Movie News

జులై 23న‌ థియేట‌ర్ల రీస్టార్ట్?


తెలంగాణ‌లో లాక్ డౌన్ ఎత్తేసి రెండు వారాలు దాటింది. థియేట‌ర్లు న‌డుపుకోవ‌డానికి అనుమ‌తి కూడా ఉంది. ఏపీలో కూడా తాజాగా క‌ర్ఫ్యూ ష‌ర‌తులు స‌డ‌లించారు. అయితే రెండు చోట్లా ఇంకా థియేట‌ర్లు పునఃప్రారంభం కాలేదు. గ‌త ఏడాది లాక్ డౌన్ త‌ర్వాత థియేట‌ర్లు తెరిచే విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించిన తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిట‌ర్లు ఈసారి కూడా అదే ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. థియేట‌ర్ ఇండ‌స్ట్రీ బాగా దెబ్బ తిన్న నేప‌థ్యంలో ప‌రిశ్ర‌మ నుంచి, ప్ర‌భుత్వాల నుంచి మ‌ద్ద‌తు కోరుతున్నారు ఎగ్జిబిట‌ర్లు.

ఓవైపు కొత్త చిత్రాల‌ను నిర్మాత‌లు ఓటీటీల‌కు ఇవ్వ‌డం ఆపేయాల‌ని కోరుతూ.. మ‌రోవైపు క‌రెంటు బిల్లుల ర‌ద్దు, టికెట్ల రేట్ల విష‌యంలో వెసులుబాటు లాంటి డిమాండ్ల‌ను ప్ర‌భుత్వాల ముందు ఉంచుతున్నారు. వీటిపై వ‌చ్చే స్ప‌ష్ట‌త‌ను బ‌ట్టి ఇంకో రెండు వారాల్లో థియేట‌ర్లు తెరుచుకోవ‌చ్చ‌ని భావిస్తున్నారు.

మ‌రి కొన్ని రోజుల్లో రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాల నుంచి క‌రెంటు బిల్లుల ర‌ద్దు, టికెట్ల రేట్ల‌లో వెసులుబాటుకు సంబంధించి సినీ పెద్ద‌లు లిఖిత పూర్వ‌క విన్న‌పాలు అంద‌జేయ‌నున్నార‌ట‌. అగ్ర నిర్మాత సురేష్ బాబు నార‌ప్ప సినిమా ఓటీటీ డీల్‌ను ర‌ద్దు చేసుకుంటున్నార‌న్న ప్ర‌చారం సాగుతున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై ఒక‌ట్రెండు రోజుల్లో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఇదే జ‌రిగితే ఓటీటీ డీల్స్ విష‌యంలో మ‌రింత‌మంది వెన‌క్కి త‌గ్గుతార‌ని అంచ‌నా వేస్తున్నారు.

క‌రెంటు బిల్లుల ర‌ద్దు, టికెట్ల రేట్ల విష‌యంలో ప్ర‌భుత్వం నుంచి సానుకూల స్పంద‌న వ‌స్తే.. ఈ నెల 23న‌, సినిమాల‌కు క‌లిసొచ్చే శుక్ర‌వారం నాడు థియేట‌ర్ల‌ను పునఃప్రారంభిస్తార‌ని అంటున్నారు. తొలి వారం చెప్పుకోద‌గ్గ కొత్త చిత్రాలేమీ రిలీజ్ కాక‌పోవ‌చ్చు. త‌ర్వాతి వారానికి ఆల్రెడీ తిమ్మ‌ర‌సు సినిమా షెడ్యూల్ అయిన సంగ‌తి తెలిసిందే.

Satya

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

17 minutes ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

49 minutes ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

8 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

9 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

11 hours ago