టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను వదిలారు. తొలిసారి మెగా, నందమూరి హీరోలు తెరపై కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కాంబినేషన్ లో ఓ షోని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
కొన్నాళ్లక్రితం బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ అనే షోని ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. స్టార్ మాలో టెలికాస్ట్ అయిన ఈ షోని నాగార్జున, చిరంజీవి హోస్ట్ చేశారు. రేటింగులు సరిగ్గా రాకపోవడంతో షోని నిలిపివేశారు. ఇప్పుడు ఆ షో హక్కులను జెమినీ టీవీ తీసుకుంది. ఎన్టీఆర్ హోస్ట్ గా షోని ప్లాన్ చేసింది. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే పేరుతో ఈ షోని ప్రసారం చేయనున్నారు. అయితే ఈ షోలకు సామాన్యులతో పాటు అప్పుడప్పుడు సెలబ్రిటీలను కూడా తీసుకొస్తుంటారు.
హాట్ సీట్ లో వాళ్లను కూర్చోపెట్టి షోకి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగానే రామ్ చరణ్ ను గెస్ట్ గా తీసుకురాబోతున్నారు. ఈ మేరకు ప్లాన్ చేసిన ఎపిసోడ్ ను ఈరోజు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారమవుతుందనే విషయంలో క్లారిటీ లేదు. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ సమయం వరకు వెయిట్ చేస్తారా..? లేక ఇప్పుడే ప్రసారం చేసేస్తారా చూడాలి!
This post was last modified on July 15, 2021 5:58 pm
రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవిపై మోజులేదు. నేనే చెప్పి ఒప్పించా. వచ్చే ఎన్నికల్లోనే రాహుల్ ను ప్రదానిని చేసేందుకు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఘన విజయం సాధించింది. ఫలితంగా సినిమాల్లో…
దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిచ్చిపట్టిన, ప్రమాదకరంగా మారిన కుక్కలకు…
తెలుగులో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీస్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా కచ్చితంగా ఉంటుంది. లెజెండరీ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు కెరీర్ పీక్స్లో ఉండగా…
ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో సోమవారం ఓ కీలక భేటీ జరిగింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు…
‘స్పిరిట్’లో ప్రభాస్, వివేక్ ఒబెరాయ్ మధ్య జరిగే ఫైట్ కేవలం ఒక ఫైట్ కాదు. ఇది రెండు పవర్ సెంటర్ల…