Movie News

‘నారప్ప’ ప్రైమ్‌లోనే..?

టాలీవుడ్ సీనియర్ విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రాలు నారప్ప, దృశ్యం-2 ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్నట్లు కొన్ని రోజుల కిందట జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల డిజిటల్ హక్కులను అమేజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని.. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీల్లో నేరుగా ఈ చిత్రాలను విడుదల చేయబోతున్నారని వార్తలొచ్చాయి. రెండు చిత్రాలను కలిపి రూ.75 కోట్లకు నిర్మాత సురేష్ బాబు అమ్మేసినట్లు కూడా చెప్పుకున్నారు. ఐతే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఇదిలా ఉంటే.. పెద్ద నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎగ్జిబిటర్లు.. నారప్ప, దృశ్యం-2 డీల్స్ విషయంలో ఆగ్రహంతోనే ఉన్నారు. ఓటీటీల బాట పడితే థియేటర్ ఇండస్ట్రీ నాశనమవుతుందని.. నిర్మాతలు పునరాలోచించుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సురేష్ బాబు పునరాలోచనలో పడ్డారని.. ‘నారప్ప’ ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకుంటున్నారని తాజాగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఎగ్జిబిటర్ల ఒత్తిడికి సురేష్ బాబు తలొగ్గి ఉంటారని అంతా అనుకున్నారు. కానీ ఇది వాస్తవం కాదన్నది తాజా సమాచారం. ‘నారప్ప’ అమేజాన్ ప్రైమ్‌లోనే విడుదల కానుందట. ఈ నెల 24న రిలీజ్ చేయడానికి ముహూర్తం కూడా ఖరారైందట. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టర్లు సైతం కనిపిస్తుండటం విశేషం.

అమేజాన్ ప్రైమ్ ‘నారప్ప’ ఓటీటీ రిలీజ్ గురించి యాడ్స్ కూడా రెడీ చేసిందని.. ఈ సినిమా డీల్ విషయంలో వెనక్కి తగ్గేదేమీ లేదని.. పక్కాగా ‘నారప్ప’ ప్రైమ్‌లోనే వస్తుందని అంటున్నారు. ఈ విషయమై ఇంకొన్ని రోజుల్లోనే అధికారిక ప్రకటన వస్తుందని కూడా తెలుస్తోంది. మరి ‘నారప్ప’ లాంటి పెద్ద చిత్రాన్ని ఓటీటీ రిలీజ్‌కు రెడీ చేస్తే ఎగ్జిబిటర్లు ఎలా స్పందిస్తారు.. వారికి సురేష్ బాబు ఏమని సమాధానం ఇస్తారు అన్నది చూడాలి.

This post was last modified on July 12, 2021 7:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

45 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

48 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago