోన్న ‘వాలిమై’ చిత్రాన్ని బోనీకపూర్ నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. కానీ డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం దీపావళికి సినిమాను విడుదల చేస్తామని సంకేతాలు పంపిస్తున్నారు.
This post was last modified on July 17, 2021 8:37 am
టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…