‘బాహుబలి’ కోసం ఐదేళ్లు పెట్టిన ప్రభాస్.. ఆ తర్వాతి చిత్రం ‘సాహో’ను త్వరగానే లాగించేయాలనుకున్నాడు కానీ.. అది కూడా రెండేళ్లకు పైగా సమయాన్ని తినేసింది. ‘రాధేశ్యామ్’ను అయినా సాధ్యమైంత వేగంగా పూర్తి చేద్దామనుకుంటే.. కరోనా మహమ్మారి పుణ్యమా అని అది కూడా రెండేళ్ల ప్రాజెక్టుగా మారిపోయింది.
బ్రేకులిచ్చి ఇచ్చి షూటింగ్ చేస్తూ వస్తున్నారు. ఇంకా కొంత షూట్ మిగిలే ఉంది. ఇటీవలే ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ పున:ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. కథానాయిక పూజా హెగ్డే తాను ‘రాధేశ్యామ్’ చిత్రీకరణలో పాల్గొంటున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించింది కూడా.
ఐతే ఈ షూట్లో ప్రభాస్ పాల్గొంటున్నాడా లేదా అన్నది స్పష్టత లేదు. ఐతే చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ప్రభాస్ ఇంకా సెట్లో అడుగు పెట్టలేదట. ఈ నెల 23న అతను ‘రాధేశ్యామ్’ టీంతో కలుస్తాడన్నది తాజా అప్డేట్.
ప్రభాస్ పాత్రకు సంబంధించి సరిగ్గా రెండు వారాల చిత్రీకరణ మిగిలి ఉందని.. ప్రభాస్ విరామం లేకుండా రెండు వారాలు పని చేస్తాడని.. ఆగస్టు 5వ తేదీకి అతడి పాత్రతో పాటు సినిమా మొత్తం షూటింగ్ దాదాపుగా పూర్తయిపోతుందని సమాచారం. ఇక వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పున:ప్రారంభిస్తారని.. ఇప్పటికే కొంత వర్క్ జరిగిన నేపథ్యంలో వచ్చే నెల చివరికి సినిమా రెడీ అయిపోవచ్చని అంటున్నారు.
దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకుని సాధారణ స్థితిలో ఎప్పుడు నడిస్తే అప్పుడు ‘రాధేశ్యామ్’ను రిలీజ్ చేసేయాలని యువి క్రియేషన్స్ చూస్తోంది. నిజానికి ఈ చిత్రాన్ని ఈ నెల 30న రిలీజ్ చేయాల్సింది. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు డేట్ మార్చుకోక తప్పలేదు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రం పునర్జన్మల నేపథ్యంలో నడుస్తుందని సమాచారం. ఎక్కువగా ఇటలీలో చిత్రీకరణ జరుపుకుందీ చిత్రం.
This post was last modified on July 16, 2021 5:16 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…