టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మొదటి నుండి కూడా సరికొత్త కథలను ఎన్నుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒకానొక సమయంలో వరుస హిట్స్ తో మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యారు. ఇప్పుడు కూడా వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా గడుపుతున్నారు.
ఇటీవలే ’18 పేజెస్’ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేశారు.
ఇదిలా ఉండగా.. నిఖిల్ ప్రస్తుతం ‘కార్తికేయ’ సీక్వెల్ లో నటిస్తున్నారు. 2014లో వచ్చిన ‘కార్తికేయ’ సినిమా ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఇంతకాలానికి ఈ సినిమాకి సీక్వెల్ రెడీ అవుతోంది. చందు మొండేటి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ను ఇటీవలే పునః ప్రారంభించారు. ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ ‘కార్తికేయ 2’. అయితే ఇప్పుడు దర్శక నిర్మాతలు ఈ సినిమాకి టైటిల్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
‘దైవం మనుష్య రూపేణా’ అనే టైటిల్ ను సినిమాకి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. నిఖిల్ కి కూడా టైటిల్ బాగా నచ్చిందట. కథ ప్రకారం ఈ సినిమాను ఇప్పటివరకు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఆగస్టు నుండి యూరప్, వియాత్నం వంటి దేశాల్లో చిత్రీకరించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on July 13, 2021 11:33 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…