టాలీవుడ్ సీనియర్ విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రాలు నారప్ప, దృశ్యం-2 ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్నట్లు కొన్ని రోజుల కిందట జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల డిజిటల్ హక్కులను అమేజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని.. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీల్లో నేరుగా ఈ చిత్రాలను విడుదల చేయబోతున్నారని వార్తలొచ్చాయి. రెండు చిత్రాలను కలిపి రూ.75 కోట్లకు నిర్మాత సురేష్ బాబు అమ్మేసినట్లు కూడా చెప్పుకున్నారు. ఐతే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
ఇదిలా ఉంటే.. పెద్ద నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎగ్జిబిటర్లు.. నారప్ప, దృశ్యం-2 డీల్స్ విషయంలో ఆగ్రహంతోనే ఉన్నారు. ఓటీటీల బాట పడితే థియేటర్ ఇండస్ట్రీ నాశనమవుతుందని.. నిర్మాతలు పునరాలోచించుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సురేష్ బాబు పునరాలోచనలో పడ్డారని.. ‘నారప్ప’ ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకుంటున్నారని తాజాగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఎగ్జిబిటర్ల ఒత్తిడికి సురేష్ బాబు తలొగ్గి ఉంటారని అంతా అనుకున్నారు. కానీ ఇది వాస్తవం కాదన్నది తాజా సమాచారం. ‘నారప్ప’ అమేజాన్ ప్రైమ్లోనే విడుదల కానుందట. ఈ నెల 24న రిలీజ్ చేయడానికి ముహూర్తం కూడా ఖరారైందట. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టర్లు సైతం కనిపిస్తుండటం విశేషం.
అమేజాన్ ప్రైమ్ ‘నారప్ప’ ఓటీటీ రిలీజ్ గురించి యాడ్స్ కూడా రెడీ చేసిందని.. ఈ సినిమా డీల్ విషయంలో వెనక్కి తగ్గేదేమీ లేదని.. పక్కాగా ‘నారప్ప’ ప్రైమ్లోనే వస్తుందని అంటున్నారు. ఈ విషయమై ఇంకొన్ని రోజుల్లోనే అధికారిక ప్రకటన వస్తుందని కూడా తెలుస్తోంది. మరి ‘నారప్ప’ లాంటి పెద్ద చిత్రాన్ని ఓటీటీ రిలీజ్కు రెడీ చేస్తే ఎగ్జిబిటర్లు ఎలా స్పందిస్తారు.. వారికి సురేష్ బాబు ఏమని సమాధానం ఇస్తారు అన్నది చూడాలి.
This post was last modified on July 12, 2021 7:22 am
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…