తెలుగులో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ డైరెక్టర్-మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్లలో తేజ-ఆర్పీ పట్నాయక్లది ఒకటి. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘చిత్రం’ అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషనో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా ఘనవిజయాన్నందుకోవడంలో సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన నువ్వు నేను, జయం సైతం సంగీత పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ బ్లాక్బస్టర్లు అయ్యాయి. ఆపైనా వీళ్లిద్దరూ కలిసి కొన్ని సినిమాలు చేశారు కానీ.. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిన దూరమయ్యారు.
చివరగా తేజ, ఆర్పీ కలిసి చేసిన ‘ఔనన్నా కాదన్నా’ ఫ్లాపే అయింది కానీ.. అందులోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ అక్కడక్కడా ఆ పాటలు వినిపిస్తుంటాయి. తేజ సినిమా అంటే ఆర్పీ ఎంత శ్రద్ధ పెడతాడో ఆ సినిమా కూడా రుజువు చేసింది. ఐతే గత దశాబ్ద కాలంలో ఆర్పీ సంగీతాన్ని పక్కన పెట్టి దర్శకుడిగా ప్రయత్నాలు చేశాడు. అవి పెద్దగా ఫలితాన్నివ్వలేదు.
ఇప్పుడు ఆర్పీని సంగీత దర్శకుడిగా అందరూ దాదాపుగా మరిచిపోతున్న సమయంలో.. తేజ కోసం అతను మళ్లీ తన సంగీత పరిజ్ఞానాన్ని బయటికి తీయబోతున్నాడు. ఆర్పీ నుంచి విడిపోయాక అనూప్ రూబెన్స్ సహా మధ్యలో వేరే వేరే సంగీత దర్శకులతో పని చేసిన తేజ.. తిరిగి తన తొలి సినిమా మ్యూజిక్ డైరెక్టర్తో చేతులు కలిపాడు.
చివరగా ‘సీత’తో పలకరించిన ఆయన.. అగ్ర నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తీయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. దీనికి ఆర్పీనే మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా చిత్రీకరణ మధ్యప్రదేశ్లో మొదలు కాబోతోంది. షూటింగ్ ముంగిట అక్కడే సంగీత చర్చలు నడుస్తున్నాయి. తేజ, ఆర్పీలతో పాటు గేయ రచయిత చంద్రబోస్ కూడా ఈ చర్చల్లో పాల్గొంటున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది. మరి ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన తేజ-ఆర్పీ కాంబినేషన్లో ఈసారి ఎలాంటి ఆడియో వస్తుందో చూడాలి.
This post was last modified on July 9, 2021 1:36 pm
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…