తెలుగులో మన స్టార్ హీరోలతో సమానంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సూర్య ఓ దశలో. అతడి మార్కెట్ రూ.20 కోట్ల దాకా కూడా వెళ్లింది ఒకానొక టైంలో. కానీ దాన్ని అతను నిలబెట్టుకోలేకపోయాడు. అయినప్పటికీ సూర్య మీద ఇంకా మన ప్రేక్షకుల్లో అభిమానం నిలిచి ఉంది. మన తెలుగమ్మాయే డైరెక్ట్ చేసిన ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంతో బౌన్స్ బ్యాక్ కావాలని అతను చూస్తున్నాడు.
ఈ చిత్ర టీజర్ కూడా ఆసక్తికరంగా అనిపించింది. లాక్ డౌన్ లేకుంటే ఈ వేసవిలోనే ఆ చిత్రం విడుదల కావాల్సింది. మళ్లీ థియేటర్లు తెరుచుకుని, జనాలు మామూలుగా థియేటర్లకు వచ్చే సమయానికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఖాళీ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ అంతా పూర్తి చేసి ఫస్ట్ కాపీ రెడీ చేసేయాలని చూస్తున్నారు. తెలుగు డబ్బింగ్ పనులు కూడా నడుస్తున్నాయి.
‘ఆకాశమే నీ హద్దురా’కు సంబంధించి పెద్ద విశేషం ఏంటంటే.. ఇందులో సూర్య పాత్రకు ఓ ప్రముఖ తెలుగు నటుడు డబ్బింగ్ చెప్పబోతున్నాడు. అతనెవరో కాదు.. సత్యదేవ్. నటుడిగా మంచి స్థాయిలోనే ఉన్న అతను సూర్యకు డబ్బింగ్ చెప్పడానికి అంగీకరించాడు. ఇంతకుముందు నాని ఇలాగే ‘ఓకే బంగారం’లో దుల్కర్ సల్మాన్కు డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. సూర్యకు గతంలో శ్రీనివాసమూర్తి అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్ ఇచ్చేవాడు.
తర్వాత కొన్ని సినిమాల నుంచి సూర్యనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి ‘ఆకాశమే..’ విషయంలో ఎందుకు తన వాయిస్ వద్దనుకున్నాడో తెలియదు మరి. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా’. ఇంతకుముందు ‘గురు’ చిత్రాన్ని రూపొందించిన సుధ కొంగర ఈ సినిమాను డైరెక్ట్ చేసింది.
This post was last modified on May 23, 2020 10:06 am
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…