Movie News

‘ఆచార్య’ మల్టీస్టారర్ గా ఎలా మారింది..?

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు కొరటాల శివ ‘ఆచార్య’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టి పరిస్థితులు నెమ్మదిగా మామూలు దశకు చేరుకుంటున్నాయి. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ‘ఆచార్య’ చివరి షెడ్యూల్ ను మొదలుపెట్టారు.

ఇదిలా ఉంటే అసలు ఈ సినిమా మల్టీస్టారర్ గా ఎలా మారిందనే దానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం తెలుస్తోంది. నిజానికి కొరటాల శివ ఈ సినిమాలో మహేష్ బాబు కోసం గెస్ట్ రోల్ రాసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు కూడా నటించడానికి ఒప్పుకున్నారట. కానీ చాలా కాలంగా మంచి కథ దొరికితే తన కొడుకుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుందామనుకున్న చిరంజీవికి ‘ఆచార్య’ పెర్ఫెక్ట్ కథ అనిపించిందట.

అందుకే వెంటనే కొరటాల శివను పిలిపించి మహేష్ కి బదులుగా చరణ్ ను తీసుకోవాలని.. తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా స్క్రిప్ట్ ను డెవలప్ చేయమని అడిగారట చిరు. మెగాస్టార్ అడిగేసరికి కాదనలేకపోయిన కొరటాల ఆయన చెప్పినట్లుగానే చరణ్ కోసం రోల్ ను మరింత పెంచి రాసుకున్నారు. కథ ప్రకారం సినిమాలో మెయిన్ ఎమోషన్స్ చరణ్ చుట్టూనే తిరుగుతాయని తెలుస్తోంది. సినిమాలో చరణ్ చేయాలనుకుని.. చేయలేకపోయిన దాన్ని ‘ఆచార్య’గా చిరంజీవి ఎలా కొనసాగించాడనేది స్టోరీ. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో కాజల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా కనిపించనున్నారు.

Satya

Recent Posts

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…

16 minutes ago

ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన అక్కర్లేదు

నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…

43 minutes ago

పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…

46 minutes ago

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…

1 hour ago

మళ్ళీ మౌనవ్రతం చేస్తున్న స్లమ్ డాగ్

పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా…

3 hours ago

సుకుమార్ వేసిన దారిలో ఎందరో

ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…

12 hours ago