హిందీలో తాము తీసిన సినిమాలను మించి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో మంచి పేరు సంపాదించారు దర్శక ద్వయం రాజ్-డీకే. తెలుగు వారే అయిన ఈ ఇద్దరు దర్శకులు.. బాలీవుడ్లో కష్టపడి ఎదిగారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వాళ్ల పేర్లు ఇప్పుడు ఒక బ్రాండ్ అంటే అతిశయోక్తి కాదు. రాజ్-డీకే సొంతంగా తీసే సినిమాలైనా.. వాళ్లు నిర్మించే చిత్రాలైనా చాలా ప్రత్యేకంగా ఉంటాయన్న పేరుంది.
ఇక ఫ్యామిలీ మ్యాన్ సిరీస్తో వాళ్లకొచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొంది, అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించిన సిరీస్గా ఇది నిలిచిపోయింది. ఇటీవలే వచ్చిన సీజన్ 2 కూడా సూపర్ హిట్ కావడం తెలిసిందే.
దీని తర్వాత రాజ్-డీకే.. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో ఓ సిరీస్ తీయబోతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలు నిజమే అని రూఢి అయింది. షాహిద్ ప్రధాన పాత్రలో ఫేక్ అనే సిరీస్ తీయబోతున్నారట ఈ దర్శక ద్వయం. ఫేక్ కరెన్సీ రాకెట్ నేపథ్యంలో ఈ సిరీస్ నడుస్తుందట. వచ్చే ఏడాది ఓ ప్రముఖ ఓటీటీ కోసం ఈ సిరీస్ను మొదలుపెట్టనున్నారట.
ప్రస్తుతం రాజ్-డీకే ఫ్యామిలీ మ్యాన్-3 సన్నాహాల్లో ఉన్నారు. స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది. ఈసారి ఈ కథ భారత్పై చైనీయుల కుట్ర నేపథ్యంలో నడుస్తుంది. కోల్కతాలో కథ సాగుతుంది. ఈ దిశగా ఫ్యామిలీ మ్యాన్-2 చివర్లో సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది పూర్తయ్యాక ఫేక్ సిరీస్ను పట్టాలెక్కిస్తారు. షాహిద్ కపూర్కు ఇదే తొలి వెబ్ సిరీస్ కావడం విశేషం.
This post was last modified on July 14, 2021 10:37 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…