బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వస్తే.. ఇటీవల కరీనా తన ప్రెగ్నన్సీ అనుభవాన్ని పుస్తక రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
“కరీనా కపూర్ ఖాన్స్ ప్రగ్నెన్సీ బైబిల్” అనే పేరుతో ఈ పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ బుక్ తనకు బిడ్డతో సమానమని చెప్పింది. అలాంటిది ఇప్పుడు ఆ పుస్తకం కారణంగానే ఆమె చిక్కుల్లో పడింది.
ఈ బుక్ టైటిల్ క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ కరీనా కపూర్ పై శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రకు చెందిన పలు క్రిస్టియన్ సంఘాలు కరీనాపై మండిపడుతున్నాయి.
అల్ఫా, ఒమెగా క్రిస్టియన్ మహాసంగ్ అధ్యక్షుడు ఆశిష్ షిండే కరీనాపై ఫిర్యాదు చేసినట్లు బీడ్ లోని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ శ్రీనాథ్ తంభోర్ మీడియాకు వెల్లడించారు. కరీనాతో పాటు ఈ బుక్ రాసిన మరో రచయిత అదితి షా భీమ్జనిపై కూడా కేసు నమోదైంది.
ఈ బుక్ టైటిల్ పవిత్ర గ్రంథమైన బైబిల్ ని అవమానించేలా ఉందని ఆశిష్ షిండే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారే తప్ప.. ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేయలేదని తెలుస్తోంది. నిజానికి ఈ కేసు ముంబై పరిధిలోకి వస్తుందని.. తమ స్టేషన్ పరిధిలోకి రాదని అధికారులు ఆశిష్ షిండేకి చెప్పినట్లు తెలుస్తోంది. ముంబైలో కేసు నమోదు చేయాల్సిందిగా అధికారులు సలహా ఇచ్చారట. మరి ఈ కేసుపై కరీనా ఎలా స్పందిస్తుందో చూడాలి!
This post was last modified on July 14, 2021 10:27 pm
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…