నటుడిగా కమల్ హాసన్ స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో ఆయన చేసిన పాత్రలు, ప్రయోగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి నటుడితో ఈ తరంలో మేటి నటులుగా గుర్తింపు పొందిన విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కలిసి ‘విక్రమ్’ సినిమా చేస్తుండటం సినీ ప్రియులకు ఎక్కడ లేని ఎగ్జైట్మెంట్ కలిగిస్తోంది. ఈ సినిమాలో సేతుపతి నటిస్తున్నట్లు ఇంతకుముందు వార్తలేమీ రాలేదు.
‘విక్రమ్’లో ఫాహద్ విలన్ అని మాత్రమే చెప్పుకున్నారు. దానికే ప్రేక్షకుల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఫాహద్ మలయాళ నటుడే కానీ.. గత దశాబ్ద కాలంలో అతను చేసిన అద్భుత పాత్రలతో దేశవ్యాప్త గుర్తింపు సంపాదించాడు. ముఖ్యంగా ఓటీటీల విప్లవం మొదలైన గత మూణ్నాలుగేళ్లలో ఫాహద్ ప్రతిభ వివిధ భాషల వాళ్లకు బాగా తెలిసిందే. కమల్ సినిమాలో అతను విలన్ అనగానే వారెవా ఏం కాంబినేషన్ అనుకున్నారు. తెరపై వీళ్లిద్దరూ తలపడితే ఆ మజానే వేరు అనిపించింది.
ఐతే ఇప్పుడు ఈ చిత్రంలో సేతుపతి కూడా ఉన్నాడు అని తెలిసేసరికి మూవీ లవర్స్ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఈ కాంబినేషన్ చూసి జనాలకు మెంటలెక్కిపోతోంది. సౌత్ ఇండియన్ ఆడియన్స్కు ఈ చిత్రం ఒక విజువల్ ఫీస్ట్ అనడంలో సందేహం లేదు.
ఇలాంటి ముగ్గురు నటుల్ని కలిపేలా లోకేష్ కనకరాజ్ ఏం కథ రాశాడు.. వాళ్ల పాత్రలు ఎలా ఉంటాయి.. పెర్ఫామెన్స్ విషయంలో ఈ ముగ్గురూ ఒకరితో ఒకరు పోటీ పడితే ఎలా ఉంటుంది అని అప్పుడే తెగ చర్చించేసుకుంటున్నారు జనాలు. కమల్, సేతుపతి, ఫాహద్ ముగ్గురూ కూడా ఆషామాషీ పాత్రలు ఒప్పుకునే రకం కాదు.
కాబట్టి వారి పాత్రలు ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే ఉంటాయని ఆశించవచ్చు. ఈ కాంబినేషన్ కారణంగా సినిమా మొదలవుతున్నపుడే అంచనాలు పతాక స్థాయికి వెళ్లిపోయాయి. ఇక రిలీజ్ టైంకి హైప్ ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయలేం. మరి ఈ హైప్కు తగ్గట్లే లోకేష్ కనకరాజ్ ఒక మెమొరబుల్ మూవీని అందిస్తారేమో చూద్దాం.
This post was last modified on July 11, 2021 12:06 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…