బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వస్తే.. ఇటీవల కరీనా తన ప్రెగ్నన్సీ అనుభవాన్ని పుస్తక రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
“కరీనా కపూర్ ఖాన్స్ ప్రగ్నెన్సీ బైబిల్” అనే పేరుతో ఈ పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ బుక్ తనకు బిడ్డతో సమానమని చెప్పింది. అలాంటిది ఇప్పుడు ఆ పుస్తకం కారణంగానే ఆమె చిక్కుల్లో పడింది.
ఈ బుక్ టైటిల్ క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ కరీనా కపూర్ పై శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రకు చెందిన పలు క్రిస్టియన్ సంఘాలు కరీనాపై మండిపడుతున్నాయి.
అల్ఫా, ఒమెగా క్రిస్టియన్ మహాసంగ్ అధ్యక్షుడు ఆశిష్ షిండే కరీనాపై ఫిర్యాదు చేసినట్లు బీడ్ లోని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ శ్రీనాథ్ తంభోర్ మీడియాకు వెల్లడించారు. కరీనాతో పాటు ఈ బుక్ రాసిన మరో రచయిత అదితి షా భీమ్జనిపై కూడా కేసు నమోదైంది.
ఈ బుక్ టైటిల్ పవిత్ర గ్రంథమైన బైబిల్ ని అవమానించేలా ఉందని ఆశిష్ షిండే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారే తప్ప.. ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేయలేదని తెలుస్తోంది. నిజానికి ఈ కేసు ముంబై పరిధిలోకి వస్తుందని.. తమ స్టేషన్ పరిధిలోకి రాదని అధికారులు ఆశిష్ షిండేకి చెప్పినట్లు తెలుస్తోంది. ముంబైలో కేసు నమోదు చేయాల్సిందిగా అధికారులు సలహా ఇచ్చారట. మరి ఈ కేసుపై కరీనా ఎలా స్పందిస్తుందో చూడాలి!
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…