బాలీవుడ్లో కొత్త కథలు పూర్తిగా అడుగంటి పోతున్నట్లే కనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే. సౌత్లో ఒక సినిమా హిట్టయిందంటే అది రీమేక్ కావాల్సిందే అన్నట్లుగా కనిపిస్తోంది వ్యవహారం. ఓ మోస్తరు సినిమాలను సైతం బాలీవుడ్ వాళ్లు వదలట్లేదు. ప్రస్తుతం హిందీలో రెండంకెల సంఖ్యలో సౌత్ సినిమాల రీమేక్లు తెరకెక్కుతున్నాయి.
తాజాగా మరో దక్షిణాది చిత్రం హిందీలోకి వెళ్లబోతోంది. ఆ చిత్రమే.. సూరారై పొట్రు. సూర్య ప్రధాన పాత్రలో తెలుగమ్మాయే అయిన సుధ కొంగర తమిళంలో రూపొందించిన ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో వచ్చింది. గత ఏడాది కొవిడ్ టైంలో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేస్తూ ఈ భారీ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్లో నేరుగా విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన వచ్చింది.
చాలా ఏళ్లుగా సరైన విజయం లేని సూర్యకు ఈ చిత్రం మంచి ఫలితాన్నందించింది. గత ఏడాది ఇండియాలో రిలీజైన అత్యుత్తమ చిత్రాల్లో దీన్నొకటిగా చెప్పొచ్చు. విడుదల తర్వాత క్లాసిక్ స్టేటస్ అందుకున్న ‘సూరారై పొట్రు’ను హిందీలోకి సూర్యనే తీసుకెళ్తున్నాడు.
సూర్య, ఆయన భార్య జ్యోతిక కలిసి ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ‘సూరారై పొట్రు’ను రీమేక్ చేయబోతున్నట్లు ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. ఐతే హిందీలో ఎవరు హీరోగా నటిస్తారు అన్నది ఇంకా వెల్లడించలేదు. దర్శకత్వం మాత్రం సుధనే చేయబోతోంది. ఇండియాలో కొత్త సినిమాలు పెద్దగా లేని టైంలో ప్రైమ్లో రిలీజైన ఈ చిత్రాన్ని ఉత్తరాది ప్రేక్షకులు కూడా బాగా చూశారు.
ఇప్పుడు ప్రైమ్లో నాలుగు భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ఇలాంటి సినిమాను మళ్లీ హిందీలోకి తీసుకెళ్తుండటం విశేషమే. ఐతే దక్షిణాది సినిమాల కథలు తీసుకుని.. వాటికి బాలీవుడ్ టచ్ ఇచ్చి కొంచెం భిన్నంగా ప్రెజెంట్ చేయడం బాలీవుడ్ వాళ్లకు అలవాటే. మరి ‘సూరారై పొట్రు’ హిందీ వెర్షన్లో ఎవరు నటిస్తారో చూడాలి.
This post was last modified on July 12, 2021 3:41 pm
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…
రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…
పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…
టాలీవుడ్లో ఒకప్పుడు టాప్-4 హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన హీరో.. అక్కినేని నాగార్జున. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లతో పోటాపోటీగా…
పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేశ ప్రజలు…
భారత దేశానికి శత్రుదేశాలపై యుద్ధాలు కొత్తకాదు.. ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్తకాదు. కానీ.. అందరినీ ఏకం చేయడంలోనూ.. అందరినీ ఒకే…