నవరస.. సోషల్ మీడియాలో ఇప్పుడీ పేరు చర్చనీయాంశం అవుతోంది. ఇది నెట్ ఫ్లిక్స్ కోసం దిగ్గజ దర్శకుడు మణిరత్నం నిర్మించిన ఆంథాలజీ ఫిలిం. ఇందులో తొమ్మిది కథలుంటే.. వాటిని ప్రియదర్శన్, గౌతమ్ మీనన్ లాంటి ప్రముఖ దర్శకులు సహా తొమ్మిది మంది రూపొందించడం విశేషం. సూర్య, ప్రకాష్ రాజ్, విజయ్ సేతుపతి లాంటి మేటి నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 6న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శుక్రవారం ‘నవరస’ టీజర్ రిలీజ్ చేశారు. అది చూస్తే ‘నవరస’ రేంజ్ ఏంటో అర్థమవుతుంది.
సూర్య, ప్రకాష్ రాజ్, విజయ్ సేతుపతి, సిద్దార్థ్, యోగిబాబు, రేవతి, ఢిల్లీ గణేష్ లాంటి భారీ తారాగణాన్ని ఒక్కొక్కరిగా చూపిస్తూ వారితో వివిధ హావభావాలను పలికించారు. మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఈ టీజర్ సాగడం విశేషం. బ్యాగ్రౌండ్ అంతా నలుపులో ఉండి.. నటీనటుల హావభావాలు మినహా ఇంకేమీ హైలైట్ కాకుండా చూశారు. నవరసాలను ఆర్టిస్టుల హావభావాల్లోనే చూపించారు. అందరిలోకి సూర్య బాగా హైలైట్ అయ్యాడు టీజర్లో. ఈ ఆంథాలజీ ఫిలింలో మొత్తం తొమ్మిది కథలు ఉంటాయి. బహుశా నవరసాల్లో ఒక్కో రసాన్ని ఒక్కో కథ ఎలివేట్ చేసేలా ఉండొచ్చు. మణిరత్నంతో పాటు 180, నా నువ్వే చిత్రాల దర్శకుడు, యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర ఈ చిత్రాన్ని నిర్మించాడు.
కరోనా కారణంగా దెబ్బ తిన్న సినీ కార్మికులను ఆదుకునేందుకు మణిరత్నం ఈ చిత్రాన్ని గత ఏడాది ప్రకటించాడు. వీలైనంత ఎక్కువమందికి ఉపాధి కల్పించాడు. ‘నవరస’కు పని చేసిన నటీనటులు, టెక్నీషియన్లు పెద్దగా పారితోషకాలేమీ తీసుకోలేదని సమాచారం. ఈ తొమ్మిది కథల్లో ఒక్కోదాన్ని ప్రియదర్శన్, గౌతమ్ మీనన్, అరవింద్ స్వామి, కార్తీక్ సుబ్బరాజ్, కార్తీక్ నరేన్, బిజోయ్ నంబియార్, రతీంద్రన్ ప్రసాద్, సర్జున్, వసంత్ సాయి డైరెక్ట్ చేయడం విశేషం.ఎగ్జైటింగ్ కాస్ట్, టెక్నీషియన్లతో రాబోతున్న ఈ చిత్రం కచ్చితంగా సంచలనం సృష్టించే అవకాశముంది.
This post was last modified on July 9, 2021 12:55 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…