బాలీవుడ్లో కొత్త కథలు పూర్తిగా అడుగంటి పోతున్నట్లే కనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే. సౌత్లో ఒక సినిమా హిట్టయిందంటే అది రీమేక్ కావాల్సిందే అన్నట్లుగా కనిపిస్తోంది వ్యవహారం. ఓ మోస్తరు సినిమాలను సైతం బాలీవుడ్ వాళ్లు వదలట్లేదు. ప్రస్తుతం హిందీలో రెండంకెల సంఖ్యలో సౌత్ సినిమాల రీమేక్లు తెరకెక్కుతున్నాయి.
తాజాగా మరో దక్షిణాది చిత్రం హిందీలోకి వెళ్లబోతోంది. ఆ చిత్రమే.. సూరారై పొట్రు. సూర్య ప్రధాన పాత్రలో తెలుగమ్మాయే అయిన సుధ కొంగర తమిళంలో రూపొందించిన ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో వచ్చింది. గత ఏడాది కొవిడ్ టైంలో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేస్తూ ఈ భారీ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్లో నేరుగా విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన వచ్చింది.
చాలా ఏళ్లుగా సరైన విజయం లేని సూర్యకు ఈ చిత్రం మంచి ఫలితాన్నందించింది. గత ఏడాది ఇండియాలో రిలీజైన అత్యుత్తమ చిత్రాల్లో దీన్నొకటిగా చెప్పొచ్చు. విడుదల తర్వాత క్లాసిక్ స్టేటస్ అందుకున్న ‘సూరారై పొట్రు’ను హిందీలోకి సూర్యనే తీసుకెళ్తున్నాడు.
సూర్య, ఆయన భార్య జ్యోతిక కలిసి ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ‘సూరారై పొట్రు’ను రీమేక్ చేయబోతున్నట్లు ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. ఐతే హిందీలో ఎవరు హీరోగా నటిస్తారు అన్నది ఇంకా వెల్లడించలేదు. దర్శకత్వం మాత్రం సుధనే చేయబోతోంది. ఇండియాలో కొత్త సినిమాలు పెద్దగా లేని టైంలో ప్రైమ్లో రిలీజైన ఈ చిత్రాన్ని ఉత్తరాది ప్రేక్షకులు కూడా బాగా చూశారు.
ఇప్పుడు ప్రైమ్లో నాలుగు భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ఇలాంటి సినిమాను మళ్లీ హిందీలోకి తీసుకెళ్తుండటం విశేషమే. ఐతే దక్షిణాది సినిమాల కథలు తీసుకుని.. వాటికి బాలీవుడ్ టచ్ ఇచ్చి కొంచెం భిన్నంగా ప్రెజెంట్ చేయడం బాలీవుడ్ వాళ్లకు అలవాటే. మరి ‘సూరారై పొట్రు’ హిందీ వెర్షన్లో ఎవరు నటిస్తారో చూడాలి.
This post was last modified on July 12, 2021 3:41 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…