దశాబ్దంన్నర కిందట దర్శక ధీరుడు రాజమౌళి, ప్రభాస్ల కాంబినేషన్లో వచ్చిన ‘ఛత్రపతి’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఆ చిత్రం తమిళం, కన్నడ భాషల్లో రీమేక్ అయి రెండు చోట్లా విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం హిందీలోకి వెళ్తున్న సంగతి తెలిసిందే.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. బాలీవుడ్లో పేరు మోసిన సంస్థ అయిన పెన్ మూవీస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ను నిర్మిస్తుండటం విశేషం.
ఈ రీమేక్ కోసం ‘ఛత్రపతి’ ఒరిజినల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా పని చేస్తున్నట్లు దర్శకుడు వి.వి.వినాయక్ వెల్లడించాడు. బాలీవుడ్లో ‘భజరంగి భాయిజాన్’, ‘మణికర్ణిక’ లాంటి చిత్రాలకు పని చేసిన విజయేంద్రకు హిందీ ప్రేక్షకుల అభిరుచిపై మంచి అవగాహనే ఉంది. ఈ అనుభవంతోనే ‘ఛత్రపతి’ రీమేక్కు ఇన్పుట్స్ ఇచ్చారని.. ఆయనతో కలిసి స్క్రిప్టు మీద చర్చించామని.. విజయేంద్ర కొన్ని మార్పులు చేర్పులు కూడా సూచించారని వినాయక్ వెల్లడించాడు.
తన టీంతో కలిసి ఎంతో కసరత్తు చేశాకే ఈ రీమేక్ను పట్టాలెక్కిస్తున్నట్లు వినాయక్ తెలిపాడు. ఐతే ‘ఛత్రపతి’ ఒరిజినల్ డైరెక్టర్ రాజమౌళికి ఖాళీ లేక ఈ సినిమా గురించి ఆయనతో మాట్లాడలేదని.. త్వరలోనే రాజమౌళితో ఒకసారి కూర్చుంటానని వినాయక్ చెప్పాడు.
ఇక ‘ఛత్రపతి’ని హిందీలో రీమేక్ చేయాలని తాను కానీ, బెల్లంకొండ శ్రీనివాస్ కానీ అనుకోలేదని.. ఆ ప్రాజెక్టే తమ వద్దకు వచ్చిందని వినాయక్ చెప్పాడు. శ్రీనివాస్ డబ్బింగ్ సినిమాల ద్వారా హిందీలో మంచి గుర్తింపు సంపాదించాడని.. పెన్ మూవీస్ అధినేత జయంతిలాల్ గడ దగ్గర చాన్నాళ్ల నుంచే ‘ఛత్రపతి’ రీమేక్ హక్కులున్నాయని.. ఆయనే శ్రీనివాస్తో ఈ సినిమా చేయాలని అనుకుని సంప్రదించాడని.. తర్వాత తాను ఈ ప్రాజెక్టులోకి వచ్చానని వినాయక్ తెలిపాడు. పెన్ మూవీస్లోనే తాను మరో సినిమా చేయబోతున్నానని.. దాని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని ఆయనన్నాడు.
This post was last modified on July 10, 2021 9:26 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…