ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే దాదాపు సోలో రిలీజ్ ఉండేలా చూసుకుంటారు. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకేసారి ఇద్దరు హీరోల సినిమాలు రిలీజైతే కలెక్షన్స్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఎవరూ కూడా తొందరపడడం లేదు. నిదానంగా తమ సినిమాలను రిలీజ్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోల దృష్టి ఒకే డేట్ పై పడిందని తెలుస్తోంది. కోలీవుడ్ లో స్టార్ హీరోలుగా చెలామణి అవుతోన్న సూపర్ స్టార్ రజినీకాంత్, అజిత్ కుమార్ బాక్సాఫీస్ వద్ద పోటీకి రెడీ అవుతున్నారని సమాచారం.
తమిళనాట దీపావళి, సంక్రాంతి పెద్ద పండుగలు. గతంలో దీపావళికి రెండు సినిమాలు విడుదలైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అలానే పోటీ పడాలనుకుంటున్నారు. రజినీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ సినిమాను నవంబర్ 4న విడుదల చేయనున్నారు. అలానే అజిత్ ‘వాలిమై’ కూడా అదే డేట్ కి వస్తుందని అంటున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా.. అది సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది.
ఇప్పుడు ఈ సినిమాను రజినీకాంత్ సినిమాకి పోటీగా తీసుకురావాలనుకుంటున్నారు. హెచ్.వినోత్ డైరెక్ట్ చేస్తోన్న ‘వాలిమై’ చిత్రాన్ని బోనీకపూర్ నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. కానీ డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం దీపావళికి సినిమాను విడుదల చేస్తామని సంకేతాలు పంపిస్తున్నారు.
This post was last modified on July 17, 2021 8:37 am
ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13 విడుదలను లాక్ చేసుకుని ఆ మేరకు తమిళనాడు…
సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గురించి తెలుగు నాట తెలియనివారెవరు.? మీడియాకి సంబంధించి ‘సీఈవో’ అన్న పదానికి పెర్ఫెక్ట్ నిర్వచనంగా రవిప్రకాష్…
బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు గన్న…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం…
పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్డేట్స్…