ఈ మధ్య కాలంలో ఓ సినిమాలో విలన్ పాత్ర చేయనున్న నటుడి గురించి అత్యంత చర్చ జరిగిందంటే పుష్ప సినిమా విషయంలోనే. ముందు విజయ్ సేతుపతితో మొదలై ఈ పాత్రకు చాలా పేర్లు వినిపించాయి. చివరికి మలయాళ విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్ను ఈ పాత్రకు ఓకే చేశారు. గత కొన్నేళ్లలో అద్భుతమైన పాత్రలతో నటుడిగా గొప్ప పేరే సంపాదించాడు ఫాహద్. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడంలో అతడి శైలే వేరు. అలాంటి మేటి నటుడిని సుకుమార్ సినిమాలో అల్లు అర్జున్తో తలపడే పాత్రలో చూడబోతుండటం పట్ల చాలా ఎగ్జైట్ అవుతున్నారు ప్రేక్షకులు.
పుష్ప విలన్గా ఫాహద్ పేరు ప్రకటించిన కొన్ని నెలలవుతోంది కానీ.. అతను ఇప్పటిదాకా షూటింగ్కు హాజరు కాలేదు. ఎట్టకేలకు అతను హైదరాబాద్లో అడుగు పెట్టాడు. పుష్ప టీంతో అతను కలిశాడు. జులై 8న, గురువారమే ఇది జరిగింది.
కాకపోతే ఫాహద్ నేరుగా పుష్ప సెట్స్లోకి వెళ్లిపోలేదు. అతడి మీద నేరుగా చిత్రీకరణ జరపట్లేదు సుకుమార్. ముందుగా లుక్ టెస్ట్, అలాగే ట్రయల్ షూట్ జరుగుతోంది. దీనికే కొన్ని రోజులు కేటాయించనున్నాడు. ఫాహద్ చేస్తున్న తొలి సినిమా ఇదే కావడం, పైగా నేపథ్యం కూడా కొత్తది కావడంతో కొంచెం హోమ్ వర్క్ చేశాకే రంగంలోకి దిగాలని అతను.. అలాగే సుకుమార్ భావించారట. అందుకే ఫాహద్ నేరుగా పుష్ప సెట్స్లోకి వెళ్లట్లేదని సమాచారం.
తెలుగు భాష, డైలాగుల విషయంలో కొంత కసరత్తు చేసి.. అలాగే పాత్రను అర్థం చేసుకుని.. లుక్ ఫైనలైజ్ చేసుకుని తర్వాత అతను షూటింగ్కు వస్తాడట. ఈ నెలాఖరుకు ఫాహద్ పుష్ప సెట్స్లోకి అడుగు పెట్టొచ్చని సమాచారం. ఈ లోపు ఫాహద్ ట్రయల్ షూట్ను పర్యవేక్షిస్తూనే.. అల్లు అర్జున్ అండ్ కోతో షూటింగ్ కొనసాగించనున్నాడు సుక్కు.
This post was last modified on July 9, 2021 11:03 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…