Movie News

మన సినిమా ‘కబాలి’ దర్శకుడికి నచ్చేసింది

తమిళంలో పా.రంజిత్ అనే దర్శకుడి శైలే వేరు. అతడి కథలన్నీ సామాజిక అంశాల చుట్టూనే తిరుగుతాయి. ముఖ్యంగా సమాజంలో అణగారిన వర్గాలపై అగ్ర వర్ణాల అఘాయిత్యాల చుట్టూ అతను తన కథల్ని నడుపుతాడు. దళిత సామాజిక వర్గానికి చెందిన అతను.. తన అనుభవాల సారాన్నంతా తన సినిమాల్లో చూపిస్తాడు.

సూపర్ స్టార్ రజనీకాంత్‌తో చేసిన రెండు సినిమాల్లో కూడా అతను అదే ప్రయత్నం చేశాడు. రజనీ సినిమాలు కదా అని కమర్షియల్ హంగుల కోసం రాజీ పడలేదు. ‘కబాలి’తో పాటు ‘కాలా’లోనూ హీరోను దళితుడిగా చూపించి.. ఆ వర్గం సమస్యల్ని ఎలివేట్ చేస్తూ, తన ఐడియాలజీనంతా ఆ సినిమాల ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు. సమాజానికి బలమైన సందేశం ఇవ్వడానికి చూశాడు. రంజిత్ నిర్మించిన ‘పరియేరుం పెరుమాల్’ సినిమా సైతం అతడి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లాగే ఉంటుంది.

ఐతే తెలుగులో ఈ తరహా ప్రయత్నాలు చాలా తక్కువ. ఈ మధ్య అయితే మరీ తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలో ‘పలాస 1978’ అనే సినిమాతో కొత్త దర్శకుడు కరుణ్ కుమార్ దళితుల సమస్యల్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు. రాంగ్ టైం రిలీజ్ వల్ల ఈ చిత్రం థియేటర్లలో సరిగా ఆడలేదు కానీ.. ఈ మధ్యే అమేజాన్ ప్రైంలో రిలీజై మంచి స్పందన తెచ్చుకుంది. ఈ సినిమా ఇప్పుడు రంజిత్ దృష్టిలో పడింది.

దీనిపై ప్రశంసలు కురిపిస్తూ అతను ట్వీట్ చేశాడు. తెలుగు సినిమా పరిశ్రమలో ‘పలాస 1978’ ఓ ముఖ్యమైన చిత్రం అని.. దళితుల కోణంలో చాలా నిజాయితీగా, వాస్తవికంగా ఈ సినిమాను తీర్చిదిద్దారని.. ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో మరిన్ని రావాలని ఆకాంక్షిస్తున్నానని రంజిత్ ట్వీట్ చేశాడు.

దర్శకుడు కరుణ్ కుమార్‌ను కూడా అతను అభినందించాడు. ఇంతవరకు తెలుగు సినిమాల గురించి ఎప్పుడూ మాట్లాడని రంజిత్.. తన లాగే దళితుల సమస్యల్ని చర్చిస్తూ కరుణ్ సినిమా తీసిన నేపథ్యంలో ఇలా ప్రశంసలు కురిపించాడు.

This post was last modified on May 22, 2020 11:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

49 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago