ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే దాదాపు సోలో రిలీజ్ ఉండేలా చూసుకుంటారు. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకేసారి ఇద్దరు హీరోల సినిమాలు రిలీజైతే కలెక్షన్స్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఎవరూ కూడా తొందరపడడం లేదు. నిదానంగా తమ సినిమాలను రిలీజ్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోల దృష్టి ఒకే డేట్ పై పడిందని తెలుస్తోంది. కోలీవుడ్ లో స్టార్ హీరోలుగా చెలామణి అవుతోన్న సూపర్ స్టార్ రజినీకాంత్, అజిత్ కుమార్ బాక్సాఫీస్ వద్ద పోటీకి రెడీ అవుతున్నారని సమాచారం.
తమిళనాట దీపావళి, సంక్రాంతి పెద్ద పండుగలు. గతంలో దీపావళికి రెండు సినిమాలు విడుదలైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అలానే పోటీ పడాలనుకుంటున్నారు. రజినీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ సినిమాను నవంబర్ 4న విడుదల చేయనున్నారు. అలానే అజిత్ ‘వాలిమై’ కూడా అదే డేట్ కి వస్తుందని అంటున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా.. అది సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది.
ఇప్పుడు ఈ సినిమాను రజినీకాంత్ సినిమాకి పోటీగా తీసుకురావాలనుకుంటున్నారు. హెచ్.వినోత్ డైరెక్ట్ చేస్తోన్న ‘వాలిమై’ చిత్రాన్ని బోనీకపూర్ నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. కానీ డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం దీపావళికి సినిమాను విడుదల చేస్తామని సంకేతాలు పంపిస్తున్నారు.
This post was last modified on July 17, 2021 8:37 am
కెరీర్లో చాలా ఏళ్లు పక్కింటి కుర్రాడి పాత్రలే చేస్తూ వచ్చాడు నేచురల్ స్టార్ నాని. కానీ ‘దసరా’ చిత్రంతో తన…
స్టేజ్ ఎక్కగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది కొందరికి. మైక్ పట్టుకుని ఏదేదో మాట్లాడేస్తారు. ఇది సోషల్ మీడియా కాలం…
తమిళంలో నంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు విజయ్. కానీ ఇక్కడ…
కాస్త స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరోకైనా.. పేరు వెనుక ఏదో ఒక ట్యాగ్ ఉండాల్సిందే. ఐతే ఒక మోస్తరుగా…
రాష్ట్ర బీజేపీలో నాయకుల నియామకం.. కొత్తగా వచ్చే వారికి అవకాశం ఇవ్వడం... ఉన్న వారికి పనులు కేటాయించడం.. అనేది సహజం.…
ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. తాజాగా…