దశాబ్దంన్నర కిందట దర్శక ధీరుడు రాజమౌళి, ప్రభాస్ల కాంబినేషన్లో వచ్చిన ‘ఛత్రపతి’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఆ చిత్రం తమిళం, కన్నడ భాషల్లో రీమేక్ అయి రెండు చోట్లా విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం హిందీలోకి వెళ్తున్న సంగతి తెలిసిందే.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. బాలీవుడ్లో పేరు మోసిన సంస్థ అయిన పెన్ మూవీస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ను నిర్మిస్తుండటం విశేషం.
ఈ రీమేక్ కోసం ‘ఛత్రపతి’ ఒరిజినల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా పని చేస్తున్నట్లు దర్శకుడు వి.వి.వినాయక్ వెల్లడించాడు. బాలీవుడ్లో ‘భజరంగి భాయిజాన్’, ‘మణికర్ణిక’ లాంటి చిత్రాలకు పని చేసిన విజయేంద్రకు హిందీ ప్రేక్షకుల అభిరుచిపై మంచి అవగాహనే ఉంది. ఈ అనుభవంతోనే ‘ఛత్రపతి’ రీమేక్కు ఇన్పుట్స్ ఇచ్చారని.. ఆయనతో కలిసి స్క్రిప్టు మీద చర్చించామని.. విజయేంద్ర కొన్ని మార్పులు చేర్పులు కూడా సూచించారని వినాయక్ వెల్లడించాడు.
తన టీంతో కలిసి ఎంతో కసరత్తు చేశాకే ఈ రీమేక్ను పట్టాలెక్కిస్తున్నట్లు వినాయక్ తెలిపాడు. ఐతే ‘ఛత్రపతి’ ఒరిజినల్ డైరెక్టర్ రాజమౌళికి ఖాళీ లేక ఈ సినిమా గురించి ఆయనతో మాట్లాడలేదని.. త్వరలోనే రాజమౌళితో ఒకసారి కూర్చుంటానని వినాయక్ చెప్పాడు.
ఇక ‘ఛత్రపతి’ని హిందీలో రీమేక్ చేయాలని తాను కానీ, బెల్లంకొండ శ్రీనివాస్ కానీ అనుకోలేదని.. ఆ ప్రాజెక్టే తమ వద్దకు వచ్చిందని వినాయక్ చెప్పాడు. శ్రీనివాస్ డబ్బింగ్ సినిమాల ద్వారా హిందీలో మంచి గుర్తింపు సంపాదించాడని.. పెన్ మూవీస్ అధినేత జయంతిలాల్ గడ దగ్గర చాన్నాళ్ల నుంచే ‘ఛత్రపతి’ రీమేక్ హక్కులున్నాయని.. ఆయనే శ్రీనివాస్తో ఈ సినిమా చేయాలని అనుకుని సంప్రదించాడని.. తర్వాత తాను ఈ ప్రాజెక్టులోకి వచ్చానని వినాయక్ తెలిపాడు. పెన్ మూవీస్లోనే తాను మరో సినిమా చేయబోతున్నానని.. దాని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని ఆయనన్నాడు.
This post was last modified on July 10, 2021 9:26 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…