బాలీవుడ్లో కొత్త కథలు పూర్తిగా అడుగంటి పోతున్నట్లే కనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే. సౌత్లో ఒక సినిమా హిట్టయిందంటే అది రీమేక్ కావాల్సిందే అన్నట్లుగా కనిపిస్తోంది వ్యవహారం. ఓ మోస్తరు సినిమాలను సైతం బాలీవుడ్ వాళ్లు వదలట్లేదు. ప్రస్తుతం హిందీలో రెండంకెల సంఖ్యలో సౌత్ సినిమాల రీమేక్లు తెరకెక్కుతున్నాయి.
తాజాగా మరో దక్షిణాది చిత్రం హిందీలోకి వెళ్లబోతోంది. ఆ చిత్రమే.. సూరారై పొట్రు. సూర్య ప్రధాన పాత్రలో తెలుగమ్మాయే అయిన సుధ కొంగర తమిళంలో రూపొందించిన ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో వచ్చింది. గత ఏడాది కొవిడ్ టైంలో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేస్తూ ఈ భారీ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్లో నేరుగా విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన వచ్చింది.
చాలా ఏళ్లుగా సరైన విజయం లేని సూర్యకు ఈ చిత్రం మంచి ఫలితాన్నందించింది. గత ఏడాది ఇండియాలో రిలీజైన అత్యుత్తమ చిత్రాల్లో దీన్నొకటిగా చెప్పొచ్చు. విడుదల తర్వాత క్లాసిక్ స్టేటస్ అందుకున్న ‘సూరారై పొట్రు’ను హిందీలోకి సూర్యనే తీసుకెళ్తున్నాడు.
సూర్య, ఆయన భార్య జ్యోతిక కలిసి ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ‘సూరారై పొట్రు’ను రీమేక్ చేయబోతున్నట్లు ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. ఐతే హిందీలో ఎవరు హీరోగా నటిస్తారు అన్నది ఇంకా వెల్లడించలేదు. దర్శకత్వం మాత్రం సుధనే చేయబోతోంది. ఇండియాలో కొత్త సినిమాలు పెద్దగా లేని టైంలో ప్రైమ్లో రిలీజైన ఈ చిత్రాన్ని ఉత్తరాది ప్రేక్షకులు కూడా బాగా చూశారు.
ఇప్పుడు ప్రైమ్లో నాలుగు భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ఇలాంటి సినిమాను మళ్లీ హిందీలోకి తీసుకెళ్తుండటం విశేషమే. ఐతే దక్షిణాది సినిమాల కథలు తీసుకుని.. వాటికి బాలీవుడ్ టచ్ ఇచ్చి కొంచెం భిన్నంగా ప్రెజెంట్ చేయడం బాలీవుడ్ వాళ్లకు అలవాటే. మరి ‘సూరారై పొట్రు’ హిందీ వెర్షన్లో ఎవరు నటిస్తారో చూడాలి.
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…