Movie News

‘ఆచార్య’ మల్టీస్టారర్ గా ఎలా మారింది..?

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు కొరటాల శివ ‘ఆచార్య’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టి పరిస్థితులు నెమ్మదిగా మామూలు దశకు చేరుకుంటున్నాయి. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ‘ఆచార్య’ చివరి షెడ్యూల్ ను మొదలుపెట్టారు.

ఇదిలా ఉంటే అసలు ఈ సినిమా మల్టీస్టారర్ గా ఎలా మారిందనే దానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం తెలుస్తోంది. నిజానికి కొరటాల శివ ఈ సినిమాలో మహేష్ బాబు కోసం గెస్ట్ రోల్ రాసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు కూడా నటించడానికి ఒప్పుకున్నారట. కానీ చాలా కాలంగా మంచి కథ దొరికితే తన కొడుకుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుందామనుకున్న చిరంజీవికి ‘ఆచార్య’ పెర్ఫెక్ట్ కథ అనిపించిందట.

అందుకే వెంటనే కొరటాల శివను పిలిపించి మహేష్ కి బదులుగా చరణ్ ను తీసుకోవాలని.. తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా స్క్రిప్ట్ ను డెవలప్ చేయమని అడిగారట చిరు. మెగాస్టార్ అడిగేసరికి కాదనలేకపోయిన కొరటాల ఆయన చెప్పినట్లుగానే చరణ్ కోసం రోల్ ను మరింత పెంచి రాసుకున్నారు. కథ ప్రకారం సినిమాలో మెయిన్ ఎమోషన్స్ చరణ్ చుట్టూనే తిరుగుతాయని తెలుస్తోంది. సినిమాలో చరణ్ చేయాలనుకుని.. చేయలేకపోయిన దాన్ని ‘ఆచార్య’గా చిరంజీవి ఎలా కొనసాగించాడనేది స్టోరీ. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో కాజల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా కనిపించనున్నారు.

This post was last modified on July 11, 2021 10:38 am

Share
Show comments
Published by
satya

Recent Posts

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

39 mins ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

2 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

2 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

3 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

5 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

5 hours ago