టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను వదిలారు. తొలిసారి మెగా, నందమూరి హీరోలు తెరపై కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కాంబినేషన్ లో ఓ షోని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
కొన్నాళ్లక్రితం బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ అనే షోని ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. స్టార్ మాలో టెలికాస్ట్ అయిన ఈ షోని నాగార్జున, చిరంజీవి హోస్ట్ చేశారు. రేటింగులు సరిగ్గా రాకపోవడంతో షోని నిలిపివేశారు. ఇప్పుడు ఆ షో హక్కులను జెమినీ టీవీ తీసుకుంది. ఎన్టీఆర్ హోస్ట్ గా షోని ప్లాన్ చేసింది. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే పేరుతో ఈ షోని ప్రసారం చేయనున్నారు. అయితే ఈ షోలకు సామాన్యులతో పాటు అప్పుడప్పుడు సెలబ్రిటీలను కూడా తీసుకొస్తుంటారు.
హాట్ సీట్ లో వాళ్లను కూర్చోపెట్టి షోకి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగానే రామ్ చరణ్ ను గెస్ట్ గా తీసుకురాబోతున్నారు. ఈ మేరకు ప్లాన్ చేసిన ఎపిసోడ్ ను ఈరోజు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారమవుతుందనే విషయంలో క్లారిటీ లేదు. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ సమయం వరకు వెయిట్ చేస్తారా..? లేక ఇప్పుడే ప్రసారం చేసేస్తారా చూడాలి!
This post was last modified on July 15, 2021 5:58 pm
సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…
పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం ఇటీవల పెద్ద సమస్యగా మారుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు…
అధికారంలోకి రాకముందు.. ప్రజల మధ్య ఉండే పార్టీల గురించి తెలుసు. కానీ, అధికారం వచ్చిన తర్వాత కూడా నిరంతరం ప్రజలను…
"రూపాయి విలువ పడిపోయింది" అనే వార్త చూడగానే.. "మనకేంటిలే, మనం ఇండియాలోనే ఉన్నాం కదా" అని లైట్ తీసుకుంటే పొరపాటే.…
రాయ్పూర్ వేదికగా మరోసారి విరాట్ కోహ్లీ బ్యాట్ గర్జించింది. "కోహ్లీ పని అయిపోయింది, వయసు మీద పడింది" అని విమర్శించే…
ఒకే కుటుంబం నుంచి రెండు తరాలకు చెందిన స్టార్ హీరోలతో జోడిగా నటించే ఛాన్స్ అందరికీ రాదు. అప్పుడెప్పుడో శ్రీదేవి…