మొత్తానికి ‘నారప్ప’ విడుదల విషయంలో ఓ స్పష్టత వచ్చేసింది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఈ చిత్రం ఓటీటీ రిలీజ్కు రెడీ అయిపోయింది. ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్లో ఈ నెల 20న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. స్వయంగా వెంకటేషే ఈ విషయాన్ని వెల్లడిస్తూ ట్వీట్ కూడా పెట్టాడు. ఐతే ఈ చిత్రం జులై 23 లేదా 24న వస్తుందని ముందు ప్రచారం జరిగింది.
మామూలుగా కొత్త చిత్రాలు విడుదలయ్యేది శుక్రవారం రోజే. థియేటర్లలో విడుదల చేసినా.. ఓటీటీలో వదిలినా నిర్మాతలు శుక్రవారం సెంటిమెంటును పాటిస్తుంటారు. పండుగలప్పుడు, ఇంకేమైనా విశేషమైన డేట్లు ఉన్నపుడు రోజులు మారుతుంటాయి కానీ.. అలాంటి ప్రత్యేక సందర్భం లేకుంటే శుక్రవారమే కొత్త చిత్రాలు విడుదలవుతుంటాయి. కానీ ‘నారప్ప’ను మాత్రం మంగళవారం రోజు రిలీజ్ చేస్తున్నారు.
పేరుకు మంగళవారం కానీ.. ఎప్పట్లాగే అమేజాన్ ప్రైమ్లో ముందు రోజు రాత్రి పది గంటల ప్రాంతంలో సినిమా రిలీజవుతుందని భావిస్తున్నారు. శుక్రవారం సెంటిమెంటు కాదని.. ఇలా ఎటూ కానీ రోజున ‘నారప్ప’ను ఎందుకు రిలీజ్ చేశారో జనాలకు అర్థం కావడం లేదు. బహుశా 23న, శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకుంటాయని భావిస్తున్న నేపథ్యంలో.. ఎగ్జిబిటర్ల అభీష్టానికి వ్యతిరేకంగా ఓటీటీ బాట పట్టిన ‘నారప్ప’ సినిమాను అదే రోజు ఓటీటీలో వదలడం బాగుండదని సురేష్ బాబు ముందే సినిమాను ప్రైమ్లో వదిలేస్తుండొచ్చు.
అసలు థియేటర్లు తెరుచుకున్నాక ఇలాంటి పెద్ద సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయడం కూడా బాగుండదని.. హడావుడిగా ప్రైమ్లోకి తెచ్చేస్తున్నట్లుగా ఉంది. ఎగ్జిబిటర్ల అసంతృప్తి నేపథ్యంలో ఎక్కువ హడావుడి చేయకుండా సైలెంటుగా సినిమాను రిలీజ్ చేసేయాలని సురేష్ బాబు చూస్తున్నట్లు సమాచారం.
This post was last modified on July 13, 2021 7:24 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…