మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు కొరటాల శివ ‘ఆచార్య’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టి పరిస్థితులు నెమ్మదిగా మామూలు దశకు చేరుకుంటున్నాయి. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ‘ఆచార్య’ చివరి షెడ్యూల్ ను మొదలుపెట్టారు.
ఇదిలా ఉంటే అసలు ఈ సినిమా మల్టీస్టారర్ గా ఎలా మారిందనే దానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం తెలుస్తోంది. నిజానికి కొరటాల శివ ఈ సినిమాలో మహేష్ బాబు కోసం గెస్ట్ రోల్ రాసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు కూడా నటించడానికి ఒప్పుకున్నారట. కానీ చాలా కాలంగా మంచి కథ దొరికితే తన కొడుకుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుందామనుకున్న చిరంజీవికి ‘ఆచార్య’ పెర్ఫెక్ట్ కథ అనిపించిందట.
అందుకే వెంటనే కొరటాల శివను పిలిపించి మహేష్ కి బదులుగా చరణ్ ను తీసుకోవాలని.. తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా స్క్రిప్ట్ ను డెవలప్ చేయమని అడిగారట చిరు. మెగాస్టార్ అడిగేసరికి కాదనలేకపోయిన కొరటాల ఆయన చెప్పినట్లుగానే చరణ్ కోసం రోల్ ను మరింత పెంచి రాసుకున్నారు. కథ ప్రకారం సినిమాలో మెయిన్ ఎమోషన్స్ చరణ్ చుట్టూనే తిరుగుతాయని తెలుస్తోంది. సినిమాలో చరణ్ చేయాలనుకుని.. చేయలేకపోయిన దాన్ని ‘ఆచార్య’గా చిరంజీవి ఎలా కొనసాగించాడనేది స్టోరీ. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో కాజల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా కనిపించనున్నారు.
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…