తమిళంలో థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫాం ద్వారా రిలీజ్ కాబోతున్న తొలి పేరున్న సినిమా ‘పొన్ మగల్ వందాల్’. జ్యోతిక ప్రధాన పాత్రలో ఆమె భర్త సూర్య ఈ చిత్రాన్ని నిర్మించాడు. జేజే ఫ్రెడరిక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మే 29న ఈ సినిమా అమేజాన్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ట్రైలర్ కూడా వదిలారు. ఇదొక కోర్ట్ రూం డ్రామా అన్న సంగతి పోస్టర్లు చూస్తేనే అర్థమైపోతుంది.
ఈ కథ లోతుల్లోకి వెళ్తే.. ఐదుగురు పిల్లల్ని కిరాతకంగా హత్య చేసిన ఓ లేడీ సైకో కేసు విచారణ చుట్టూ నడుస్తుంది. హీరోయిన్ ఆ సైకో లేడీ తరఫునే వాదిస్తుంది. ఆ సైకోకు వ్యతిరేకంగా సాక్ష్యాలు పక్కాగా ఉండటంతో ఈ కేసు క్లోజ్ అయిపోయిందనే అంతా అనుకుంటారు. కానీ దీన్ని జ్యోతిక రీఓపెన్ చేయించి.. ఆమె తరఫున వాదించేందుకు సిద్ధమవుతుంది.
ఈ హత్యల తాలూకు బాధితులు ఆమెకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తారు. తనపైకి చెప్పులు కూడా విసురుతారు. ఐతే ఈ కేసులో అసలు దోషులు వేరని.. వాళ్లను తప్పించేందుకు నేరం ఆ అమ్మాయి మీదికి నెట్టేశారని హీరోయిన్ భావిస్తుంది. మరి అందుకు ఆమె ఏం చేసింది.. ఎలాంటి సాక్ష్యాలు సేకరించింది. కోర్టులో ఎలా వాదించి అసలు దోషుల్ని వెలుగులోకి తెచ్చింది అన్నది మిగతా కథ. అనేక ట్విస్టులతో కథనం ఉత్కంఠభరితంగా సాగుతుందని ట్రైలర్ను బట్టి అర్థమవుతోంది. జ్యోతిక స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది.
ఆమె సినిమాను తన భుజాల మీద నడిపించినట్లే ఉంది. పార్తీబన్, భాగ్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడం పట్ల థియేటర్ల యాజమాన్య సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం.. నిర్మాత సూర్యకు హెచ్చరికలు జారీ చేయడం తెలిసిందే. ఐతే తన సినిమా తన ఇష్టమంటూ నిర్మాతల మద్దతు సంపాదించి అమేజాన్లో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేశాడు సూర్య.
This post was last modified on May 22, 2020 2:28 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…