బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వస్తే.. ఇటీవల కరీనా తన ప్రెగ్నన్సీ అనుభవాన్ని పుస్తక రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
“కరీనా కపూర్ ఖాన్స్ ప్రగ్నెన్సీ బైబిల్” అనే పేరుతో ఈ పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ బుక్ తనకు బిడ్డతో సమానమని చెప్పింది. అలాంటిది ఇప్పుడు ఆ పుస్తకం కారణంగానే ఆమె చిక్కుల్లో పడింది.
ఈ బుక్ టైటిల్ క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ కరీనా కపూర్ పై శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రకు చెందిన పలు క్రిస్టియన్ సంఘాలు కరీనాపై మండిపడుతున్నాయి.
అల్ఫా, ఒమెగా క్రిస్టియన్ మహాసంగ్ అధ్యక్షుడు ఆశిష్ షిండే కరీనాపై ఫిర్యాదు చేసినట్లు బీడ్ లోని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ శ్రీనాథ్ తంభోర్ మీడియాకు వెల్లడించారు. కరీనాతో పాటు ఈ బుక్ రాసిన మరో రచయిత అదితి షా భీమ్జనిపై కూడా కేసు నమోదైంది.
ఈ బుక్ టైటిల్ పవిత్ర గ్రంథమైన బైబిల్ ని అవమానించేలా ఉందని ఆశిష్ షిండే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారే తప్ప.. ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేయలేదని తెలుస్తోంది. నిజానికి ఈ కేసు ముంబై పరిధిలోకి వస్తుందని.. తమ స్టేషన్ పరిధిలోకి రాదని అధికారులు ఆశిష్ షిండేకి చెప్పినట్లు తెలుస్తోంది. ముంబైలో కేసు నమోదు చేయాల్సిందిగా అధికారులు సలహా ఇచ్చారట. మరి ఈ కేసుపై కరీనా ఎలా స్పందిస్తుందో చూడాలి!
This post was last modified on July 14, 2021 10:27 pm
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…