తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేసి రెండు వారాలు దాటింది. థియేటర్లు నడుపుకోవడానికి అనుమతి కూడా ఉంది. ఏపీలో కూడా తాజాగా కర్ఫ్యూ షరతులు సడలించారు. అయితే రెండు చోట్లా ఇంకా థియేటర్లు పునఃప్రారంభం కాలేదు. గత ఏడాది లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరిచే విషయంలో ఆచితూచి వ్యవహరించిన తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు ఈసారి కూడా అదే ధోరణి ప్రదర్శిస్తున్నారు. థియేటర్ ఇండస్ట్రీ బాగా దెబ్బ తిన్న నేపథ్యంలో పరిశ్రమ నుంచి, ప్రభుత్వాల నుంచి మద్దతు కోరుతున్నారు ఎగ్జిబిటర్లు.
ఓవైపు కొత్త చిత్రాలను నిర్మాతలు ఓటీటీలకు ఇవ్వడం ఆపేయాలని కోరుతూ.. మరోవైపు కరెంటు బిల్లుల రద్దు, టికెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు లాంటి డిమాండ్లను ప్రభుత్వాల ముందు ఉంచుతున్నారు. వీటిపై వచ్చే స్పష్టతను బట్టి ఇంకో రెండు వారాల్లో థియేటర్లు తెరుచుకోవచ్చని భావిస్తున్నారు.
మరి కొన్ని రోజుల్లో రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి కరెంటు బిల్లుల రద్దు, టికెట్ల రేట్లలో వెసులుబాటుకు సంబంధించి సినీ పెద్దలు లిఖిత పూర్వక విన్నపాలు అందజేయనున్నారట. అగ్ర నిర్మాత సురేష్ బాబు నారప్ప సినిమా ఓటీటీ డీల్ను రద్దు చేసుకుంటున్నారన్న ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది. ఇదే జరిగితే ఓటీటీ డీల్స్ విషయంలో మరింతమంది వెనక్కి తగ్గుతారని అంచనా వేస్తున్నారు.
కరెంటు బిల్లుల రద్దు, టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తే.. ఈ నెల 23న, సినిమాలకు కలిసొచ్చే శుక్రవారం నాడు థియేటర్లను పునఃప్రారంభిస్తారని అంటున్నారు. తొలి వారం చెప్పుకోదగ్గ కొత్త చిత్రాలేమీ రిలీజ్ కాకపోవచ్చు. తర్వాతి వారానికి ఆల్రెడీ తిమ్మరసు సినిమా షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే.
This post was last modified on July 9, 2021 10:25 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…