టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను వదిలారు. తొలిసారి మెగా, నందమూరి హీరోలు తెరపై కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కాంబినేషన్ లో ఓ షోని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
కొన్నాళ్లక్రితం బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ అనే షోని ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. స్టార్ మాలో టెలికాస్ట్ అయిన ఈ షోని నాగార్జున, చిరంజీవి హోస్ట్ చేశారు. రేటింగులు సరిగ్గా రాకపోవడంతో షోని నిలిపివేశారు. ఇప్పుడు ఆ షో హక్కులను జెమినీ టీవీ తీసుకుంది. ఎన్టీఆర్ హోస్ట్ గా షోని ప్లాన్ చేసింది. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే పేరుతో ఈ షోని ప్రసారం చేయనున్నారు. అయితే ఈ షోలకు సామాన్యులతో పాటు అప్పుడప్పుడు సెలబ్రిటీలను కూడా తీసుకొస్తుంటారు.
హాట్ సీట్ లో వాళ్లను కూర్చోపెట్టి షోకి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగానే రామ్ చరణ్ ను గెస్ట్ గా తీసుకురాబోతున్నారు. ఈ మేరకు ప్లాన్ చేసిన ఎపిసోడ్ ను ఈరోజు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారమవుతుందనే విషయంలో క్లారిటీ లేదు. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ సమయం వరకు వెయిట్ చేస్తారా..? లేక ఇప్పుడే ప్రసారం చేసేస్తారా చూడాలి!
This post was last modified on July 15, 2021 5:58 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…